గుడ్ న్యూస్:1.20 లక్షల కొలువులకు ఐటీ కంపెనీస్ రెడీ
ఐటీ ప్రాజెక్టుల్లో పనిచేసేందుకు ఫ్రెషర్స్ నియామకానికి కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, విప్రో కంపెనీలు 1.20 లక్షల మంది ఫ్రెషర్స్ను నియమించుకుంటాయి. మరో 30 వేల మందికి వివిధ కొలువులు ఉండగా.. దాదాపు 1.50 లక్షల మందికి పైగా ఫ్రెషర్స్ క్యాంపస్ల నుంచి నేరుగా ఐటీ కారిడార్లలోకి అడుగుపెట్టనున్నారు.
మైండ్ట్రీ వంటి మధ్యశ్రేణి ఐటీ కంపెనీలు కూడా పెద్దసంఖ్యలో ఫ్రెషర్స్ను హైర్ చేయబోతున్నాయి. ఐటీ కంపెనీలకు భారీ ఆర్డర్లు వస్తున్న క్రమంలో బెంచ్పై ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులకు తగినంతగా లేకపోవడంతో టెకీల నియామకానికి మొగ్గుచూపుతున్నాయి. ఈ విషయాన్ని మానవ వనరుల కన్సల్టింగ్ సంస్థ ఎక్స్ఫెనో సహ వ్యవస్ధాపకుడు కమల్ కారంత్ పేర్కొన్నారు. కంపెనీలు బెంచ్ సిబ్బందిని తిరిగి పటిష్టం చేసేందుకు సిద్ధమవడంతో వచ్చే 12 నుంచి 18 నెలల్లో ఫ్రెషర్స్ నియామకాలు ఊపందుకుంటాయని చెప్పారు.
సీనియర్లు ఉద్యోగాలు మారేందుకు 70 శాతం వేతన పెంపును డిమాండ్ చేస్తుండటంతో వారి హైరింగ్ ఖరీదైన వ్యవహారంగా మారిందని తెలిపారు. ఇక దేశీ టెక్ దిగ్గజాలు టీసీఎస్ ప్రెడెన్షియల్ ఫైనాన్షియల్ నుంచి ప్రాజెక్టు దక్కించుకోగా, ఇన్ఫోసిస్కు దైమ్లర్ కాంట్రాక్ట్, విప్రో మెట్రో ఏజీ డీల్ను ఖరారు చేసుకున్నాయి. దీంతో ఆయా కంపెనీల్లో నియామకాల ప్రక్రియ ఊపందుకుంటుందని అంచనా వేశారు.