IT Sector: ప్రపంచంలో ప్రతిభ కలిగిన టెక్ ఉద్యోగులు తక్కువ వ్యయానికి దొరుకుతుండటంతో ఇండియా ఐటీ రంగంలో కొన్ని సంవత్సరాల కిందట వేగంగా అభివృద్ధి చెందింది. ప్రతి ఏటా వేల సంఖ్యలో కొత్త కొలువులు కల్పించిన ఈ రంగం ప్రస్తుతం పెద్ద కుదుపుకు గురైంది.
ఒక నివేదిక ప్రకారం గడచిన ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగంలో ఆదాయ వృద్ధి మందగించిన కారణంగా దేశంలోని ప్రధాన ఐటీ కంపెనీలు ఏకంగా 72,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు తేలింది. ఇందులో టాప్ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, LTIMindtree వంటి కంపెనీలు ఉన్నాయి.

మార్చి 31తో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సర కాలంలో దేశంలోని టాప్-6 ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య 72,063 మేర తగ్గింది. ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలు తమ టెక్ స్పెండింగ్ బడ్జెట్లను తగ్గించటంతో పాటు కొనసాగుతున్న అనిశ్చిత డిమాండ్ వాతావరణం క్షీణతకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. వ్యాపారంలో గడ్డు పరిస్థితుల కారణంగా 254 బిలియన్ డాలర్లు విలువైన భారత ఐటీ రంగం భారీగా ప్రభావితం అయ్యింది. దీంతో వ్యాపారం మందగించటం, పెద్ద డీల్స్ తక్కువగా ఉండటం వంటి పరిస్థితులు నెలకున్నాయి. దీంతో కంపెనీలు ఉద్యోగాలను తగ్గించి దానికి తగినట్లుగా నియామకాలు చేపట్టాల్సి వచ్చింది.
ఈ క్రమంలో ఐటీ సేవల రంగంలోని ప్రధాన కంపెనీల తాజా డేటాను పరిశీలిస్తే.. మార్కెట్ లీడర్ టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 13,249 తగ్గింది, ఇక తొలగింపుల విషయంలో టాప్ స్థానంలో నిలిచిన ఇన్ఫోసిస్ కంపెనీలో 25,994 మంది ఉద్యోగులు తగ్గారు. ఇక విప్రోలో 24,516, టెక్ మహీంద్రాలో 6,945, LTIMindtree 2896 మంది ఉద్యోగులు తొలగింపబడ్డారు. ప్రస్తుతం వ్యాపారంలో పరిస్థితులు తలకిందులైనప్పటికీ.. కరోనా మహమ్మారి సమయంలో మాత్రం టెక్కీలకు పిచ్చ డిమాండ్ ఏర్పడింది. ఆ సమయంలో ఫేక్ ఎంట్రీలతో ఉద్యోగాల్లోకి వచ్చిన వారు సైతం
మేము వివిధ కంపెనీల గురించి మాట్లాడినట్లయితే, ఈ కాలంలో మార్కెట్ లీడర్ TCS 13,249 మంది ఉద్యోగులను తొలగించగా, ఇన్ఫోసిస్ 25,994 మంది ఉద్యోగులను తొలగించింది. అదే సమయంలో, విప్రో మొత్తం 24,516 మంది ఉద్యోగులను తొలగించగా, సాఫ్ట్వేర్ ఎగుమతిదారు టెక్ మహీంద్రా 6,945 మందిని తొలగించగా, LTIMindtree 2896 మంది ఉద్యోగులను తొలగించింది. కోవిడ్ మహమ్మారి తర్వాత వెంటనే తమ సేవలకు బలమైన డిమాండ్ కారణంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలోని టాప్ 6 ఐటీ కంపెనీలు 86,500 మందికి పైగా ఉద్యోగులను చేర్చుకున్నాయని మీకు తెలియజేద్దాం.
More From GoodReturns

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

ఇన్ఫోసిస్ ఉద్యోగులకు షాక్: వారానికి 4 రోజులు ఆఫీసు నుంచే పని తప్పనిసరి! హైబ్రిడ్ మోడల్కు ముగింపు పలికిన కంపెనీ

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications