భారత సంతతి కుబేరుల చేతికి బ్రిటన్ ఫాస్ట్ ఫుడ్ కంపెనీ
ప్రఖ్యాత బ్రిటన్ ఫాస్ట్ ఫుడ్ కంపెనీ లియోన్ను భారత సంతతికి చెందిన కుబేర సోదరులు మోసిన్, జుబేర్ ఇస్సాలు కొనుగోలు చేశారు. బ్రిటన్లో తమ ఆహార సేవల కార్యకలాపాలను పెంచుకునే లక్ష్యంలో భాగంగా ఈ ట్రాన్సాక్షన్ను చేపట్టినట్లు ఆ సోదరులు తెలిపారు. ఒప్పందం వ్యాల్యూ దాదాపు రూ.1,040 కోట్లుగా ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా.
1970లలో గుజరాత్ నుండి ఈ సోదరుల తల్లిదండ్రులు బ్రిటన్కు వలస వెళ్లారు. వీరికి ఈజీ గ్రూప్ వ్యాపారాల కింద యూరో గ్యారేజెస్ పేరిట పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఇంధనేతర రంగంలోకి తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు.
గత ఏడాది బ్రిటన్ సూపర్ మార్కెట్ సంస్థ అస్డాను సైతం వాల్మార్ట్ నుండి కొనుగోలు చేశారు. జాన్ విన్సెంట్, హెన్రీ డింబుల్బై, అలెగ్రా మెక్ఎవడీలు 2004లో లియోన్ను స్థాపించారు. హెల్తీ మెనూ కోసం నేచరల్లీ ఫాస్ట్ ఫుడ్ కేటగిరీ కింద దీనిని ప్రారంభించారు.