IT News: ఇళ్ల నుంచి ఆఫీసులకు ససేమిరా రామంటున్న ఐటీ ఉద్యోగులకు తాయిలాలు ప్రకటించాయి ఐటీ కంపెనీలు. ముందు వర్క్ ఫ్రమ్ హోమ్ పూర్తిగా తొలగిద్దామని ప్లాన్ చేసినప్పటికీ అందుకు అందరూ అంగీకరించలేదు. దీనిపై కంపెనీలు అనేక అంతర్గత సర్వేలు చేపట్టాయి కూడా.

హైబ్రిడ్ విధానం..
కరోనా తర్వాత ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల పనితీరు వాతావరణం చాలా మారిపోయింది. ఈ క్రమంలో కంపెనీలు కొన్ని రోజులైనా వారిని ఆఫీసులకు తీసుకురావాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా వారికి ఫ్లేక్సిబిలిటీని అందిస్తూ హ్రైబ్రిడ్ వర్క్ విధానాన్ని మేళవించాయి. మెుదట్లో దీనిని సైతం చాలా మంది వ్యతిరేకించినప్పటికీ అన్ని దిగ్గజ కంపెనీలూ ఇదే బాటలో పయనించటంతో ఉద్యోగులు మాట వినటం ప్రారంభించారు.

మూన్ లైటింగ్..
కరోనా సమయంలో కంపెనీలు అందించిన వర్క్ ఫ్రమ్ హోన్ విధానాన్ని చాలా మంది ఉద్యోగులు దుర్వినియోగం చేసినట్లు కంపెనీలు గుర్తించాయి. ఆ కాలంలో ఒక కంపెనీకి తెలియకుండా మరో కంపెనీలో పనిచేయటం ప్రారంభించారు. ఇది కంపెనీల వ్యాపారానికి, ప్రాజెక్టుల భద్రతకు అతిపెద్ద ముప్పుగా మారినట్లు ఐటీ పరిశ్రమ గ్రహించింది. దీంతో చాలా కంపెనీలు అలాంటి ఉద్యోగులను గుర్తించి తొలగించటం ప్రారంభించాయి.

సాంకేతికత వినియోగం..
ఈ క్రమంలో ప్రస్తుతం ఆఫీసులకు రాని ఉద్యోగులను ట్రాక్ చేసే పనిలో పడ్డాయి కంపెనీలు. వారు ఏ లొకేషన్ నుంచి పనిచేస్తున్నారో గుర్తించే పనిలో ఉన్నట్లు నివేదికలు ఉన్నాయి. ఇది కంపెనీలకు అట్రిషన్ రేటు తగ్గించటంతో పాటు రెండు ఉద్యోగాల దోహణిని అరికట్టేందుకు ఉపయోగపడుతుందని చాలా కంపెనీలు భావిస్తున్నాయి. పైగా టెక్నాలజీ ద్వారా ఉద్యోగులను పర్యవేక్షించటం ద్వారా ఉత్పాదకత పెరుగుతుందని టెక్ కంపెనీలు భావిస్తున్నట్లు సమాచారం.

శాటిలైట్ వినియోగం..
తాజా టెక్నికల్ పర్యవేక్షణలో భాగంగా ఉద్యోగులు ఎక్కడ ఉన్నా.. నేరుగా శాటిలైట్ ద్వారా కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతారని నిపుణులు చెబుతున్నారు. దీని ద్వారా ఉద్యోగులు అనుమతించబడిన చోట మాత్రమే పనిచేస్తున్నారా? అనే విషయాలను కంపెనీలు గుర్తిస్తాయని సమాచారం. కస్టమర్లను ఏ సమయంలో, ఎంతసేపు సేవలు అందిస్తున్నారనే దానిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక యాప్ లను సైతం కంపెనీలు వినియోగించే పనిలో ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి

వ్యక్తిగత స్వేచ్ఛ..
అయితే కంపెనీలు చేపట్టనున్న ట్రాకింగ్ విధానం వల్ల.. ఉద్యోగులు వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోయే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. కంపెనీలు ఎప్పుడైనా ట్రాక్ చేయాలనుకునే ఫీచర్ గురించి చాలా మంది ఉద్యోగులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇది తమ వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతంగా ఉంటుందని వారు అంటున్నారు. కంపెనీలు మాత్రం పోటీ ప్రపంచంలో, మాంద్యం మధ్య తగ్గిన వ్యాపార లాభాలతో సతమతమవుతూనే ఉత్పాదకతను పెంచేందుకు టెక్నాలజీని వినియోగించాలని నిర్ణయించాయి.
More From GoodReturns

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications