IT News: ఐటీ సిబ్బందికి షాక్..!! టాప్ ఐటీ కంపెనీల్లో ఏం జరుగుతోంది..?

IT Sector: ప్రపంచంలో ప్రతిభ కలిగిన టెక్ ఉద్యోగులు తక్కువ వ్యయానికి దొరుకుతుండటంతో ఇండియా ఐటీ రంగంలో కొన్ని సంవత్సరాల కిందట వేగంగా అభివృద్ధి చెందింది. ప్రతి ఏటా వేల సంఖ్యలో కొత్త కొలువులు కల్పించిన ఈ రంగం ప్రస్తుతం పెద్ద కుదుపుకు గురైంది.

ఒక నివేదిక ప్రకారం గడచిన ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగంలో ఆదాయ వృద్ధి మందగించిన కారణంగా దేశంలోని ప్రధాన ఐటీ కంపెనీలు ఏకంగా 72,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు తేలింది. ఇందులో టాప్ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, LTIMindtree వంటి కంపెనీలు ఉన్నాయి.

Indian IT companies Layoffs 72063 employees in FY 2023-24 from TCS wipro to Infosys

మార్చి 31తో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సర కాలంలో దేశంలోని టాప్-6 ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య 72,063 మేర తగ్గింది. ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలు తమ టెక్ స్పెండింగ్ బడ్జెట్లను తగ్గించటంతో పాటు కొనసాగుతున్న అనిశ్చిత డిమాండ్ వాతావరణం క్షీణతకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. వ్యాపారంలో గడ్డు పరిస్థితుల కారణంగా 254 బిలియన్ డాలర్లు విలువైన భారత ఐటీ రంగం భారీగా ప్రభావితం అయ్యింది. దీంతో వ్యాపారం మందగించటం, పెద్ద డీల్స్ తక్కువగా ఉండటం వంటి పరిస్థితులు నెలకున్నాయి. దీంతో కంపెనీలు ఉద్యోగాలను తగ్గించి దానికి తగినట్లుగా నియామకాలు చేపట్టాల్సి వచ్చింది.

ఈ క్రమంలో ఐటీ సేవల రంగంలోని ప్రధాన కంపెనీల తాజా డేటాను పరిశీలిస్తే.. మార్కెట్ లీడర్ టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 13,249 తగ్గింది, ఇక తొలగింపుల విషయంలో టాప్ స్థానంలో నిలిచిన ఇన్ఫోసిస్ కంపెనీలో 25,994 మంది ఉద్యోగులు తగ్గారు. ఇక విప్రోలో 24,516, టెక్ మహీంద్రాలో 6,945, LTIMindtree 2896 మంది ఉద్యోగులు తొలగింపబడ్డారు. ప్రస్తుతం వ్యాపారంలో పరిస్థితులు తలకిందులైనప్పటికీ.. కరోనా మహమ్మారి సమయంలో మాత్రం టెక్కీలకు పిచ్చ డిమాండ్ ఏర్పడింది. ఆ సమయంలో ఫేక్ ఎంట్రీలతో ఉద్యోగాల్లోకి వచ్చిన వారు సైతం

మేము వివిధ కంపెనీల గురించి మాట్లాడినట్లయితే, ఈ కాలంలో మార్కెట్ లీడర్ TCS 13,249 మంది ఉద్యోగులను తొలగించగా, ఇన్ఫోసిస్ 25,994 మంది ఉద్యోగులను తొలగించింది. అదే సమయంలో, విప్రో మొత్తం 24,516 మంది ఉద్యోగులను తొలగించగా, సాఫ్ట్‌వేర్ ఎగుమతిదారు టెక్ మహీంద్రా 6,945 మందిని తొలగించగా, LTIMindtree 2896 మంది ఉద్యోగులను తొలగించింది. కోవిడ్ మహమ్మారి తర్వాత వెంటనే తమ సేవలకు బలమైన డిమాండ్ కారణంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలోని టాప్ 6 ఐటీ కంపెనీలు 86,500 మందికి పైగా ఉద్యోగులను చేర్చుకున్నాయని మీకు తెలియజేద్దాం.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+