Infosys News: టెక్ పరిశ్రమలో ష్రెషర్లకు గతంలో కంపెనీలు భారీగా రిక్రూట్మెంట్ డ్రైవ్లో భాగంగా ఆఫర్ లెటర్లు అందించాయి. అయితే ఏళ్లు గడుస్తున్నప్పటికీ అభ్యర్థులను ఉద్యోగాల్లోకి పిలవకపోవటం పెద్ద ఆందోళనలకు దారితీసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఏప్రిల్ 2022 బ్యాచ్కి చెందిన సుమారు 1,500 మంది విద్యార్థులను ఆఫర్ లెటర్లు కలిగి ఉన్న అభ్యర్థులను రెండు రౌండ్ల ప్రీ-ట్రైనింగ్కు హాజరు కావాలని కోరింది. ఈ క్రమంలో దేశంలోని రెండవ అతిపెద్ద టెక్ దిగ్గజం సెప్టెంబర్ 2న కేవలం 115 మందికి మాత్రమే ఇప్పటి వరకు జాయిన్ తేదీగా ఇచ్చింది. ఈ క్రమంలో మిగిలిన అభ్యర్థులు తమ ఉద్యోగ అవకాశాల గురించి ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక అనిశ్చితికి తోడు పెరుగుతున్న ఆటోమేషన్ వంటి కారణాల వల్ల ఇన్ఫోసిస్లో హైరింగ్ ఆందోళనలు సాంకేతిక రంగంలో రిక్రూట్మెంట్లో విస్తృతమైన ఒత్తిడిని నొక్కి చెబుతోంది.

టెక్ కంపెనీ ఆన్బోర్డింగ్ ఆలస్యంపై విద్యార్థులు గందరగోళంలో ఉన్నారు. జూలైలో ఇన్ఫోసిస్ ఎంపిక చేసిన విద్యార్థులందరినీ 24 రోజుల పాటు తప్పనిసరి వర్చువల్ ప్రీ-ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం పిలిచింది. ఆగస్టులో కొంతమంది విద్యార్థులకు స్వీయ-అభ్యాస మాడ్యూల్ ఆధారిత ప్రీ-ట్రైనింగ్ నిర్వహించనుంది. ఈ నెల ప్రారంభంలో విద్యార్థులు ఆగస్టు 19 నుంచి ప్రారంభమయ్యే రెండవ ఆరు-వారాల వర్చువల్ ప్రీ-ట్రైనింగ్ కోసం ఇన్ఫోసిస్ రిక్రూట్మెంట్ టీమ్ నుంచి ఈమెయిల్ను అందుకున్నారు.
యోగ్యత అంచనాలో వైఫల్యం మీ చేరిన తేదీలను వాయిదా వేయడానికి దారి తీస్తుందని కంపెనీ పంపిన ఈమెయిల్ స్పష్టం చేసింది. ఇంకా మెయిల్కు స్పందించని వారు లేదా ప్రీ-ట్రైనింగ్కు చేరుకోని వారు ఇన్ఫోసిస్తో ఎంగేజ్మెంట్ కొనసాగించాలనే నిర్ణయం నుంచి వైదొలిగినట్లు పరిగణించబడతారని కంపెనీ వెల్లడించింది.
చాలా మంది సభ్యులు దేశంలోని టాప్ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేయాలనే ఆశయంతో ఇప్పటికే తమకు ఉన్న ఉద్యోగాలకు రాజీనామాలు సైతం చేసిన సంగతి తెలిసిందే. అయితే వారు ప్రస్తుతం ఇన్ఫోసిస్ తప్పనిసరి చేసిన ముందస్తు శిక్షణ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 2022 నుంచి దాదాపు 2,000 మంది గ్రాడ్యుయేట్లు ఇన్ఫోసిస్ నుంచి ఆన్ బోర్డింగ్ పిలుపు కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.
More From GoodReturns

AI గురించి భయపడకుండా నేర్చుకోండి.. ఉద్యోగం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందంటున్న నారాయణ మూర్తి..

ఇరాన్ వార్ దెబ్బకు వణుకుతున్న భారత ఐటీ సెక్టార్.. తీవ్ర ప్రమాదంలో కీలక ప్రాజెక్టులు..

ఒకే కంపెనీలో 10 ఏళ్లు ఉండాలా? లేక పదేళ్లలో 10 ఉద్యోగాలు మారాలా? ఏది బెస్ట్?

కేవలం ఆన్లైన్లో అప్లై చేస్తే చాలదు! ఈ రోజుల్లో జాబ్ రావాలంటే ఇలా చేయాల్సిందే!

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంతో సరికొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. గురి చూసిన కొట్టిన దెబ్బకి ప్రపంచ దేశాలు విలవిల..

బంగారం ధరల పెరుగుదలపై దిమ్మతిరిగే న్యూస్.. గత చరిత్రతో కీలక నివేదికను విడుదల చేసిన Kedia Advisory

హైదరాబాద్లో పాడ్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయ్.. మెట్రో స్టేషన్ నుంచి నేరుగా ఆఫీసుకే వెళ్లిపోవచ్చు ఇక..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

Bengaluru: టీసీఎస్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! మీ స్నేహితుడిని చేర్పించండి.. రూ. 40,000 గెలుచుకోండి!

హైదరాబాద్, పుణే వద్దు బెంగళూరు ముద్దు.. అధిక అద్దెలున్నా బెంగళూరును వదలమంటున్న టెక్ కంపెనీలు..



Click it and Unblock the Notifications