2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను అత్యధిక వేతనం అందుకున్న ఎగ్జిక్యూటివ్ ఎవరో తెలుసా? సన్ నెట్ ప్రమోటర్లు కళానిధి మారన్, ఆయన సతీమణి కావేరీ మారన్. గత ఆర్థిక ఏడాదికి గాను వీరిద్దరు కలిసి అందుకున్న మొత్తం అక్షరాలా రూ.175 కోట్లు. భారత కార్పోరేట్ రంగంలో అత్యధిక పారితోషికం అందుకున్న ఎగ్జిక్యూటివ్స్గా వీరు తొలిస్థానంలో నిలిచారు. ఈ మేరకు స్టాక్ ఎక్స్చేంజీలకు సన్ టీవీ బుధవారం వార్షిక నివేదికను సమర్పించింది.2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను అత్యధిక వేతనం అందుకున్న ఎగ్జిక్యూటివ్ ఎవరో తెలుసా? సన్ నెట్ ప్రమోటర్లు కళానిధి మారన్, ఆయన సతీమణి కావేరీ మారన్. గత ఆర్థిక ఏడాదికి గాను వీరిద్దరు కలిసి అందుకున్న మొత్తం అక్షరాలా రూ.175 కోట్లు. భారత కార్పోరేట్ రంగంలో అత్యధిక పారితోషికం అందుకున్న ఎగ్జిక్యూటివ్స్గా వీరు తొలిస్థానంలో నిలిచారు. ఈ మేరకు స్టాక్ ఎక్స్చేంజీలకు సన్ టీవీ బుధవారం వార్షిక నివేదికను సమర్పించింది.

చెరో రూ.87.5 కోట్లు..
కళానిధి మారన్ 1993లో సన్ టీవీని స్థాపించారు. ఆయన ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉండగా, అతని సతీమణి కావేరీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను వీరిద్దరు ఒక్కొక్కరు చొప్పున రూ.13.87 కోట్లు, రూ.73.63 కోట్ల మొత్తాన్ని ఎక్స్గ్రేషియా/బోనస్గా తీసుకున్నారు. ఈ రెండు కలిపీ ఒక్కొక్కరు రూ.87.50 కోట్లు తీసుకుంటున్నారు. దీంతో వీరిద్దరి వేతనం రూ.175 కోట్లుగా ఉంది. వీరి వేతనాన్ని స్థిరంగా ఉంచాలని మూడేళ్ల క్రితం నిర్ణయించారు.

సన్ టీవీ ఎండీ మహేష్, కూతురు కావ్య వేతనం కోట్లలో
అత్యధిక వేతనం పొందుతున్న ఎగ్జిక్యూటివ్లలో సన్ టీవీ ఎండీ ఆర్ మహేష్ కుమార్ ముందున్నారు. ఆయన వార్షిక వేతనం రూ.1.78 కోట్లు. ఇందులో రూ.1.16 కోట్లు శాలరీ, రూ.0.62 కోట్లు ఎక్స్గ్రేషియా ఉన్నాయి. ఆ తర్వాత మారన్ కూతురు, కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కావ్య రూ.1.22 కోట్లు అందుకుంటున్నారు. ఇందులో రూ.80 లక్షలు వేతనం, రూ.42 లక్షలు ఎక్స్గ్రేషియా. 2019-20లో సన్ టీవీ వార్షిక ఆదాయం రూ.3,653.35 కోట్లు. గత ఏడాది రూ.3,883.22 కోట్లుగా ఉంది. పన్నుకు ముందు కంపెనీ ఆదాయం రూ.1,797.88 కోట్లు. అంతకుముందు ఏడాది ఇది రూ.2,134.94 కోట్లుగా ఉంది.

రిలయన్స్ ముఖేష్, నీతా అంబానీ వేతనం
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 12 సంవత్సరాలుగా రూ.15 కోట్ల వేతనం తీసుకుంటున్నారు. ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా పూర్తి శాలరీని వదిలి పెట్టాలని నిర్ణయించుకున్నారు. 2008-09 ఆర్థిక సంవత్సరం నుండి రూ.15 కోట్లు తీసుకుంటున్న ముఖేష్ అంబానీ, ప్రతి ఏడాది రూ.24 కోట్లు వదులుకుంటున్నారు. నీతా అంబానీ సహా రిలయన్స్ నాన్-ఎగ్జిక్యూటివ్స్ డైరెక్టర్లు సిట్టింగ్ ఫీజ్ కాకుండా రూ.1.5 కోట్లు కమీషన్గా అందుకుంటున్నారు.
More From GoodReturns

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications