ఐఆర్సీటీసీలో 15-20 శాతం ప్రభుత్వ వాటా విక్రయం!

ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్(IRCTC)లో 15 శాతం నుండి 20 శాతం వాటాను ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో(OFS) విక్రయించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. సాధ్యమైనంత వరకు తక్కువ విడతలలో వీటిని పూర్తి చేయాలని భావిస్తోంది. IRCTCలో వాటా విక్రయ ప్రక్రియ నిర్వహణకు మర్చంట్ బ్యాంకర్ల నుండి బిడ్స్‌ను ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల విభాగం ఇప్పటికే ఆహ్వానించింది.

బిడ్స్ దాఖలుకు సెప్టెంబర్ 10వ తేదీ నుండి గడువు తేదీగా నిర్ణయించింది. ఆసక్తి కలిగిన కొనుగోలుదారులతో సెప్టెంబర్ 4న ప్రీబిడ్ సమావేశం నిర్వహించింది. ఇందులో బిడ్డర్లు లేవనెత్తిన సందేహాలపై స్పందించిన ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల విభాగం-దీపమ్ తన వెబ్ సైట్‌లో సమాధానాలు ఉంచింది. ఎంత మేర వాటాను ప్రభుత్వం తగ్గించుకోనుందనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ 15-20 శాతం వరకు ఉండవచ్చునని తెలిపింది.

IRCTC share price gains after reports indicate government may sell 15-20 percent stake

ప్రభుత్వం 15 శాతం నుండి 20 శాతం షేర్లు విక్రయిస్తుందని వార్తలు రావడంతో IRCTC షేర్లు నిన్న భారీగా లాభపడ్డాయి. అయితే ఈ రోజు మాత్రం మధ్యాహ్నం సమయానికి షేర్లు 2.41 శాతం నష్టపోయి రూ.1347 వద్ద ట్రేడ్ అయింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+