గత సంవత్సరం రష్యా, ఉక్రెయిన్ యుద్ధంగా కారణంగా రష్యాపై అనే దేశాలు ఆంక్షాలు విధించాయి. ముఖ్యంగా యూరప్ దేశాలు రష్యా పై ఆంక్షాలు విధించి చమురు కొనుగోలును నిలిపివేశాయి. దీంతో రష్యా డిస్కౌంట్ తో భారత్ కు ముడి చమురు విక్రయిస్తామని ముందుకొచ్చింది. దీంతో దొరికందే ఛాన్స్ గా భారత చమురు కంపెనీలు.. తగ్గింపుతో రష్యా వద్ద ముడి చమురు కొనుగోలు చేస్తున్నాయి. ప్రభుత్వ కంపెనీలు డిస్కౌంట్ తో చమురు కొనుగోలు చేసి లాభాలతో గతంలో వచ్చిన నష్టాలను పూడ్చుకుంటున్నాయి.
ఇక ప్రైవేట్ చమురు కంపెనీలు మాత్రమే లాభాలే ధ్యేయంగా పని చేస్తున్నాయి. రాయిటర్స్ నివేదిక ప్రకారం, భారతదేశంలోని అనేక చమురు శుద్ధి కర్మాగారాలు రష్యా నుంచి పెద్ద మొత్తంలో ముడి చమురును కొనుగోలు చేసి ఐరోపాకు ఎగుమతి చేస్తున్నాయి. ఇందులో అత్యధికంగా డీజిల్, జెట్ ఇంధనం ఎగుమతి చేస్తున్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాపై విధించిన ఆంక్షల కారణంగా అనేక పాశ్చాత్య దేశాలు రష్యా నుంచి నేరుగా చమురును కొనుగోలు చేయలేకపోతున్నాయి.

అటువంటి పరిస్థితిలో భారత్ నుంచి రష్యా చమురును కొనుగోలు చేస్తున్నాయి.దీంతో భారత్ లోని చమురు శుద్ధి కర్మాగారాలు భారీ లాభాలను ఆర్జిస్తాయని అంచనా. భారతీయ చమురు శుద్ధి కర్మాగారాలు యూరప్ లో భారీగా మార్కెట్ను సొంతం చేసుకున్నాయి. షిప్పింగ్ డేటాను పర్యవేక్షించే కెప్లర్ ప్రకారం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముందు, జెట్ ఇంధనం, డీజిల్ భారత నుంచి యూరోపియన్ దేశాలకు రోజుకు 154,000 బ్యారెల్స్తో ఎగుమతి అయ్యేది.
ప్రస్తుతం రోజుకు 200,000 బ్యారెళ్లకు పెరిగింది. దీనితో పాటు మార్చిలో వరుసగా 7వ నెలలో రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి పెరిగింది. ప్రస్తుతం రష్యా నుంచి భారత్ అత్యధికంగా ముడి చమురును కొనుగోలు చేస్తోంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభానికి ముందు ఇండియా రష్యా నుంచి ముడి చమురును తక్కువ పరిమాణంలో మాత్రమే కొనుగోలు చేసేది. ఎందుకంటే చమురును భారత్ కు తీసుకురావడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది.
కానీ యుద్ధం తరువాత తగ్గింపుతో రష్యా చమురును విక్రయిస్తుంది. ఇండియాలోని అతిపెద్ద చమురు కంపెనీ ఇండియన్ ఆయిల్ రష్యాకు చెందిన అతిపెద్ద చమురు కంపెనీ రోస్నెఫ్ట్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా కొన్నేళ్లలో రష్యా నుంచి భారత్ పెద్ద మొత్తంలో ముడి చమురును దిగుమతి చేసుకోనుంది.


Click it and Unblock the Notifications