ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు(జూలై 30) లాభాల్లో ట్రేడింగ్ను ప్రారంభించాయి. ఉదయం గం.9.16 సెన్సెక్స్ 200 పాయింట్లు లాభపడి 38,271.85, నిఫ్టీ 49.80 పాయింట్లు లాభపడి 11,252.70 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ప్రారంభంలో 664 షేర్లు లాభాల్లో, 265 షేర్లు నష్టాల్లో, 47 షేర్లలో ఎలాంటి మార్పులేదు. ఐటీ, ఫార్మా రంగాలు భారీ లాభాల్లో ఉన్నాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, మారుతీ సుజుకీ, విప్రో, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, టాప్ లూజర్స్ జాబితాలో బీపీసీఎల్, ఐవోసీ, ఇండస్ఇండ్ బ్యాంకు, హీరో మోటో కార్ప్, పవర్ గ్రిడ్ కార్ప్ ఉన్నాయి. మధ్యాహ్నం గ.12.31 సమయానికి సెన్సెక్స్ 235 పాయింట్లు ఎగిసి 38,310 పాయింట్ల వద్ద ఉంది. ఈ రోజు మొత్తం వందలాది కంపెనీలు క్వార్టర్ ఫలితాలు ప్రకటించనున్నాయి.

డాక్టర్ రెడ్డీస్ ఈ రోజు నాలుగు శాతం జంప్ అయింది. ఈ కంపెనీ షేర్లు రెండు రోజుల్లో 10 శాతానికి పైగా జంప్ చేసింది. దీంతో సరికొత్త గరిష్టానికి చేరుకుంది. సాగర్ సిమెంట్స్ 12 శాతం దూసుకెళ్లింది. ఈ ఏడాది క్వార్టర్ 1 ఫలితాల్లో సాగర్ సిమెంట్స్ నికర లాభం 22 శాతం లాభపడి రూ.36 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం మాత్రం 23 శాతం క్షీణించి రూ.264 కోట్లకు చేరింది. వాటాదారులకు షేర్కు రూ.2.5 డివిడెండ్ ప్రకటించింది.
డాక్టర్ రెడ్డీస్ తర్వాత విప్రో, మారుతీ సుజుకీ, ఏషియన్ పేయింట్స్, టీసీఎస్ మంచి లాభాల్లో ఉన్నాయి. టీసీఎస్ షేర్ ధర దాదాపు 2 శాతం పెరిగి రూ.2,319.50, హెచ్సీఎల్ టెక్నాలజీస్ 2.30 శాతం పెరిగి రూ.710.30 వద్ద, ఇన్ఫోసిస్ రూ.1.45 శాతం పెరిగి రూ.968.50కు చేరుకుంది. మారుతీ సుజుకీ షేర్ 2.67 శాతం పెరిగి రూ.6,350.00గా ఉంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications