సీనియర్ ఉద్యోగులకు ఇండిగో విమానయాన సంస్థ షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కరోనా కారణంగా విమానయాన రంగం భారీ నష్టాల్లోకి కూరుకుపోయింది. దీంతో అంతర్జాతీయ కంపెనీలు సహా దేశీయ కంపెనీలు ఉద్యోగులను తొలగించడం లేదా ఉద్యోగుల వేతనాల్లో కోత విధించడం చేస్తున్నాయి.

ఏడాదంతా కోత
కరోనా ప్రభావం వల్ల ఈ ఆర్థిక సంవత్సరం (2020-21) మొత్తంగా జీతాల్లో 25% వరకు కోత ఉంటుందని శనివారం ఇండిగో ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చిలోనే మళ్లీ పూర్తి వేతనాల గురించి ఆలోచిస్తామని తెలిపింది. మే, జూన్, జూలై నెలలకుగాను 5% నుంచి 25% వరకు వేతనాల్లో కోత పెడుతున్నట్లు శుక్రవారమే ప్రకటించింది. అయితే ఈ నిర్ణయాన్ని వచ్చే ఏడాది మార్చి దాకా పొడిగిస్తున్నట్లు తర్వాత ప్రకటించింది. మే, జూన్, జూలై నెలలకు గాను వేతనం లేని సెలవులు కూడా సీనియర్ ఉద్యోగులకు ఇస్తున్నట్లు ప్రకటించింది.

ఏప్రిల్ పూర్తి వేతనం
ఇండిగో ఏప్రిల్ నెలకు గాను ఉద్యోగులకు పూర్తి వేతనం చెల్లించింది. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరం మొత్తం వేతనాల కోత విధించాలని నిర్ణయించింది. తొలుత మార్చి 19న శాలరీ కట్స్ ప్రకటించింది. ఆ తర్వాత వెనక్కి తీసుకుంది. తిరిగి శుక్రవారం పే-కట్స్ ప్రకటించింది. శనివారం సీనియర్ ఉద్యోగులకు ఏడాదంతా వేతనం కట్ చేస్తున్నట్లు ప్రకటించింది.

రూ.25,000 కోట్ల ఆదాయ నష్టం
కాగా, కరోనా విమాయాన రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోందని క్రిసిల్ ఇటీవల వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ రంగంపై రూ.24,000 కోట్ల నుండి రూ.25,000 కోట్ల ఆదాయం కోల్పోవాల్సి వస్తుందని అంచనా వేసింది. విమానయాన సంస్తలు మరీ దారుణంగా దెబ్బతిన్నాయని, మొత్తం ఆదాయ నష్టంలో 70 శాతం వాటా వీటి వాటానే ఉంటుందని క్రిసిల్ పేర్కొంది.
More From GoodReturns

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

1 Crore: 10 ఏళ్లలో రూ. 1 కోటి..! రిస్క్ లేకుండా కోటీశ్వరులు అయ్యే ప్లాన్ ఇదే!

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ‘లండన్' సొల్యూషన్.. ఇకపై కంజెషన్ ట్యాక్స్!

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

మార్కెట్ క్రాష్ సమయంలో ఇన్వెస్టర్లకు నగదు చాలా కీలకం.. రాబర్ట్ కియోసాకి సంచలన వ్యాఖ్యలు..

Stock market: మార్కెట్ నష్టాల్లో కూడా లాభాల్లో ఉన్న ఏకైక రంగం ఇదే.. మీరు ఈ షేర్లు కొన్నారా?

బంగారం ధరల పెరుగుదలపై UBS సంచలన నివేదిక.. పసిడి పెట్టుబడిదారులకు పండగే పండగ..



Click it and Unblock the Notifications