దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL) ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 3,878 కోట్ల స్టాండ్లోన్ నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది గత ఏడాది కాలంతో పోలిస్తే 48 శాతం పెరిగింది. గత మూడు నెలల్లో కార్ల తయారీ సంస్థ రూ. 38,235 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. కంపెనీ త్రైమాసిక ఫలితాలతో పాటు ఒక్కో షేరుకు రూ. 125 డివిడెండ్ను ప్రకటించింది.
కంపెనీ తన అత్యధిక వార్షిక అమ్మకాల పరిమాణం, ఎగుమతులు, నికర అమ్మకాలు, నికర లాభం సాధించిందని ఎక్సేజ్ ఫైలింగ్ లో పేర్కొంది. మారుతి సుజుకి వార్షిక విక్రయాల పరిమాణం 2 మిలియన్ యూనిట్లను అధిగమించి, వరుసగా మూడవ సంవత్సరం PVలను ఎగుమతి చేసే అగ్రగామిగా నిలిచింది. మారుతీ సుజుకి 2030 నాటికి 8 లక్షల యూనిట్ల ఎగుమతి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. FY25లో దాని విదేశీ ఎగుమతులు 3 లక్షల యూనిట్లను దాటగలవని నమ్మకంగా ఉంది.

రెండు నెలల్లోపు రానున్న కొత్త ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అసాధారణ స్థాయికి నడిపిస్తుందని గట్టిగా నమ్ముతున్నట్లు ఛైర్మన్ ఆర్సి భార్గవ అన్నారు.మారుతీ సుజుకి ఇటీవలే హర్యానాలోని తన మానేసర్ ప్లాంట్లో తయారీ సామర్థ్యాన్ని సంవత్సరానికి 1 లక్ష యూనిట్లకు విస్తరించింది. దీనితో యూనిట్లో సంవత్సరానికి మొత్తం సామర్థ్యాన్ని 9 లక్షల వాహనాలకు తీసుకువెళ్లారు. న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న కంపెనీ 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 2 మిలియన్ యూనిట్ల వార్షిక మొత్తం విక్రయాల మైలురాయిని అధిగమించిందని వెల్లడించింది.
అంతేకాకుండా, ఇది వరుసగా 3వ సంవత్సరం అగ్ర ఎగుమతిదారుగా కొనసాగుతోంది. ఇప్పుడు భారతదేశం నుంచి మొత్తం ప్యాసింజర్ వాహనాల ఎగుమతుల్లో 41.8 శాతం వాటాను కలిగి ఉంది. ఏప్రిల్ 26న బిఎస్ఇలో మారుతీ సుజుకి షేర్లు 1.26 శాతం తగ్గి ఒక్కొక్కటి రూ.12,760 వద్ద ముగిసింది.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్.. దెబ్బకు దక్షిణ కొరియా మార్కెట్లో నిలిచినపోయిన ట్రేడింగ్..

Investment: మార్కెట్ ఒడిదుడుకులకు భయపడుతున్నారా? ఈ టైంలో ధనవంతులు ఏం చేస్తారో తెలుసా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!



Click it and Unblock the Notifications