IT News: ఇటీవల అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న టెక్ దిగ్గజం యాక్సెంచర్ తన త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భవిష్యత్తుపై కూడా ఆశాజనక వైకరిని కంపెనీ వెల్లడించిన సంగతి తెలిసిందే. అలాగే కంపెనీ తన ఆర్థిక ఫలితాలు ఊహించినదానికంటే మెరుగైన ఆదాయాలను నమోదు చేయటం భారతీయ ఐటీ పరిశ్రమలోని కంపెనీలకు మంచి రోజులు ముందున్నాయనే సానుకూల సంకేతాలను అందించింది.
ఈ క్రమంలో దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ బుధవారం తన బెంగాల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించింది. దీనిని న్యూ టౌన్లో రూ.426 కోట్లు వెచ్చించి టెక్ దిగ్గజం నిర్మించింది. కొత్త క్యాంపస్ ను దాదాపు 50 ఎకరాల్లో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నిర్మించిన ఈ క్యాంపస్ 4000 మంచి ఐటీ నిపుణులకు ఉపాధి అవకాశాన్ని కల్పించనున్నట్లు వెల్లడైంది. ఈ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ కు నూతన సంవత్సర కానుకగా పేర్కొన్నారు. ఇన్ఫోసిస్ వేసిన తాజా అడుగులు భవిష్యత్తులో మరిన్ని ఐటీ కంపెనీల రాకకు దారితీస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇప్పటికే బెంగాల్ లో టీసీఎస్, విప్రో, ఐబీఎమ్, యాక్సెంచర్ వంటి పెద్ద ఐటీ కంపెనీలతో పాటు దాదాపు 2200 కంపెనీలు తమ వ్యాపార కార్యకలాపాలను రాష్ట్రంలో నిర్వహిస్తున్నాయని ఆమె వెల్లడించారు.

27,000 కోట్ల పెట్టుబడితో 75,000 ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉన్న 200 ఎకరాల్లో కొత్త సిలికాన్ వ్యాలీ న్యూ టౌన్కి రాబోతోందని ముఖ్యమంత్రి మమతా వెల్లడించారు. ఈ క్రమంలో ఇప్పటికే 28 సంస్థలు 11 డేటా సెంటర్లతో కలిసి పనిచేస్తున్నట్లు మమతా చెప్పారు. అలాగే కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ రాబోతోందని, అది ఐటీ కంపెనీలకు కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని ఆమె నొక్కి చెప్పారు. డేటా సెంటర్లు, బ్రాడ్బ్యాండ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కోసం మార్గదర్శకాలకు సంబంధించిన విధానాలను కూడా రాష్ట్రం రూపొందించిందని వెల్లడించారు. పశ్చిమ బెంగాల్లో ఉన్న టాలెంట్ పూల్ తాము కొత్తగా ఏర్పాటు చేసిన డెవలప్మెంట్ సెంటర్ కు దోహదపడుతుందని సీఎఫ్ఓ జయేష్ సంఘ్రాజ్కా పేర్కొన్నారు.
నారాణయమూర్తి వ్యాఖ్యలు..
కాలుష్యంతో పాటు వాతావరణ మార్పులపై సకాలంలో ఎదుర్కోవడంలో విఫలమైతే భవిష్యత్తులో హైదరాబాద్, పూణే, బెంగళూరు నగరాలు పెద్ద ఎత్తున వలసలు చూసే అవకాశం ఉందని ఇన్ఫోసిస్ సహయవ్యవస్థాపకుడు నారాణయమూర్తి వెల్లడించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పుల వల్ల ఈ మార్పు కలనిపిస్తుందని అన్నారు. ట్రాఫిక్ మరియు కాలుష్యం వంటి సమస్యల కారణంగా బెంగళూరు, పూణే, హైదరాబాద్లో నివసించడం చాలా కష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు. భారత్లోని కార్పొరేట్ రంగం రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లకు సహకరించాలి, భారీ వలసలు లేకుండా చూసుకోవాల్సిన సవాలుగా పూణేలో జరిగిన ఒక కార్యక్రమంలో మూర్తి పేర్కొనటం ప్రస్తుతం సంచలనంగా మారింది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

ఇన్ఫోసిస్ ఉద్యోగులకు షాక్: వారానికి 4 రోజులు ఆఫీసు నుంచే పని తప్పనిసరి! హైబ్రిడ్ మోడల్కు ముగింపు పలికిన కంపెనీ

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications