భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం.. వచ్చే 48 గంటల్లో కీలక ప్రకటన..రెండు దేశాల డిమాండ్లు ఏంటంటే..

భారతదేశం- అమెరికా మధ్య ఒక ముఖ్యమైన మిని ట్రేడ్ డీల్ రాబోయే 48 గంటల్లో ఖరారు కానుంది. రెండు దేశాల మధ్య చర్చలు వాషింగ్టన్‌లో శరవేగంగా జరుగుతున్నాయి. అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ముగింపుకు సంబంధించి అనేక దశల్లో చర్చలు జరిగాయి. జూలై 9 కి కేవలం ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున, కేంద్ర ప్రభుత్వం మొదటి దశగా మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ముగించాలని ఆసక్తిగా ఉంది. ఈ విషయంలో, భారత అధికారులు అమెరికాతో చర్చలు జరపగా..అమెరికా అధికారులు భారతదేశాన్ని సందర్శించి పలుమార్లు చర్చలు జరిపారు.

48 గంటల్లో కీలక ఒప్పందం: ఈ నేపథ్యంలోనే భారత్- అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై రాబోయే 48 గంటల్లో సంతకం చేయనున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గత వారం అమెరికాను సందర్శించిన భారత అధికారుల బృందం తమ పర్యటనను పొడిగించింది. మధ్యంతర ఒప్పందాన్ని ఖరారు చేసే పని ముమ్మరం చేసింది. చర్చల్లో కొన్ని తీవ్రమైన అంశాలపై ఇప్పటికీ ఇద్దరి మధ్య సయోధ్య కుదరడం లేదు.

India US trade deal interim trade pact India US tariffs India US relations India US negotiations trade agreement India agriculture stance tariff deadline global trade news bilateral talks mini trade deal economic cooperation India US economy - -

అమెరికా డిమాండ్: జన్యుపరంగా మార్పు చేసిన (GM) పంటలు భారత మార్కెట్లోకి డంప్ చేయాలనేది అమెరికా డిమాండ్. అమెరికన్ ఉత్పత్తులు భారతదేశ వ్యవసాయం, పాడి రంగంలో ఎక్కువ శాతం ఉండాలని అమెరికా పట్టుబడుతోంది.అయితే GM పంటలు రైతుల భద్రత, ఆహార భద్రతకు ప్రమాదకరమని భారత్ భావిస్తోంది. దీంతో ఈ రెండు డిమాండ్లను వ్యతిరేకిస్తోంది. అమెరికన్ నుండి దిగుమతి అయ్యే పాడి పరిశ్రమ ఉత్పత్తులు గ్రామీణ జీవనోపాధిని, స్థానిక మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని భారత్ ఈ డిమాండును వ్యతిరేకిస్తోంది.

భారత్ డిమాండ్ : దుస్తులు, పాదరక్షలు, తోలు వంటి రంగాలపై US సుంకాలను తగ్గించడం లేదా మినహాయించడం అమెరికా చేయాలని భారత్ డిమాండ్ చేస్తోంది. ఈ రంగాలు దేశంలో పెద్ద మొత్తంలో చిన్న తరహా వ్యాపారులకు ఉపాధిని అందించడంతొ పాటుగా ఎగుమతుల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.ఈ నేపథ్యంలోనే మా డిమాండ్లను అంగీకరించడకుండా మీ డిమాండ్లపై సంతకం చేయమని మోదీ సర్కారు స్పష్టం చేసింది. ఇది భారతదేశ ఎగుమతి రంగానికి ప్రయోజనం కలిగించదని వాదిస్తోంది.

భారతదేశం అభిప్రాయం ప్రకారం..అధిక ఉపాధిని కలిగించే ఉత్పత్తులపై విస్తృతమైన సుంకాల రాయితీలు లేకపోతే, 2023 నాటికి భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్‌ డాలర్లకి పెంచడం సాధ్యం కాదు. ఈ వాణిజ్య ఒప్పందం కుదరకపోతే జూలై 9 తర్వాత అమెరికా అధిక సుంకాలను విధించే అవకాశముంది. ఇది భారతదేశ ఎగుమతులకు తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వస్త్ర, తోలు, వ్యవసాయ రంగాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి.

ఒప్పందం కుదిరితే, భారతదేశానికి అమెరికా మార్కెట్‌లో మరింత ప్రాప్యత లభిస్తుంది. రెండు దేశాల మధ్య వాణిజ్య పరిమాణం పెరుగుతాయి, పెట్టుబడులు కూడా వృద్ధి చెందుతాయి. 2026 నాటికి ఈ ఒప్పందం ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్‌ డాలర్లకి తీసుకెళ్లే దారిని సులభతరం చేస్తుంది. ఇది కేవలం కాగితపు ఒప్పందం మాత్రమే కాదు, అనేక రంగాల దిశను మార్చే ముఖ్యమైన అడుగు. రాబోయే 48 గంటలు కీలకంగా ఉంటాయి. పెట్టుబడిదారులు, ఎగుమతిదారులు, విధాన నిర్ణేతలు అందరూ ఈ చర్చల ఫలితాన్ని ఆసక్తిగా చూస్తున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+