Jai Anmol Ambani: గడచిన కొన్ని నెలలుగా అనిల్ అంబానీ పేరు దేశీయంగా వార్తల్లో తిరిగి వినిపిస్తోంది. దివాలా తర్వాత దశాబ్ధకాలంగా కనుమరుగైన వ్యాపారవేత్త తిరిగి మీడియా ఫోకస్ లోకి రావటం వెనుక పెద్ద కథే ఉంది.
అంబానీలు అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు ముఖేష్ అంబానీ. అయితే ఆయన సోదరుడు అనిల్ సైతం ఒకప్పుడు ప్రపంచ కుబేరుల జాబితాలో నిలిచిన వ్యక్తి. ప్రస్తుత తరానికి అనిల్ అంబానీ గురించి చాలా తక్కువ తెలుసు. పతనం తర్వాత అనిల్ తిరిగి పాతాళం నుంచి పైకి వస్తున్నారు. దీని వెనుక యువ వ్యాపారవేత్త జై అన్మోల్ అంబానీ ఉన్నారు. అన్మోల్ అంబానీ అనిల్ పెద్ద కుమారుడు. ప్రస్తుతం అతను తండ్రి సంపదను పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

అనేక ఆర్థిక సవాళ్లతో పాటు భారీ అప్పుల ఊబిలో అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు మునిగిపోవటంతో బిలియనీర్ అనిల్ 2020లో దివాలా తీసిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత అనిల్ ఇద్దరు కుమారులు జై అన్మోల్ అంబానీ, జై అన్షుల్ అంబానీలు రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్లో చేరారు. అసలు కథ ఇక్కడి నుంచే ప్రారంభమైంది. వారి రాకతో గ్రూప్ కంపెనీల షేర్లు వేగంగా తిరిగి పుంజుకోవటం ప్రారంభించాయి. జై అన్మోల్ అంబానీ నికర విలువ 3.3 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీ లెక్కల ప్రకారం సుమారు రూ.20,000 కోట్ల కంటే ఎక్కువగా ఉంది.
అన్మోల్ అంబానీ ముంబైలోని కేథడ్రల్, జాన్ కానన్ స్కూల్లో తన ప్రారంభ విద్యను అభ్యసించాడు. తర్వాత UKలోని సెవెనోక్స్ స్కూల్లో చదివాడు. అతను వార్విక్ బిజినెస్ స్కూల్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పొందాడు. విద్యను పూర్తి చేసిన తర్వాత, జై అన్మోల్ అంబానీ భారతదేశానికి తిరిగి వచ్చి రిలయన్స్ క్యాపిటల్లో ట్రైనీగా తన వృత్తిని ప్రారంభించాడు. 2016లో రిలయన్స్ క్యాపిటల్ బోర్డులో అదనపు డైరెక్టర్ అయ్యాడు. తర్వాత ఏడాదిలోనే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్థాయికి వెళ్లారు. అలా 2018లో రిలయన్స్ నిప్పన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ బోర్డులలో కూడా చేరాడు.
జై అన్మోల్ అంబానీ, అతని భార్య క్రిషా షా మిగిలిన కుటుంబ సభ్యులతో పాటు ముంబై బాంద్రాలో విలాసవంతమైన 17-అంతస్తుల బంగ్లా అబోడ్లో నివసిస్తున్నాడు. ఈ నివాసం దేశంలోనే అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటి. దీని మార్కెట్ విలువ సుమారు రూ.5,000 కోట్లని అంచనా. అన్మోల్ రోల్స్ రాయిస్ ఫాంటమ్, లంబోర్ఘిని గల్లార్డో వంటి కార్లతో పాటు హెలికాప్టర్, విమానం కూడా కలిగి ఉన్నాడు. అన్మోల్ అంబానీ నికుంజ్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ మాజీ ఛైర్మన్, ఎండీ దివంగత నికుంజ్ షా కుమార్తె క్రిషా షాను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం తండ్రి విజయం వెనుక అన్మోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications