2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను అత్యధిక వేతనం అందుకున్న ఎగ్జిక్యూటివ్ ఎవరో తెలుసా? సన్ నెట్ ప్రమోటర్లు కళానిధి మారన్, ఆయన సతీమణి కావేరీ మారన్. గత ఆర్థిక ఏడాదికి గాను వీరిద్దరు కలిసి అందుకున్న మొత్తం అక్షరాలా రూ.175 కోట్లు. భారత కార్పోరేట్ రంగంలో అత్యధిక పారితోషికం అందుకున్న ఎగ్జిక్యూటివ్స్గా వీరు తొలిస్థానంలో నిలిచారు. ఈ మేరకు స్టాక్ ఎక్స్చేంజీలకు సన్ టీవీ బుధవారం వార్షిక నివేదికను సమర్పించింది.2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను అత్యధిక వేతనం అందుకున్న ఎగ్జిక్యూటివ్ ఎవరో తెలుసా? సన్ నెట్ ప్రమోటర్లు కళానిధి మారన్, ఆయన సతీమణి కావేరీ మారన్. గత ఆర్థిక ఏడాదికి గాను వీరిద్దరు కలిసి అందుకున్న మొత్తం అక్షరాలా రూ.175 కోట్లు. భారత కార్పోరేట్ రంగంలో అత్యధిక పారితోషికం అందుకున్న ఎగ్జిక్యూటివ్స్గా వీరు తొలిస్థానంలో నిలిచారు. ఈ మేరకు స్టాక్ ఎక్స్చేంజీలకు సన్ టీవీ బుధవారం వార్షిక నివేదికను సమర్పించింది.

చెరో రూ.87.5 కోట్లు..
కళానిధి మారన్ 1993లో సన్ టీవీని స్థాపించారు. ఆయన ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉండగా, అతని సతీమణి కావేరీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను వీరిద్దరు ఒక్కొక్కరు చొప్పున రూ.13.87 కోట్లు, రూ.73.63 కోట్ల మొత్తాన్ని ఎక్స్గ్రేషియా/బోనస్గా తీసుకున్నారు. ఈ రెండు కలిపీ ఒక్కొక్కరు రూ.87.50 కోట్లు తీసుకుంటున్నారు. దీంతో వీరిద్దరి వేతనం రూ.175 కోట్లుగా ఉంది. వీరి వేతనాన్ని స్థిరంగా ఉంచాలని మూడేళ్ల క్రితం నిర్ణయించారు.

సన్ టీవీ ఎండీ మహేష్, కూతురు కావ్య వేతనం కోట్లలో
అత్యధిక వేతనం పొందుతున్న ఎగ్జిక్యూటివ్లలో సన్ టీవీ ఎండీ ఆర్ మహేష్ కుమార్ ముందున్నారు. ఆయన వార్షిక వేతనం రూ.1.78 కోట్లు. ఇందులో రూ.1.16 కోట్లు శాలరీ, రూ.0.62 కోట్లు ఎక్స్గ్రేషియా ఉన్నాయి. ఆ తర్వాత మారన్ కూతురు, కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కావ్య రూ.1.22 కోట్లు అందుకుంటున్నారు. ఇందులో రూ.80 లక్షలు వేతనం, రూ.42 లక్షలు ఎక్స్గ్రేషియా. 2019-20లో సన్ టీవీ వార్షిక ఆదాయం రూ.3,653.35 కోట్లు. గత ఏడాది రూ.3,883.22 కోట్లుగా ఉంది. పన్నుకు ముందు కంపెనీ ఆదాయం రూ.1,797.88 కోట్లు. అంతకుముందు ఏడాది ఇది రూ.2,134.94 కోట్లుగా ఉంది.

రిలయన్స్ ముఖేష్, నీతా అంబానీ వేతనం
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 12 సంవత్సరాలుగా రూ.15 కోట్ల వేతనం తీసుకుంటున్నారు. ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా పూర్తి శాలరీని వదిలి పెట్టాలని నిర్ణయించుకున్నారు. 2008-09 ఆర్థిక సంవత్సరం నుండి రూ.15 కోట్లు తీసుకుంటున్న ముఖేష్ అంబానీ, ప్రతి ఏడాది రూ.24 కోట్లు వదులుకుంటున్నారు. నీతా అంబానీ సహా రిలయన్స్ నాన్-ఎగ్జిక్యూటివ్స్ డైరెక్టర్లు సిట్టింగ్ ఫీజ్ కాకుండా రూ.1.5 కోట్లు కమీషన్గా అందుకుంటున్నారు.
More From GoodReturns

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications