మారుతీ కార్ల ధరల పెంపు, ఏ మోడల్ కారు ధర ఎంత పెరిగిందంటే.. వివరాలివిగో...
కరోనా వల్ల మార్కెట్ అంతంత మాత్రమే.. ఫుడ్ ఐటెమ్స్ తప్ప మిగతా కొనుగోలు కాస్త తక్కువే. ఇక విలాస వస్తువుల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కార్ల విక్రయాలు కూడా అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. కానీ కొన్ని ఎంపికచేసిన కార్ల ధరలు మాత్రం పెరుగుతున్నాయి. ముడిసరకు ధరల పెంపు వల్లే కార్ల ధరలు పెరిగినట్టు తెలుస్తోంది.
మారుతి సుజుకి కార్ల ధరలు దేశవ్యాప్తంగా రూ. 34 వరకు పెరిగాయి. ఈ ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని సంస్థ వెల్లడించింది. పెరిగిన ఉత్పాదక వ్యయాలే ధరల పెంపునకు కారణమని సంస్థ స్పష్టం చేసింది. కరోనా వైరస్ ప్రభావం ఉన్న డిసెంబర్లో మారుతి కార్ల అమ్మకాలు 20 శాతం మేర పెరిగినట్టు సంస్థ ప్రకటించింది. ఈ ఏడాది కొత్త కారు కొనేవారు అదనంగా మరింత సొమ్మును చెల్లించాల్సి ఉంటుంది. కార్ల తయారీదారు మారుతీ పెంచిన ధరల వివరాలను అధికారిక జాబితాను పంచుకోలేదు. కానీ ఆ వివరాలు మాత్రం ఇలా ఉన్నాయి.
మారుతి సుజుకి టూర్ ఎస్ రూ. 5,061 వరకు పెరిగింది. మారుతి సుజుకి ఎస్-ప్రెస్ రూ.7,000, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా రూ.10,000, మారుతి సుజుకి డిజైర్ రూ. 12,500, మారుతి సుజుకి ఆల్టో 800 రూ.14,000, మారుతి సుజుకి సెలెరియో రూ.19,400, మారుతి సుజుకి వాగన్-ఆర్ రూ.23,200, మారుతి సుజుకి ఈకో రూ. 24,200, మారుతి సుజుకి స్విఫ్ట్ రూ. 30,000, మారుతి సుజుకి ఎర్టిగా రూ. 34,000 వరకు పెరిగింది.