కేంద్ర బడ్జెట్ 2025: జూలై 2024 బడ్జెట్లో ఆర్థిక మంత్రి కీలక ప్రకటనలు.. పన్ను నుంచి గోల్డ్ రేట్ల వరకు..

కేంద్ర బడ్జెట్ 2025: మోదీ సర్కార్ ఏర్పాటు చేయబడిన తర్వాత జూలై 23న కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 7వ సారి బడ్జెట్ ప్రసంగం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఆమె దేశ ప్రజలను సంతోషపెట్టే కొన్ని కీలక అంశాలను ప్రస్థావించారు. ప్రజలకు కొన్ని తాయిలాలు ప్రకటించారు.

గతసారి ఎన్డీఏ కూటమి 48.02 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా ఇందులో పన్నుల నుంచి ఆదాయం 28.08 లక్షల కోట్లుగా ఉండగా పన్నేతర ఆదాయం 16 లక్షల కోట్లుగా ఉంది. ఈ క్రమంలో 9 రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆర్థిక మంత్రి ప్రధానంగా దేశంలోని యువతకు ఉద్యోగ కల్పనపై ఫోకస్ పెట్టారు. రానున్న ఐదేళ్లలో 5 కోట్ల మందికి ఉపాధి అవకాశాల కల్పన కోసం రూ.2 లక్షల కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించారు.

Know key Highlights from Budget 2024 by Nirmala sitharaman to Indians

అలాగే వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు నిర్మలమ్మ వెల్లడించారు. ఇదే క్రమంలో వ్యవసాయానికి ఆర్థిక మంత్రి ఎక్కువ ప్రాధాన్యతను సైతం అందించిన సంగతి తెలిసిందే. అలాగే బడ్జెట్లో దేశంలోని సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరినీ ఆకర్షించిన మరో విషయం బంగారం దిగుమతులపై పన్నును భారీగా తగ్గించటం. ఈ క్రమంలో నిర్మలా సీతారామన్ దిగుమతి పన్నును ఏకంగా 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారు. ఆ ప్రభావంతో సాయంత్రానికే దేశంలోని పెద్ద వ్యాపారులు రేట్లను దానికి అనుగుణంగా తగ్గించిన సంగతి తెలిసిందే.

ఇకపోతే ఎంఎస్ఎంఈలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక శ్రద్ధను బడ్జెట్లో చూపారు. కొత్త ఎంఎస్ఎంఈ గ్యారంటీ ప్లాన్ కింద రూ.100 కోట్ల వరకూ రుణాలు ఇస్తామన్నారు. ఎంఎస్ఎంఈలకు బ్యాంక్ క్రెడిట్ లను సులభతరం చేసేందుకు ఈ కొత్త విధానం అమలు చేస్తామన్నారు. అలాగే ముద్రా రుణాల పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచారు. ఉద్యోగాల్లో చేరే కొత్త ఉద్యోగులందరికీ ప్రభుత్వం ఒక నెల వేతనాన్ని పీఎఫ్ కంట్రిబ్యూషన్ రూపంలో అందించనున్నట్లు నిర్మలమ్మ గత బడ్జెట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఆదాయపు పన్ను ప్రయోజనం..
బడ్జెట్ సమయంలో ఆర్థిక మంత్రి న్యూ టాక్స్ రీజిమ్ కింద గతంలో అందిస్తున్న స్టాండర్ట్ డిడక్షన్ రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంచిన సంగతి తెలిసిందే. దీంతో మెుత్తంగా ఈ పన్ను విధానం కింద రూ.7.75 లక్షల వరకు వేతన జీవులు అందుకుంటారు. ఇక మారిన పన్ను శ్లాబ్ రేట్లను పరిశీలిస్తే.. 3 లక్షల - 7 లక్షల వరకూ ఆదాయంపై 5 శాతం పన్ను, 7 లక్షల - 10 లక్షల వరకు ఆదాయంపై 10 శాతం, 10 లక్షల - 15 లక్షల వరకు 15 శాతం పన్ను ప్రతిపాదించబడింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+