Income Tax: ప్రభుత్వ ఉద్యోగులకు ఏ పన్ను విధానం మేలు.. అలా జంపింగ్ కుదరదా..?

Income Tax: ఎన్నికలకు ముందు వార్షిక్ బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పన్ను తాయిలాన్ని ప్రకటించారు. అయితే ఇది చాలా మందికి రుచించలేదని చెప్పుకోవాలి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మోదీ 2.0 చివరి ఫుల్ టైమ్ బడ్జెట్ టాక్స్ ప్రకటన ఉద్యోగులకు ఎంత వరకు ప్రయోజనకరమో ఇప్పుడు తెలుసుకుందాం.

పన్ను రాయితీ..

పన్ను రాయితీ..

ఆదాయపన్ను మినహాయింపుల పేరుతో మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నాన్ని నిర్మలమ్మ ప్రకటించారనే చెప్పుకోవాలి. అసలు ఎంత ఆదాయం వారికి ఎంత టాక్స్, దానిని ఎలా లెక్కిస్తారో పూర్తిగా చెప్పకుండా అందరినీ గందరగోళానికి గురిచేసింది నిన్నటి ప్రకటన అని చెప్పుకోవాలి. కొత్త పన్ను విధానం కింద రూ.7 లక్షల వరకు ఆదాయంపై పన్ను చెల్లించక్కర్లేదని నిర్మలమ్మ ప్రకటించారు. పైగా కొత్త పన్ను చెల్లింపు విధానాన్ని డిఫాల్ట్ ఎంపికగా మార్చుతున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

ఉద్యోగులకు ఆప్షన్..

ఉద్యోగులకు ఆప్షన్..

చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే పాత పన్ను విధానాన్ని ఫాలో అవుతున్నారు. అయితే కొత్త పన్ను విధానానికి మారటం వల్ల ప్రయోజనం ఎంత వరకు ఉంటుంది అనే ఆలోచన సైతం వారు చేస్తున్నారు. దీనిలో ముందుగా వారు ఆలోచించేది వారు చేసే NPS, PPFతో పాటు ఇతర పెట్టుబడులపై పన్ను మినహాయింపు వస్తుందా అనేది. ఒక్క మాటలో చెప్పాలంటే సెక్షన్ 80C, 80D కింద లభించే మినహాయింపులతో పాటు HRA, హోమ్ లోన్ల పై చెల్లించే వడ్డీలు, పిల్లల చదువుల ఖర్చులు వంటి వాటిపై తగ్గింపులు వస్తాయా అన్నదే. పాత టాక్స్ పద్ధతిలో వీటికి వెసులుబాటు ఉంటుంది. కానీ కొత్త విధానంలో ఇలాంటి అవకాశం అస్సలు లేదు. ఎలాంటి పన్ను తగ్గింపులు లేదా మినహాయింపులను కేంద్రం కొత్త విధానం కింద అందించటం లేదు.

మారిన కొత్త పన్ను రేట్లు..

మారిన కొత్త పన్ను రేట్లు..

కొత్త పన్ను విధానంలో రూ.3 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండదు. దీని తర్వాత రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల ఆదాయంపై 5 శాతం, రూ.6 నుంచి రూ.9 లక్షల వరకు 10 శాతం, రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 15 శాతం, రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 20 శాతం పన్ను, రూ.15 లక్షల కంటే ఎక్కువ ఆదాయంపై 30 శాతం వరకు పన్ను చెల్లించుకోవాల్సి ఉంటుంది. గతంలో కంటే ఈ శ్లాబ్ రేట్లలో రూ.50 వేలు అదనపు పన్ను మినహాయింపును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

పాత పన్ను విధానం..

పాత పన్ను విధానం..

అందరూ ఎదురుచూస్తున్న పాత పన్ను విధానంలో మాత్రం కేంద్రం ఎలాంటి మార్పులను ప్రకటించలేదు. పన్ను మినహాయింపులు కలిగిన పాత విధానంగా నిర్వీర్యం చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోందని చాలా మంది భావిస్తున్నారు. ప్రస్తుతం కేంద్రం ప్రకటనలు చూస్తుంటే మినహాయింపులు లేని పన్ను విధానాన్ని దేశంలో అమలు చేయాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. రూ.2.50 లక్షల వరకు ఎలాంటి పన్ను ఉండదు. మిగిలిన ఆదాయంపై పన్ను చెల్లించుకోవాల్సి ఉంటుంది. అయితే పాత పద్ధతిలో ఉన్న మినహాయింపులు కొత్త విధానంలో లేకపోవటం చాలా మంది పన్ను చెల్లింపుదారుల నిరుత్సాహానికి ప్రధాన కారణమని చెప్పుకోవాలి.

ఒక పద్ధతి నుంచి మరోదానికి..

ఒక పద్ధతి నుంచి మరోదానికి..

ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో అందరూ ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ముందుగా రెండు పన్ను విధానాల్లో ఒకదాన్ని ఎంచుకోవటం. జీతం పొందే వ్యక్తి కొత్త పన్ను విధానంలో ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత కావాలంటే తరువాతి సంవత్సరాల్లో పాత పన్ను విధానంలోకి మారేందుకు అవకాశం ఉంది. అయితే వ్యాపారులకు మాత్రం ఇలా మారేందుకు సౌకర్యం లేదు. ఒక్కసారి కొత్త విధానంలో ఐటీఆర్ ఫైల్ చేస్తే దానినే వారు కొనసాగించాల్సి ఉంటుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+