Stock Market: వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 371 పాయింట్లు పతనమై 61,560 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 104 పాయింట్లు నష్టపోయి 18,181 వద్ద స్థిరపడింది. బ్యాంక్ నిఫ్టీ వరుసగా రెండో రోజు కూడా పతనమైంది. నిఫ్టీ ఐటీ కూడా నష్టాల్లో ముగిసింది.
బీఎస్ఈ 30 ఇండెక్స్ లో భారతీ ఎయిర్ టెల్, ఇండస్ ఇండ్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐటీసీ, మారతీ, ఎస్బీఐఎన్, ఎం&ఎం లాభాల్లో ముగిశాయి. ఎల్&టీ, నెస్లా ఇండియా, రిలయన్స్, టాటా మోటర్స్, హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్, సన్ ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, , టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్, బజాజ్ ఫిన్ సర్వ్, కొటాక్ మహీంద్రా, టీసీఎస్, ఏసియన్ పెయింట్స్, హెచ్ సీఎల్ టెక్, హిందూస్థాన్ యూనిలివర్, విప్రో, ఇన్ఫోసిస్ నష్టాల్లో స్థిరపడ్డాయి.
ముఖ్యంగా ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. టీఎసీఎస్ దాదాపు 2 శాతం పడిపోయింది. ఇన్ఫోసిస్ 1.26 శాతం, హెచ్ సీఎల్ టెక్ 1.35 శాతం, టెక్ మహింద్రా 0.30 శాతం, ఎల్&టీ 0.54 శాతం నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.16 శాతం క్షీణించగా.. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.25 శాతం లాభంతో ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీలు ఒక్కొక్కటి శాతం పైగా పడిపోయాయి. BSE-లిస్టెడ్ సంస్థల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ మే 15న రూ. 278.7 లక్షల కోట్ల నుంచి మే 17 వరకు రూ. 277.2 లక్షల కోట్లకు పడిపోయింది. దీంతో పెట్టుబడిదారులు రెండు సెషన్లలో రూ. 1.5 లక్షల కోట్ల మేర నష్టపోయారు.