విమానాశ్రయ కౌంటర్ లలో చెక్ ఇన్ చెయ్యాలంటే రూ. 100 సర్వీస్ ఛార్జ్ .. ఇండిగో వెల్లడి
విమానాశ్రయ కౌంటర్లలో చెక్-ఇన్ చేయాలనుకుంటే 100 రూపాయల సర్వీస్ ఫీజు చెల్లించాలని విమానయాన సంస్థ ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. కరోనావైరస్ మహమ్మారి నేపధ్యంలో విమానాశ్రయంలో టచ్ పాయింట్లను తగ్గించడానికి ప్రయాణీకులకు వెబ్ చెక్-ఇన్ చెయ్యటాన్ని మే నెలలో విమానయాన మంత్రిత్వ శాఖ తప్పనిసరి చేసింది. ఇండిగో 2020 అక్టోబర్ 17 నుండి విమానాశ్రయ కౌంటర్లలో చెక్-ఇన్ కోసం 100 రూపాయల సేవా రుసుమును ప్రవేశపెట్టింది అని ఒక ప్రకటనలో తెలిపింది.
ఇండిగో వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ఉపయోగించి, ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రయాణీకులందరినీ వెబ్ చెక్-ఇన్ చేయమని మేము ప్రోత్సహిస్తున్నామని పేర్కొంది . విమానాశ్రయ కౌంటర్లలో చెక్-ఇన్ ఫీజు అక్టోబర్ 17, 2020 నుండి చేసిన అన్ని బుకింగ్లకు వర్తిస్తుందని పేర్కొంది ఇండిగో ఎయిర్ లైన్స్ . తక్కువ-ధర క్యారియర్ అయిన ఇండిగో ఎయిర్ లైన్స్ తన వినియోగదారుల కోసం కాంటాక్ట్లెస్ మరియు ఇబ్బంది లేని ప్రయాణ అనుభవం కోసం అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి కట్టుబడి ఉందని చెప్పారు.
కరోనా నేపధ్యంలో సేఫ్టీ ప్రమాణాలను పాటించటానికి 100 రూపాయల సేవా చార్జ్ వేస్తున్నట్టు చెప్తున్నారు .ఆన్లైన్లో చెక్-ఇన్ చేయడం ద్వారా విమానాశ్రయంలో దీర్ఘ క్యూలలో వేచి ఉండకుండా ఉండటానికి వెబ్ చెక్-ఇన్ ఫీచర్ వినియోగదారులకు సహాయపడుతుంది. షెడ్యూల్ చేసిన ప్రయాణాలకు 1 గంట ముందు ఎప్పుడైనా వెబ్ చెక్-ఇన్ చేయవచ్చు. ఇండిగో మొబైల్ యాప్ తో ఇండిగో ఎయిర్లైన్స్ కు సంబంధించి అన్ని వివరాలను తెలుసుకోవచ్చు.