Income Tax: ఎన్నికలకు ముందు వార్షిక్ బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పన్ను తాయిలాన్ని ప్రకటించారు. అయితే ఇది చాలా మందికి రుచించలేదని చెప్పుకోవాలి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మోదీ 2.0 చివరి ఫుల్ టైమ్ బడ్జెట్ టాక్స్ ప్రకటన ఉద్యోగులకు ఎంత వరకు ప్రయోజనకరమో ఇప్పుడు తెలుసుకుందాం.

పన్ను రాయితీ..
ఆదాయపన్ను మినహాయింపుల పేరుతో మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నాన్ని నిర్మలమ్మ ప్రకటించారనే చెప్పుకోవాలి. అసలు ఎంత ఆదాయం వారికి ఎంత టాక్స్, దానిని ఎలా లెక్కిస్తారో పూర్తిగా చెప్పకుండా అందరినీ గందరగోళానికి గురిచేసింది నిన్నటి ప్రకటన అని చెప్పుకోవాలి. కొత్త పన్ను విధానం కింద రూ.7 లక్షల వరకు ఆదాయంపై పన్ను చెల్లించక్కర్లేదని నిర్మలమ్మ ప్రకటించారు. పైగా కొత్త పన్ను చెల్లింపు విధానాన్ని డిఫాల్ట్ ఎంపికగా మార్చుతున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

ఉద్యోగులకు ఆప్షన్..
చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే పాత పన్ను విధానాన్ని ఫాలో అవుతున్నారు. అయితే కొత్త పన్ను విధానానికి మారటం వల్ల ప్రయోజనం ఎంత వరకు ఉంటుంది అనే ఆలోచన సైతం వారు చేస్తున్నారు. దీనిలో ముందుగా వారు ఆలోచించేది వారు చేసే NPS, PPFతో పాటు ఇతర పెట్టుబడులపై పన్ను మినహాయింపు వస్తుందా అనేది. ఒక్క మాటలో చెప్పాలంటే సెక్షన్ 80C, 80D కింద లభించే మినహాయింపులతో పాటు HRA, హోమ్ లోన్ల పై చెల్లించే వడ్డీలు, పిల్లల చదువుల ఖర్చులు వంటి వాటిపై తగ్గింపులు వస్తాయా అన్నదే. పాత టాక్స్ పద్ధతిలో వీటికి వెసులుబాటు ఉంటుంది. కానీ కొత్త విధానంలో ఇలాంటి అవకాశం అస్సలు లేదు. ఎలాంటి పన్ను తగ్గింపులు లేదా మినహాయింపులను కేంద్రం కొత్త విధానం కింద అందించటం లేదు.

మారిన కొత్త పన్ను రేట్లు..
కొత్త పన్ను విధానంలో రూ.3 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండదు. దీని తర్వాత రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల ఆదాయంపై 5 శాతం, రూ.6 నుంచి రూ.9 లక్షల వరకు 10 శాతం, రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 15 శాతం, రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 20 శాతం పన్ను, రూ.15 లక్షల కంటే ఎక్కువ ఆదాయంపై 30 శాతం వరకు పన్ను చెల్లించుకోవాల్సి ఉంటుంది. గతంలో కంటే ఈ శ్లాబ్ రేట్లలో రూ.50 వేలు అదనపు పన్ను మినహాయింపును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

పాత పన్ను విధానం..
అందరూ ఎదురుచూస్తున్న పాత పన్ను విధానంలో మాత్రం కేంద్రం ఎలాంటి మార్పులను ప్రకటించలేదు. పన్ను మినహాయింపులు కలిగిన పాత విధానంగా నిర్వీర్యం చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోందని చాలా మంది భావిస్తున్నారు. ప్రస్తుతం కేంద్రం ప్రకటనలు చూస్తుంటే మినహాయింపులు లేని పన్ను విధానాన్ని దేశంలో అమలు చేయాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. రూ.2.50 లక్షల వరకు ఎలాంటి పన్ను ఉండదు. మిగిలిన ఆదాయంపై పన్ను చెల్లించుకోవాల్సి ఉంటుంది. అయితే పాత పద్ధతిలో ఉన్న మినహాయింపులు కొత్త విధానంలో లేకపోవటం చాలా మంది పన్ను చెల్లింపుదారుల నిరుత్సాహానికి ప్రధాన కారణమని చెప్పుకోవాలి.

ఒక పద్ధతి నుంచి మరోదానికి..
ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో అందరూ ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ముందుగా రెండు పన్ను విధానాల్లో ఒకదాన్ని ఎంచుకోవటం. జీతం పొందే వ్యక్తి కొత్త పన్ను విధానంలో ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత కావాలంటే తరువాతి సంవత్సరాల్లో పాత పన్ను విధానంలోకి మారేందుకు అవకాశం ఉంది. అయితే వ్యాపారులకు మాత్రం ఇలా మారేందుకు సౌకర్యం లేదు. ఒక్కసారి కొత్త విధానంలో ఐటీఆర్ ఫైల్ చేస్తే దానినే వారు కొనసాగించాల్సి ఉంటుంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications