ఈ స్కీం ద్వారా ఇప్పటి వరకు 1,20,000 ఉద్యోగాలు
దేశీయ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ను ప్రోత్సహించే పథకం ద్వారా 2020 జనవరి నాటికి 1,20,000 ఉద్యోగాలను సృష్టించిందని, అలాగే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రూ.17,955 కోట్లుగా ఉందని కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ అన్నారు. జూలై 12న నోటిఫై చేసిన మోడిఫైడ్ స్పెషల్ ఇన్సెంటివ్ ప్యాకేజీ స్కీం (M-SIPS)పై అడిగిన ప్రశ్నకు ఆయన లోకసభలో సమాధానం చెప్పారు.
ఈ పథకం ద్వారా క్యాపిటల్ ఎక్స్పెండిచర్పై 20-25 శాతం రాయితీ అందుతుందని చెప్పారు. ఈ పథకం కింద 397 ప్రతిపాదనలు వచ్చాయని, ఇందులో రూ.72,048 కోట్ల విలువైన 257 ప్రతిపాదనలకు ఆమోదం లభించిందని చెప్పారు. రూ.36,076 కోట్ల విలువైన 145 ప్రపొజల్స్ అప్రైజల్ పరిధిలో ఉన్నాయన్నారు.
బిల్లు తీసుకుంటే రూ.1 కోటి వరకు గెలిచే ఛాన్స్
71 మంది దరఖాస్తుదారులకు 897.07 కోట్ల ప్రోత్సాహకాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. కాగా, మోడిఫైడ్ స్పెషల్ ఇన్సెంటివ్ ప్యాకేజీ స్కీం (M-SIPS) 27 జూలై 2012న నోటిఫై చేశారు. ఈ స్కీం కింద క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో 20 శాతం సబ్సిడీ అందిస్తారు. స్పెషల్ ఎకనమిక్ జోన్లో పెట్టుబడికి 20 శాతం, నాన్ స్పెషల్ ఎకనమిక్ జోన్లో 25 శాతం అందిస్తారు.