జనవరి నుండి కొత్త గైడ్ లైన్స్, మీ డెబిట్, క్రెడిట్ కార్డు నెంబర్ గుర్తుండిపోతుంది..
కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ప్రకారం డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డులతో ట్రాన్సాక్షన్స్ జరిపిన ప్రతిసారి కస్టమర్లు తమ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులోని పదహారు డిజిటల్ నెంబర్లు చెప్పవలసి ఉంటుంది. స్టోరింగ్ డేటా లేని పేమెంట్స్ ఆపరేటర్ల వద్ద సర్వీస్ అందుకున్న కస్టమర్ల డేటా భద్రత కోసమే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధనలతో కూడిన మార్గదర్శకాలు వచ్చే ఏడాది జనవరి ఒకటవ తేదీ నుండి అమలులోకి వస్తున్నాయి.
ఖాతాదారులు వచ్చే జనవరి నుండి ట్రాన్సాక్షన్స్ జరిపిన ప్రతిసారి మీ డెబిట్ కార్డు నెంబర్లు, పాస్వర్డ్, సీవీవీ నెంబర్ వెల్లడించవలసి ఉంటుంది. ఈ మేరకు ఇప్పటివరకు ఉన్న ప్రతి డెబిట్ లేదా క్రెడిట్ కార్డు పైన కొత్త కార్డులు జారీ అవుతాయి. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయానికి ఆన్లైన్ పేమెంట్స్ సంస్థ UPI ఆమోదం తెలిపింది.
మరోవైపు, బ్యాంకుల్లో కస్టమర్ల డేటా స్టోరేజీ పాలసీపై మార్గదర్శకాలను RBI సవరించింది. ఈ అంశానికి సంబంధించి పేమెంట్ గేట్వే కంపెనీలు చేసిన ప్రతిపాదనను తిరస్కరించింది. తాజాగా సవరించిన గైడ్ లైన్స్ ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్, నెట్ఫ్లిక్స్ వంటి పేమెంట్ సంస్థలకు చేయూతనిస్తాయి. ఈ సంస్థల సర్వర్లు లేదా డేటా బేసిస్లో కస్టమర్ల వ్యక్తిగత సమాచారం నిల్వ చేశాయి.