ముంబై: దేశంలో వాహనాల ధరలు మరింత ప్రియం అయ్యాయి. వాటి ధరలకు రెక్కలు మొలిచాయి. ఒక తయారీ కంపెనీ తన కార్లు.. ఇతర వాహనాల ధరలను పెంచితే.. మిగిలినవన్నీ దాన్ని అనుసరించడం ఆటోమొబైల్ సెక్టార్లో ఎప్పుడూ ఉండేదే. అదే ఆనవాయితీ ఇప్పుడు మళ్లీ కనిపించనుంది. కొత్త సంవత్సరం తొలి నెలలోనే దీనికి ముహూర్తం పడింది. దేశంలో అత్యధికంగా విక్రయం అయ్యే కార్ల తయారీ కంపెనీగా పేరున్న మారుతి సుజుకితో ఈ పెరుగుదల ప్రారంభం కానుంది.

మారుతి సుజుకి వాహన రేట్లకు రెక్కలు..
మారుతి సుజుకి వాహనాల ధరలు పెరిగాయి. తక్షణమే అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు మారుతి సుజుకి యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. వాహనాల రేట్లను పెంచినట్లు ప్రకటించింది. అన్ని మోడల్స్ కార్ల రేట్లను పెంచినట్లు స్పష్టం చేసింది. 0.1 శాతం నుంచి 4.3 శాతం వరకు వాటి రేట్లను సవరించినట్లు వివరించింది.
కార్ల తయారీలో వినియోగించే పరికరాలు, విడి భాగాల ధరలు భారీగా పెరగడం వల్ల ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చినట్లు పేర్కొంది. ఇన్పుట్ కాస్ట్ విపరీతంగా పెరిగిందని, దాని ప్రభావం వాహనాల తయారీపై పడిందని తెలిపింది.

ఇన్పుట్ భారాన్ని కొంతమేరకైనా..
ఈ భారాన్ని కొంతమేరకైనా పంచుకోవాలనే ఉద్దేశంతోనే వాహన ధరలను పెంచాలని నిర్ణయించినట్లు మారుతి సుజుకి తేల్చి చెప్పింది. మారుతి సుజుకిలో బేసిక్ కార్ మోడల్గా పేరున్న ఆల్టో మొదలుకుని ఎస్-క్రాస్ వరకు అన్ని వాహనాల రేట్లనూ సవరించింది.
3.15 నుంచి 12.56 లక్షల రూపాయల వరకు వాటి రేట్లు ఉన్నాయి. గత సంవత్సరం మారుతి సుజుకి యాజమాన్యం మూడు సార్లు కార్ల రేట్లను పెంచింది. జనవరి-1.4, ఏప్రిల్-1.6, సెప్టెంబర్-1.9 శాతం మేర పెంచింది.

ఇప్పుడు ఏకంగా..
ఇప్పుడు మళ్లీ అదే ఆనవాయితీని అనుసరించింది. గతంతో పోల్చుకుంటే- ఈ దఫా ఏకంగా 4.3 శాతం వరకు కార్ల రేట్లను పెంచడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కార్లు, ఇతర వాహనాల తయారీ, సెకెండ్ హ్యాండ్ వాహనాలను కొనుగోలు చేయడం.. వాటిని విక్రయించడం, ఆటోమొబైల్ స్పేర్ పార్టులు, ఇతర కాంపొనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్, సేల్స్ సెక్టార్లో దేశంలోనే టాప్ బ్రాండింగ్ ఉన్న కంపెనీగా ఆవిర్భవించింది. దేశంంలోనే అత్యధిక సంఖ్యలో కార్లు, ఇతర వాహనాల విక్రయించే సంస్థగా పేరుంది మారుతి సుజుకికి.

భారీగా నెట్ ప్రాఫిట్..
నిజానికి- విడిభాగాలు, ఇతర పరికరాల రేట్లు, ఇన్పుట్ కాస్ట్ పెరగడం వల్ల మారుతి సుజుకికి పెద్దగా నష్టం కూడా వచ్చిన సందర్భం లేదు. జూన్ 30వ తేదీ నాటికి ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆశించిన మేర నెట్ ప్రాఫిట్ను అందుకుందా కంపెనీ. 475 కోట్ల రూపాయల మేర నెట్ ప్రాఫిట్ను నమోదు చేసింది. గత ఏడాదితో పోల్చితే- నెట్ ప్రాఫిట్ అసాధారణంగా పెరిగినట్టే. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే తొలి త్రైమాసిక కాలానికి 268.30 కోట్ల రూపాయల మేర నష్టాన్ని మారుతి సుజుకి చవి చూసింది.

విడిభాగాల ధరలతో..
విడి భాగాలు, ఇతర పరికరాల రేట్లు, ఇన్పుట్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయనే ఉద్దేశంతో- కార్లు, ఇతర వాహనాల రేట్లను పెంచబోతున్నట్లు స్పష్టం చేసింది. సెప్టెంబర్ నుంచే పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని తేల్చి చెప్పింది. ఒక కారును తయారు చేయడానికి అవసరమైన స్టీల్, ప్లాస్టిక్, అల్యూమినియం, కాపర్, ఇతర విలువైన మెటల్స్ ధరలు భారీగా పెరిగాయని, ఆ భారాన్ని తాము మోయలేకపోతున్నాంటూ మారుతి సుజుకి ముందు నుంచీ చెబుతూ వస్తోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications