కరోనా సెకండ్ వేవ్ భారత్ను అతలాకుతలం చేస్తోంది. ఓవైపు వేలాది మంది ప్రాణాలు తీసుకోవడంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థను, వ్యక్తుల ఆర్థిక పరిస్థితిని దారుణాదిదారుణంగా దెబ్బతీసింది. కరోనా సెకండ్ వేవ్ పరిణామాలపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దూరదృష్టిలేమికి, నాయకత్వలేమికి ఇది నిదర్శనమన్నారు. దేశంలో ప్రతిరోజు మూడున్నర లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి. వేలాదిమంది మరణిస్తున్నారు. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో భారత్ ఇతర దేశాలకు ఆపన్నహస్తం అందించింది. దీంతో ఇతర దేశాలు ఇప్పుడు భారత్కు సహకరించేందుకు ముందుకు వచ్చాయి.

ముందే గుర్తించి ఉంటే
కరోనా తిరిగి ఎందుకు పుంజుకుందో కారణాలు వెల్లడించారు రఘురాం రాజన్. 2020లో కరోనా ఉధృతమై, తిరిగి తగ్గుముఖం పట్టకపోవడానికి నాయకుల నిర్లక్ష్యమే కారణమన్నారు. సరైన నాయకత్వం లేకపోవడం, దూరదృష్టి కలిగి ఉండకపోవడం వల్ల దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోందన్నారు. మీరు ఇంకా జాగ్రత్తగా ఉండి ఉంటే మీరు కరోనా తగ్గలేదని, ప్రజలను హెచ్చరించి ఉంటే, ఇంకా కరోనా తగ్గలేదని లేదని చేయాల్సిన పని పూర్తి కాలేదని గుర్తించి ఉంటే ఇలాజరగకపోయేదన్నారు.

అప్పుడే గుర్తించాల్సింది
ప్రపంచ దేశాల్లో వైరస్ తిరిగి వచ్చిందని రఘురాం రాజన్ గుర్తు చేశారు. బ్రెజిల్ వంటి దేశాల్లో సెకండ్ వేవ్ మనం చూశామని, అప్పుడే ఈ వైరస్ రూపాంతరం చెందినట్లు గుర్తించవలసి ఉండిందన్నారు. కరోనాపై పోరులో దేశం విజయం సాధించిందని ప్రభుత్వ అధికారులు ప్రకటించారని, కానీ దేశంలో కేసులు మార్చి నుండి మళ్లీ పెరగడం ప్రారంభించాయన్నారు. ఏప్రిల్ నుండి ఇది విజృంభించిందన్నారు.

లాక్డౌన్ సూచన
ఇప్పుడు కొనసాగుతోన్న సంక్షోభం కారణంగా కొన్ని పరిశ్రమల సంస్థలు, వైద్య నిపుణులు కొన్ని వారాల పాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ చేయాలని పిలుపునిచ్చారు. గత ఏడాది విధించిన లాక్డౌన్ వల్ల దేశ ఆర్దిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోయినట్లు కాబట్టి లాక్డౌన్ విధించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇప్పుడు కఠినమైన చర్యలు తీసుకోకపోతే కరోనా చేయి దాటిపోతుందని చాలామంది నిపుణులు సూచిస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications