ఎయిర్ బబుల్స్ వివాదం, భారత్-జర్మనీ మధ్య విమాన సర్వీసులు రద్దు చేసిన లుఫ్తాన్సా

జర్మనీ లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ భారత్-జర్మనీ మధ్య నేటి నుండి అన్ని విమాన సర్వీసులను రద్దు చేసింది. భారత ప్రభుత్వంతో వివాదం తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అనుమతి పొందిన విమానాల సంఖ్యపై కేంద్రంతో వివాదం తలెత్తింది. దీంతో జర్మనీ రద్దు నిర్ణయం తీసుకుంది. ఈ వివాదం నేపథ్యంలో సెప్టెంబర్ 30వ తేదీ నుండి అక్టోబర్ 20వ తేదీ వరకు అన్ని ఇండియా-జర్మన్ విమానాలను క్యాన్సిల్ చేసినట్లు లుఫ్తాన్సా తెలిపింది.

జర్మనీతో చేసుకున్న ఎయిర్ బబూల్ ఒప్పందంలో భాగంగా లుఫ్తాన్సా భారత్-జర్మనీ మధ్య వారానికి 20 సర్వీసులు నడుపుతోందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తెలిపింది. భారత్‌కు చెందిన విమానాలను మాత్రం కేవలం మూడు నుండి నాలుగు నడుపుతున్నట్లు వెల్లడించింది. ఈ లెక్కన భారత సర్వీసులకు గణనీయమైన ప్రతికూలత ఎదురవుతోందని తెలిపింది. దీంతో వారానికి ఏడు విమానాలను మాత్రమే నడపాలని లుఫ్తాన్సాకు భారత ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రతిపాదనకు లుఫ్తాన్సా నో చెప్పింది.

 Lufthansa cancels all planned India flights over air bubble dispute

ఈ అంశానికి సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయి. అమెరికా, యూకే, యూఏఈ, మాల్దీవులు, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, ఖతార్, బహ్రెయిన్, నైజీరియా, ఇరాక్, ఆప్గనిస్తాన్, జపాన్.. 13 దేశాలతో భారత్‌కు ఎయిర్ బబుల్స్ ఒప్పందాలు ఉన్నాయి. ఇతర దేశాలతోను ఈ ఒప్పందాలను పరిశీలిస్తోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+