Ram Mandir: దాదాపు వందల ఏళ్ల నుంచి కొనసాగుతున్న అయోధ్య వివాదానికి రేపటితో పెద్ద బ్రేక్ పడనుంది. బీజేపీ సర్కార్ హయాంలో రాముని ఆలయ నిర్మాణం వైభవంగా పూర్తవుతోంది. ఇందులో తమ వంతు పాత్ర పోషించేందుకు అనేక మంది తోచినంత విరాళంగా రామునికి సమర్పించుకుంటున్న సంగతి తెలిసిందే.
చాలా మంది దేశంలో ఉత్తర్ప్రదేశ్ అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల సొమ్మును ఇందుకు వినియోగిస్తున్నట్లు భావిస్తున్నారు. కొందరు ఈ తప్పుడు ప్రచారాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయటం దీనికి ఒక కారణంగా ఉంది. అయితే రామ మందిర నిర్మాణం కోసం 2020లో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రట్రస్ట్ స్థాపించటం జరిగింది. దానికి ఇప్పటి వరకు దాదాపుగా రూ.3,500 కోట్లకు పైగా విరాళాలు వచ్చాయి. ఇప్పటికీ విదేశాల నుంచి విరాళాల వెల్లువ కొనసాగుతూనే ఉందని గణాంకాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం రాముని మందిరాన్ని దాదాపు రూ.1,800 కోట్లు వెచ్చించి అత్యంత అధునాతన సాంకేతికతతో పాటు వైధిక పద్ధతులను వినియోగించి నిర్మించినట్లు తెలుస్తోంది. మిగిలిన మెుత్తాన్ని ట్రస్ట్ ఆలయ నిర్వహణకు ఉపయోగించనుందని సమాచారం. అయితే శ్రీరాముని ఆలయానికి ప్రతిరోజూ దాదాపు 3 లక్షల మంది భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించేదుకు వస్తారని అంచనా వేయబడింది. ఈ టెంపుల్ టూరిజం ద్వారా అయోధ్యలో ఏకంగా ఏడాదికి రూ.10,000 కోట్లకు పైగా వ్యాపారం జరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా వేల మందికి ఉపాధి, వ్యాపార అవకాశాలను కల్పించనుందని సమాచారం.
అయితే ఇప్పుడు ట్రస్టుకు ప్రజలు అందించే విరాళాలకు పన్ను మినహాయింపుకు అర్హత కలిగినవా కాదా అనే విషయం గురించి తెలుసుకుందాం. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సెక్షన్ 80G(2)(బి) ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వం శ్రీ రామ్ ట్రస్ట్ను చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశంగా, ప్రఖ్యాత ప్రజా పూజా స్థలంగా నోటిఫై చేసింది. అందువల్ల ఆలయాన్ని పునరుద్ధరించడానికి లేదా మరమ్మతు చేయడానికి చేసిన విరాళాలు మినహాయింపుకు అర్హులు. మందిర పునరుద్ధరణ/మరమ్మత్తు కోసం శ్రీరామ్ ట్రస్ట్కు విరాళంగా ఇచ్చిన మొత్తంలో 50% సెక్షన్ 80G కింద మినహాయింపు పొందేందుకు అర్హమైనది.
శ్రీ రామ్ ట్రస్ట్కు విరాళంగా ఇచ్చిన మొత్తం మీ సర్దుబాటు చేసిన స్థూల మొత్తం ఆదాయం (GTI)లో 10% మించి ఉంటే, 10% పరిమితిని మించిన ఏదైనా అదనపు మొత్తం మినహాయింపుకు అర్హత పొందదు. వస్తువుల రూపంలో అందించే విరాళాలకు ఎలాంటి తగ్గింపులు ఉండబోవని గుర్తుంచుకోండి. అలాగే రూ.2000కు మించి చేసే నగదు డొనేషన్ మినహాయింపులకు అర్హమైనది కాదు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications