ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు(జూలై 30) లాభాల్లో ట్రేడింగ్ను ప్రారంభించాయి. ఉదయం గం.9.16 సెన్సెక్స్ 200 పాయింట్లు లాభపడి 38,271.85, నిఫ్టీ 49.80 పాయింట్లు లాభపడి 11,252.70 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ప్రారంభంలో 664 షేర్లు లాభాల్లో, 265 షేర్లు నష్టాల్లో, 47 షేర్లలో ఎలాంటి మార్పులేదు. ఐటీ, ఫార్మా రంగాలు భారీ లాభాల్లో ఉన్నాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, మారుతీ సుజుకీ, విప్రో, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, టాప్ లూజర్స్ జాబితాలో బీపీసీఎల్, ఐవోసీ, ఇండస్ఇండ్ బ్యాంకు, హీరో మోటో కార్ప్, పవర్ గ్రిడ్ కార్ప్ ఉన్నాయి. మధ్యాహ్నం గ.12.31 సమయానికి సెన్సెక్స్ 235 పాయింట్లు ఎగిసి 38,310 పాయింట్ల వద్ద ఉంది. ఈ రోజు మొత్తం వందలాది కంపెనీలు క్వార్టర్ ఫలితాలు ప్రకటించనున్నాయి.

డాక్టర్ రెడ్డీస్ ఈ రోజు నాలుగు శాతం జంప్ అయింది. ఈ కంపెనీ షేర్లు రెండు రోజుల్లో 10 శాతానికి పైగా జంప్ చేసింది. దీంతో సరికొత్త గరిష్టానికి చేరుకుంది. సాగర్ సిమెంట్స్ 12 శాతం దూసుకెళ్లింది. ఈ ఏడాది క్వార్టర్ 1 ఫలితాల్లో సాగర్ సిమెంట్స్ నికర లాభం 22 శాతం లాభపడి రూ.36 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం మాత్రం 23 శాతం క్షీణించి రూ.264 కోట్లకు చేరింది. వాటాదారులకు షేర్కు రూ.2.5 డివిడెండ్ ప్రకటించింది.
డాక్టర్ రెడ్డీస్ తర్వాత విప్రో, మారుతీ సుజుకీ, ఏషియన్ పేయింట్స్, టీసీఎస్ మంచి లాభాల్లో ఉన్నాయి. టీసీఎస్ షేర్ ధర దాదాపు 2 శాతం పెరిగి రూ.2,319.50, హెచ్సీఎల్ టెక్నాలజీస్ 2.30 శాతం పెరిగి రూ.710.30 వద్ద, ఇన్ఫోసిస్ రూ.1.45 శాతం పెరిగి రూ.968.50కు చేరుకుంది. మారుతీ సుజుకీ షేర్ 2.67 శాతం పెరిగి రూ.6,350.00గా ఉంది.
More From GoodReturns

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

స్టాక్ మార్కెట్లో భారీ పతనం.. రూ.11 లక్షల కోట్లు ఆవిరి.. సెన్సెక్స్ 1,800 పాయింట్లు డౌన్

కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్.. దెబ్బకు దక్షిణ కొరియా మార్కెట్లో నిలిచినపోయిన ట్రేడింగ్..

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..



Click it and Unblock the Notifications