Anil Ambani: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ ఇప్పటికే దివాలా తీసిన సంగతి తెలిసిందే. వరుస పతనాలతో అనేక రంగాల్లో ఆయన వ్యాపారాలు మూతపడ్డాయి.
తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం అనిల్ నిర్వహిస్తున్న 5 విమానాశ్రయాలను వెనక్కి తీసుకోవటానికి సిద్ధమౌతోంది. అనిల్ అంబానీ గ్రూప్ నుంచి లాతూర్, ఉస్మానాబాద్, నాందేడ్, యావత్మాల్, బారామతి విమానాశ్రయాలను ప్రభుత్వం త్వరలో వెనక్కి తీసుకోవచ్చని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శుక్రవారం శాసనసభకు తెలిపారు. వాస్తవానికి 2008-09 ఈ ప్రభుత్వం విమానాశ్రయాల నిర్వహణను అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఎయిర్పోర్ట్ డెవలపర్స్ లిమిటెడ్కు అప్పగించబడింది.

కానీ ఇప్పుడు అంబానీ కంపెనీ ఎయిర్పోర్టు నిర్వహణ లేదా బకాయిలు చెల్లించడం లేదు. రిలయన్స్ ఎయిర్పోర్ట్ డెవలపర్స్ లిమిటెడ్ నుంచి బకాయిలను ఎలా వసూలు చేయాలనే దానిపై అటార్నీ జనరల్ నుంచి ప్రభుత్వం న్యాయపరమైన అభిప్రాయాన్ని తీసుకుంటున్నట్లు తేలింది. అలాగే విమానాశ్రయాన్ని ప్రభుత్వం తిరిగి పూర్తి నియంత్రణలోకి తీసుకోగలదా? అనే దానిపై న్యాయపరమైన క్లారిటీ రావాల్సి ఉంది. నాందేడ్, లాతూర్ విమానాశ్రయం పనులు నిలిచిపోగై.. దీంతో పాటు విమానాశ్రయానికి సంబంధించిన ఇతర ప్రాజెక్టుల సమాచారాన్ని ట్వీట్ ద్వారా ఫట్నవీస్ బహిర్గతం చేశారు.
అనిల్ భారతదేశంలో మూడవ అత్యంత సంపన్న వ్యాపారవేత్తగా, ఫోర్బ్స్ ఇండియా 2007లో అనిల్ నికర విలువ 45 బిలియన్ డాలర్లుగా ఉంది. కానీ క్రమంగా అప్పులు పెరగటంతో నికర విలువ తగ్గుతూ వచ్చింది. చివరగా 2020లో అనిల్ అంబానీ యూకే కోర్టులో తన నికర విలువ సున్నా రూపాయలని వెల్లడించారు. అయితే ఇటీవల అనిల్ ఆయన భార్య టీనాలను ఈడీ అధికారులు ఫెమా చట్టాల ఉల్లంగనకు సంబంధించి ప్రశ్నించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications