ఇండియా కార్పొరేట్ రంగంలో అమలులో ఉన్న 90 రోజుల నోటీసు వ్యవధిపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. ప్రముఖ అంతర్జాతీయ అకౌంటింగ్ సంస్థలో పనిచేస్తున్న ఒక మేనేజర్, అనేక భారతీయ కంపెనీలు అమలు చేస్తున్న ఈ విధానాన్ని అసమర్థమైనది, విషపూరితమైనది అంటూ తీవ్రంగా విమర్శించారు. నిపుణుల కోసం ఉపయోగించే అనామక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గ్రేప్వైన్ (Grapevine)లో ఆయన షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది.
తాను ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీమ్కు మేనేజర్గా ఉన్నానని పేర్కొన్న ఆయన.. కొత్త ఉద్యోగులను నియమించుకోవడం తనకు ఒక భయంకరమైన అనుభవంగా మారిందని చెప్పుకొచ్చారు. దీనికి కారణం ఒక్కటే.. అభ్యర్థులందరికీ ఉన్న మూడు నెలల నోటీసు పీరియడ్. మంచి ప్రతిభ ఉన్న ఉద్యోగిని ఎంపిక చేసినా, వారు వెంటనే లేదా 15-30 రోజుల్లో చేరలేని పరిస్థితి ఉండటం వల్ల నియామక ప్రక్రియ పూర్తిగా దెబ్బతింటోందని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన ఇతర దేశాల నిబంధనలతో పోలిక తీసుకొచ్చారు. అమెరికాలో ఉద్యోగం మారాలంటే సాధారణంగా రెండు వారాల నోటీసు సరిపోతుందని, చైనాలో అయితే చట్టపరంగా గరిష్టంగా 30 రోజులు మాత్రమే నోటీసు ఇవ్వాలని చెప్పారు. కానీ భారతదేశంలో మాత్రం ఉద్యోగులను పావు సంవత్సరం పాటు బంధించినట్టుగా ఉంచుతున్నారని మండిపడ్డారు. అమెరికాలో రెండు వారాలు.. చైనాలో 30 రోజులు.. కానీ భారతదేశంలో మాత్రం 90 రోజులు. ఇది చాలా దారుణమని ఆయన వ్యాఖ్యానించారు.
మేనేజర్ అభిప్రాయం ప్రకారం.. ఈ విధానం పాతదే కాకుండా అనేక సమస్యలకు మూలంగా తెలిపారు. ఒకవైపు కంపెనీల HR విభాగాలు తక్షణమే జాయిన్ అవ్వాలని కోరుకుంటాయి. మరోవైపు ఉద్యోగి రాజీనామా చేస్తే మాత్రం ఒప్పందం చూపించి 90 రోజులు తప్పనిసరి అంటాయి. ఈ ద్వంద్వ వైఖరి పూర్తిగా అన్యాయమని ఆయన విమర్శించారు. ఇంకో ముఖ్యమైన సమస్య ఏమిటంటే.. ఉద్యోగి ఒక ఆఫర్ను అంగీకరించిన తర్వాత కూడా ఈ మూడు నెలల సమయంలో మరిన్ని ఆఫర్ల కోసం వెతకడం చాలా ఇబ్బందికర సమస్యగా చెప్పుకొచ్చాడు.
ఒక అభ్యర్థి మొదటి రోజే ఆఫర్ అంగీకరిస్తాడు. కానీ తరువాతి 89 రోజులు మరో మంచి ఆఫర్ కోసం చూస్తుంటాడు. చివరి వారంలో ఎవరో 30 శాతం ఎక్కువ జీతం ఇస్తే.. మొదటి ఆఫర్ను వదిలేస్తాడు. నిజంగా చూస్తే.. ఈ పరిస్థితికి ఉద్యోగిని నిందించలేం. వ్యవస్థే ఇలా తయారుచేసిందని ఆయన రాశారు. 90 రోజుల నోటీసు కాలం ఉద్యోగిని మాత్రమే కాదు, సంస్థను కూడా నష్టపరుస్తుందని మేనేజర్ తెలిపారు. రాజీనామా చేసిన ఉద్యోగి చాలాసార్లు మానసికంగా ఇప్పటికే ఉద్యోగం వదిలేసిన స్థితిలో ఉంటాడు. రోజూ లాగిన్ అవుతాడు కానీ కనీస పని మాత్రమే చేస్తాడని చెప్పుకొచ్చారు.
ఇది సజావుగా బాధ్యతలు అప్పగించడం కాదు. ఇది మూడు నెలల డెడ్ వెయిట్ అంటూ ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఏదేమేనా ఈ విధానం ఉద్యోగికి సంస్థకు రెండింటికీ నష్టమేనని, భారతీయ కంపెనీలు నోటీసు పీరియడ్ సంస్కరణలపై పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టంగా అభిప్రాయపడ్డారు.
More From GoodReturns

ఇరాన్ యుద్ధం వేళ అమెరికాను చావు దెబ్బ కొట్టిన చైనా.. బుల్లెట్ పేల్చకుండానే అగ్రరాజ్యంపై కొత్త వార్..

ముంచుకొస్తున్న 1970 చమురు సంక్షోభం.. ధరల పెరుగుదలతో పలు దేశాలు విలవిల..

Russian oil: ట్రంప్ క్లెయిమ్ VS రియాలిటీ.. రష్యా ఆయిల్ కొనుగోలుపై క్లారిటీ ఇచ్చిన న్యూఢిల్లీ!

భారత్ టైర్ పరిశ్రమను కుదిసేస్తున్న ఇరాన్ యుధ్ద ప్రభావం.. కీలకమైన హెచ్చరిక చేసిన CLSA

Iran war: ఇరాన్లో హై అలర్ట్: ఖమేనీ అంత్యక్రియలు వాయిదా.. ఏం జరుగుతోంది?

Iran war: ఇరాన్ సంచలన నిర్ణయం.. అణు బాంబు తయారీ ఆపేస్తాం! కానీ ఆ ఒక్క కండిషన్!

ఇరాన్ మీద దాడులు.. బట్ట బయలైన అమెరికా కుట్రలు.. ప్రపంచానికి నిజాన్ని తెలిపిన స్పెయిన్..

ఇరాన్–అమెరికా యుద్ధంపై షాకింగ్ న్యూస్.. ఎవరి ఆయుధాలు ముందుగా అయిపోతాయో తెలుసా..

భారత ఆర్థిక వ్యవస్థని కుదిపేస్తున్న గల్ఫ్ యుద్ధ మంటలు.. ప్రమాదంలో 9 కోట్ల మంది పంపే డబ్బు ..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

పశ్చిమాసియాలో యుద్ధం.. చమురు ధరల్లో భారీ పెరుగుదల.. ఎంతలా ఎగబాకాయంటే..



Click it and Unblock the Notifications