Birla Group: అనీల్ అంబానీ కంపెనీని కొంటున్న బిర్లా.. లభించిన అంగీకారం..!
Birla Group: చాలా కాలం తర్వాత బిర్లా గ్రూప్ వార్తల్లో నిలిచింది. ఇందుకు కారణం అనీల్ అంబానికి చెందిన కంపెనీని చేజిక్కించుకునేందుకు కంపెనీ ముందుకు రావటమే. డీల్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రిలయన్స్ క్యాపిటల్..
అప్పుల ఊబిలో కూరుకుపోయిన అనీల్ అంబానీకి చెందిన క్యాపిటల్ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీని కొనుగోలు చేసేందుకు అనేక కంపెనీలు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆదిత్య బిర్లా గ్రూప్ వేసిన బిడ్డింగ్ను RNLIC రుణదాతలు ఆమోదించారు. రిలయన్స్ క్యాపిటల్ దివాలా ప్రక్రియలో భాగంగా ఇది జరుగుతోంది.
బిర్లాలకు ఆమోదం..
ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్కు సంబంధించిన బిడ్డింగ్ను RNLIC కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ ఆమోదించిందని వర్గాలు తెలిపాయి. ఈ కంపెనీలో రిలయన్స్ క్యాపిటల్కు 51 శాతం, జపాన్కు చెందిన నిప్పన్ లైఫ్కు 49 శాతం వాటా ఉంది. రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలుకు మెుత్తం 14 సంస్థలు పోటీపడగా.. అందులో పిరమల్ గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం కూడా ఉంది.
ఇదే క్రమంలో ఓక్ట్రీ క్యాపిటల్, టోరెంట్ ఇన్వెస్ట్మెంట్స్, ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్, కాస్మి ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా బిడ్ చేశాయి. ఈ కంపెనీలు మొత్తం కంపెనీని లేదా కొంతమంది క్లస్టర్లను కొనుగోలు చేసేందుకు బిడ్ చేసాయి.
రుణ వివరాలు..
రిలయన్స్ క్యాపిటల్కు దాదాపు 20 ఆర్థిక సేవలకు రుణాలు చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలో నవంబర్ 30, 2021న భారీ రుణాల ఊబిలో ఉన్న రిలయనస్ క్యాపిటల్ బోర్డును రద్దు చేసింది. కంపెనీపై దివాలా చర్యలను ప్రారంభించింది. సెంట్రల్ బ్యాంక్ నాగేశ్వరరావును కంపెనీ అడ్మినిస్ట్రేటర్గా నియమించింది. రుణదాతలు మెుత్తం రూ.23,666 కోట్లు ఉండగా.. ఎల్ఐసీ రూ.3,400 కోట్లను క్లెయిమ్ చేసింది.