India-US Trade Deal Impact: భారతదేశం అమెరికా మధ్య కుదిరిన తాజా వాణిజ్య ఒప్పందం భారత ఎగుమతిదారులకు తక్షణ ఉపశమనాన్ని కలిగించే కీలక పరిణామంగా మారింది. ఈ ఒప్పందం ప్రకారం అమెరికా.. భారతీయ వస్తువులపై విధిస్తున్న పరస్పర సుంకాలను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి రావడంతో.. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో కొత్త దశ ప్రారంభమైనట్లుగా మార్కెట్లు భావిస్తున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందాన్ని అధికారికంగా ధృవీకరించారు. అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందానికి మేము అంగీకరించాము. దీని ద్వారా పరస్పర సుంకాలను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నాం. అలాగే భారతదేశం కూడా అమెరికాపై ఉన్న సుంకాలు, నాన్-టారిఫ్ అడ్డంకులను పూర్తిగా తొలగించేందుకు ముందుకు వస్తోందని ఆయన తెలిపారు. ఇది వేగవంతమైన అమలు, పరస్పర మార్కెట్ ప్రాప్యతకు స్పష్టమైన సంకేతంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఇంతకుముందు అమెరికా మార్కెట్లో కొన్ని భారతీయ ఉత్పత్తులపై 50 శాతం వరకు సుంకాలు ఉండటం వల్ల.. భారత ఎగుమతిదారుల పోటీతత్వం తీవ్రంగా దెబ్బతింది. దీని కారణంగా ఎగుమతి ఆధారిత రంగాల్లో మార్జిన్ ఒత్తిడి, ఆర్డర్ అనిశ్చితి పెరిగాయి. ఇప్పుడు సుంకాల తగ్గింపుతో, అమెరికాకు గణనీయమైన ఎక్స్పోజర్ ఉన్న కంపెనీలకు మెరుగైన ఆర్డర్ విజిబిలిటీ, మార్జిన్ విస్తరణ, ధరల పరంగా పోటీ సామర్థ్యం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
రైట్ రీసెర్చ్ PMS వ్యవస్థాపకురాలు, ఫండ్ మేనేజర్ సోనమ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. సుంకాలను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడం భారతీయ ఈక్విటీ మార్కెట్లకు అర్థవంతమైన సానుకూల పరిణామం. ఇది పెట్టుబడిదారుల సెంటిమెంట్తో పాటు, ఆదాయాల దృశ్యమానతను కూడా మెరుగుపరుస్తుంది" అని వ్యాఖ్యానించారు. సుంకాల ఉపశమనం నేపథ్యంలో పెట్టుబడిదారుల దృష్టి ఎగుమతి ఆధారిత రంగాల వైపు మళ్లే అవకాశం ఉంది. ముఖ్యంగా గతంలో అధిక సుంకాల కారణంగా ఆదాయాలు ఒత్తిడికి గురైన రంగాల్లో ఇప్పుడు పునరుజ్జీవనం కనిపించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
గ్రీన్ పోర్ట్ఫోలియో PMS సహ వ్యవస్థాపకుడు దివమ్ శర్మ మాట్లాడుతూ.. వస్త్రాలు, దుస్తులు, ఆటో అనుబంధాలు, ఇంజనీరింగ్, స్పెషాలిటీ రసాయనాలు, వ్యవసాయ, సముద్ర ఆహార ఎగుమతులు, అలాగే US ఎక్స్పోజర్ ఉన్న కొన్ని ఎలక్ట్రానిక్స్, వినియోగదారు తయారీ రంగాలు ప్రధానంగా లాభపడే అవకాశం ఉంది. ఇది ఎగుమతులు, తయారీపై దృష్టి పెట్టిన తాజా బడ్జెట్కు అనుగుణంగా ఉందని అన్నారు.
వస్త్రాలు, దుస్తుల రంగం ఈ ఒప్పందం ద్వారా అతిపెద్ద లబ్ధిదారులలో ఒకటిగా నిలవనుంది. భారత వస్త్ర ఎగుమతుల్లో అమెరికా వాటా సుమారు 28 శాతం ఉండటంతో.. సుంకాల తగ్గింపు ఈ రంగానికి పెద్ద ఊరటగా నిలవనుంది. అలాగే సముద్ర ఆహార రంగం, ముఖ్యంగా రొయ్యల ఎగుమతులు చేసే కంపెనీలకు డిమాండ్ రికవరీ అవకాశాలు మెరుగవుతాయని అంచనా వేస్తున్నారు.
ఆటోమొబైల్, ఆటో అనుబంధ రంగాల్లో అమెరికాకు ఎక్స్పోజర్ ఉన్న కంపెనీలు స్థిరమైన ఆర్డర్ ప్రవాహాలను చూడవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. స్పెషాలిటీ రసాయనాలు, వ్యవసాయ రసాయనాలు, ప్యాక్ చేసిన ఆహారం, బియ్యం ఉత్పత్తులు, అలాగే రత్నాలు, ఆభరణాల రంగానికి కూడా ఈ సుంకాల తగ్గింపు విశ్వాసాన్ని పునరుద్ధరించే అంశంగా మారనుంది.
టెక్ హార్డ్వేర్ విభాగంలో ల్యాప్టాప్లు, గాడ్జెట్లు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ వంటి ఉత్పత్తులు మరింత పోటీ ధరలకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ గూడ్స్, గృహోపకరణాల దిగుమతి ఖర్చులు కూడా తగ్గవచ్చని అంచనా.భారత్ నుంచి పెద్ద ఎత్తున ఎగుమతి అయ్యే రత్నాలు, ఆభరణాల రంగానికి కూడా ఈ ఒప్పందం లాభదాయకంగా మారనుంది. అదేవిధంగా పారిశ్రామిక, ఇంజనీరింగ్ ఉత్పత్తులు అయిన స్టీల్, రసాయనాలు వంటి వాటికి మార్కెట్ యాక్సెస్ సులభతరం కానుందని అంచనా.
వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా ఈ ఒప్పందం సానుకూల ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. పప్పు ధాన్యాలు, పాల ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు తగ్గితే, పెరుగుతున్న ఆహార ధరల ఒత్తిడి కొంత మేర తగ్గే అవకాశం ఉంది. దీని వల్ల వినియోగదారుల ఖర్చులు నియంత్రణలోకి రావచ్చని భావిస్తున్నారు.
అయితే, ఈ ఒప్పందంలో అన్ని ఉత్పత్తులకు పూర్తిస్థాయి సడలింపులు లభించలేదని విశ్లేషకులు చెబుతున్నారు. స్టీల్, అల్యూమినియం, రాగి వంటి కొన్ని ఉత్పత్తులపై దాదాపు 50 శాతం వరకు సుంకాలు కొనసాగనున్నట్లు సమాచారం. అలాగే కొన్ని ఆటోమొబైల్ విడిభాగాలపై కూడా అధిక సుంకాలు యథాతథంగా ఉండే అవకాశముంది. అంతేకాకుండా ఈ ఒప్పందంలో భాగంగా రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించి, అమెరికా, వెనిజులా నుంచి చమురు కొనుగోళ్లను పెంచుకునే దిశగా భారత్ అంగీకరించినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఇరు దేశాల నేతలు ఈ ఒప్పందంపై ప్రకటనలు చేసినప్పటికీ.. దీనికి సంబంధించిన పూర్తి నిబంధనలు, అమలు విధానం, మినహాయింపులపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఆ వివరాలు వెలువడిన తర్వాతే ఈ ఒప్పందం ప్రభావం ఎంత మేర ఉంటుందన్నది పూర్తిగా స్పష్టమయ్యే అవకాశం ఉంది.
More From GoodReturns

పాకిస్తాన్లా బ్రోకర్ పనులు భారత్ ఎప్పటికీ చేయదు.. ట్రంప్తో ఫోన్లో ప్రధాని మోదీ మాట్లాడారు: జైశంకర్

ఈస్టర్ 2026: గుడ్ ఫ్రైడే, పామ్ సండే, లెంట్ తేదీల పూర్తి వివరాలు ఇవిగో..

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications