Indo-US Relations: డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ సుంకాలతో అమెరికా-భారత్ మధ్య సంబంధాలు (India- US Ties) దెబ్బతిన్న సంగతి విదితమే.ఇరు దేశాల మధ్య మాటలయుద్ధం నడుస్తుండగా.. చైనా, రష్యాకు భారత్ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. ఈ అంశం అమెరికా అధికారులకు మింగుడుపడక.. భారత్పై మీద విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అదే సమయంలో ఇంకాస్త ముందుకు వెళ్లి భారత్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంలో రాయబారిగా నామినేట్ చేసిన సెర్జియో గోర్, గురువారం అమెరికా-భారత్ సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత విదేశీ సంబంధాలపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. భారతదేశాన్ని చైనా నుండి దూరంగా ఉంచడం అమెరికాకు అత్యంత ప్రాధాన్యత అని పేర్కొన్నారు. భారతదేశంతో మా సంబంధం చైనాతో ఉన్న దానికంటే చాలా హృదయపూర్వకంగా ఉంది. భారత్ మా వైపుకు రావడం, చైనా నుంచి దూరంగా ఉండడం మా ప్రాధాన్యత అని నొక్కి చెప్పారు. ముడిచమురు, పెట్రోలియం ఉత్పత్తులు, LNG వంటి కీలక రంగాలలో భారత మార్కెట్ లోకి మా ఉత్పత్తులు మరింత సులభంగా ప్రవేశపెట్టేందుకు అమెరికా కృషి చేస్తోందని ఆయన చెప్పారు.

ఈ భాగస్వామ్యంలో కొన్ని అవరోధాలు ఉన్నప్పటికీ, దీర్ఘకాలిక సహకారంపై తమ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అమెరికా మొత్తం జనాభా కంటే భారత్లో మధ్య తరగతి ప్రజలే ఎక్కువ కావడం వల్ల..అమెరికాకు అపారమైన అవకాశాలను భారత్ అందిస్తుందని వివరించారు. ప్రస్తుతం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, వాటిని పరిష్కరించడానికి మేము ముందడుగు వేస్తున్నామని సెర్జియో గోర్ చెప్పారు. భారత ప్రభుత్వంతో, ప్రజలతో అమెరికా సంబంధం చాలా దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉందని, ఇది చైనీయులతో ఉన్న సంబంధం కంటే తక్కువ వత్తిడితో ఉన్నదని గోర్ స్పష్టం చేశారు.
చైనా విస్తరణవాదాన్ని భారత సరిహద్దు మాత్రమే కాకుండా మొత్తం ఆసియాలో ప్రమాదకరంగా అభివర్ణించారు. ఈ సందర్భంలో, ఇండో-యుఎస్ ముడి వాణిజ్య, డిఫెన్స్, సాంకేతిక రంగాల్లో చురుకైన చర్చలు జరుగుతున్నాయని గోర్ వెల్లడించారు. భారత వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ వాషింగ్టన్ పర్యటనను ప్రస్తావిస్తూ.. అమెరికా వాణిజ్య ప్రతినిధి రాయబారి జామిసన్ గ్రీర్తో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని గోర్ చెప్పారు.
ఆశాజనకమైన ఒప్పందం త్వరలోనే వస్తుందని, ప్రస్తుతం చిన్న విషయాలు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. భారతదేశంలోని రక్షణ విధానాలు, వాణిజ్య నియంత్రణలు అమెరికా-భారత్ భాగస్వామ్యాన్ని పూర్తిగా అభివృద్ధి చేయడంలో అడ్డంకిగా మారుతున్నాయని గోర్ సూచించారు. సెర్జియో గోర్ 38 ఏళ్ల వయస్సులో భారతదేశంలో అత్యంత యువ అమెరికా రాయబారి అవ్వబోతున్నారు. గోర్ భారతదేశ భౌగోళిక స్థితి, ఆర్థిక పెరుగుదల, సైనిక బలం అంతర్జాతీయ, ప్రాంతీయ స్థిరత్వానికి కీలకమైన అంశాలుగా గుర్తించారు. ఆయన చివరగా అమెరికా-భారత్ భాగస్వామ్యం 21వ శతాబ్దాన్ని నిర్వచిస్తుందని హైలైట్ చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఈ ఏడాది చివర్లో భారతదేశాన్ని సందర్శించడానికి అవకాశం ఉన్నట్లు ఇండో-US సంబంధాలపై నూతన దిశగా వక్తగా వ్యవహరిస్తున్న అమెరికా రాయబారి సెర్జీ గోర్ (Sergio Gor) పేర్కొన్నారు. ఈ ప్రకటన అమెరికా-భారత్ మధ్య సంబంధాలను మరింత బలపరచేందుకు కీలకంగా మారింది.ఈ సంవత్సరం నవంబర్లో భారత్లో జరగనున్న క్వాడ్ (Quad) దేశాధినేతల సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హాజరు కావడం సన్నాహకంగా జరుగుతోందని తెలుస్తోంది. ఇది ప్రస్తుతం ఉన్న చర్చల క్రమంలో జరుగుతున్న అంశమని, వారు అధినేతల సమావేశానికి సంబంధించిన అన్ని వివరాలను సన్నిహితంగా చూడడం జరుగుతున్నదని ఆయన వివరించారు.
2017లో భారతదేశం, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా కలిసి క్వాడ్ (Quad) కూటమిని ఏర్పాటు చేశారు. ఇది ప్రధానంగా ప్రాంతీయ స్థిరత్వం, సముద్ర భద్రత, వాణిజ్య మార్గాల సురక్షితం వంటి అంశాలను ముందుకు తెస్తూ, చైనా వ్యాప్తికి వ్యతిరేకంగా ఒక వ్యూహాత్మక భాగస్వామ్యంగా పనిచేస్తోంది. తొలిసారి 2021 సెప్టెంబర్ 24న వాషింగ్టన్లో ఈ దేశాధినేతల సమావేశం జరిగింది. ఆ తరువాత, గత ఏడాది ఈ సదస్సుకు అమెరికా ఆతిథ్యం ఇచ్చింది.
ఈసారి, భారతదేశం సదస్సుకు ఆతిథ్యాన్ని అందించబోతుంది. నవంబర్లో న్యూ ఢిల్లీలో జరగబోయే ఈ సదస్సుకు, అగ్రదేశాధినేతలు హాజరు కానున్నారు. ఇది కేవలం ముఖ్యమైన దౌత్య కార్యక్రమమే కాకుండా, భారతదేశం-అమెరికా సంబంధాలు, ఇండో-ప్రశాంత ప్రాంతంలోని భద్రతా వ్యూహాలు, ఆర్థిక, వ్యాపార రంగాల్లో గల భాగస్వామ్యం మరింత బలపడే అవకాశంగా కూచి నిలబడుతోంది.
More From GoodReturns

చైనా మాములుది కాదు..ఇరాన్ యుద్ధంతో ప్రపంచదేశాలు అల్లాడుతుంటే.. అది మాత్రం బంగారంతో..

ఇరాన్ యుద్దం ఆగకపోతే భారత్ సంక్షోభంలోకి..సంచలన రిపోర్ట్ విడుదల చేసిన గోల్డ్మన్ సాచ్స్

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు..డబుల్ గేమ్ మొదలు పెట్టిన చైనా.. గగ్గోలుపెడుతున్న ట్రంప్ ..

LPG: ఏడేళ్ల తర్వాత భారత్కు ఇరాన్ ఆయిల్: ఈ వారమే రాబోతున్న భారీ షిప్మెంట్!

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

ఈ రోజు రాత్రి ఇరాన్ శ్మశానంగా మారుతుంది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన..

Iran war: హోర్ముజ్ జలసంధిపై కీలక నిర్ణయం.. ఊపిరి పీల్చుకోనున్న ఆయిల్ మార్కెట్!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?



Click it and Unblock the Notifications