India US Trade Deal: ప్రపంచంలోని అతిపెద్ద రెండు ప్రజాస్వామ్య దేశాలైన భారత్ (India), అమెరికా (US) మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (Bilateral Trade Agreement) తొలి దశపై చర్చలు ఈ నెల 10వ తేదీ నుంచి న్యూఢిల్లీలో మూడు రోజుల పాటు ప్రారంభం కానున్నాయి.

ప్రస్తుతం రెండు దేశాల మధ్య వాణిజ్యం 191 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ సంఖ్యను 2030 నాటికి 500 బిలియన్లకు పెంచాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ చర్చలు విజయవంతమైతే, ముఖ్యంగా భారత ఎగుమతిదారులకు (Indian Exporters) పెద్ద ఊరట లభించనుంది.
ఎవరు నేతృత్వం వహిస్తున్నారు?
డిసెంబర్ 10 నుంచి 12 వరకు జరిగే ఈ అనధికారిక చర్చలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తొలి భాగాన్ని ఖరారు చేయడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. యుఎస్ తరఫూన డిప్యూటీ యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR) రిక్ స్విట్జర్ నేతృత్వంలోని బృందం చర్చల్లో పాల్గొననుంది. మన వాణిజ్య శాఖ జాయింట్ సెక్రటరీ దర్పణ్ జైన్.. భారత బృందానికి నాయకత్వం వహిస్తున్నారు.
అమెరికా అధికారులు భారత్లో పర్యటించడం ఇది రెండోసారి. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు నేపథ్యంలో భారత వస్తువులపై అమెరికా 25% వరకు సుంకాలు విధించిన తర్వాత ఈ చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
టారిఫ్ సమస్యపై ప్రత్యేక దృష్టి
భారత ఎగుమతిదారులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య పరస్పర సుంకాలు. భారత వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఇటీవల మాట్లాడుతూ.. ఈ ఏడాదిలోనే అమెరికాతో ఒక ఫ్రేమ్వర్క్ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు భారత్ ఆశాభావంతో ఉందని, దీని ద్వారా భారత ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరేలా సుంకాల అంశాన్ని పరిష్కరించవచ్చని తెలిపారు.
ఈ చర్చల్లో భారత్, అమెరికాలు రెండు రకాల చర్చలు జరుపుతున్నాయి. సుంకాల సమస్యను పరిష్కరించేందుకు ఒక ఫ్రేమ్వర్క్ వాణిజ్య ఒప్పందంపై చర్చ. అలాగే ఒక సమగ్ర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA)పై చర్చ.
ఎగుమతులపై సుంకాల ప్రభావం
అమెరికా, భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోంది. 2024-25లో రెండు దేశాల మధ్య వాణిజ్య విలువ 131.84 బిలియన్ డాలర్లు. భారతదేశ మొత్తం వస్తువుల ఎగుమతుల్లో దాదాపు 18 శాతం అమెరికాకే జరుగుతున్నాయి. అయితే అమెరికా విధించిన భారీ సుంకాల కారణంగా భారత ఎగుమతులు అక్టోబర్లో 8.58 శాతం తగ్గి 6.3 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అందుకే ఈ వాణిజ్య ఒప్పందం త్వరగా కుదరడం భారతీయ ఎగుమతిదారులకు అత్యంత ముఖ్యం.
ఈ వాణిజ్య చర్చలు సుంకాలపై స్పష్టమైన పరిష్కారాన్ని అందించి.. 2030 నాటికి 500 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి మార్గం సుగమం చేస్తాయని ఆశిద్దాం.
More From GoodReturns

ట్రంప్కు హ్యాండ్ ఇచ్చిన మిత్ర దేశాలు.. హార్ముజ్ జలసంధిపై యుధ్ధానికి రాలేమని స్పష్టం..

హార్ముజ్ జలసంధి వివాదం..అమెరికాకు చైనా బిగ్ షాక్.. వెంటనే సైనిక చర్యలు ఆపాలని డిమాండ్..

ఇరాన్ యుద్ధం త్వరలో ముగుస్తుంది.. ప్రపంచం మళ్లీ ప్రశాతంగా ఉంటుంది..ట్రంప కీలక వ్యాఖ్యలు

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు.. అందువల్లే అనుమతి ఇచ్చామని తెలిపిన అమెరికా..

ఇరాన్ యుద్ధం వేళ మరో టెన్షన్.. జపాన్ తూర్పు తీరం వైపు 10 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన కిమ్..

Iran war: యుద్ధం ఎప్పుడు ఆపాలో మేమే తేలుస్తాం.. ఇరాన్ అమెరికా మధ్య ముదురుతున్న మాటల యుద్ధం!

అమెరికాకు చైనా బిగ్ షాక్.. ఇరాన్కు రహస్యంగా నిధులు.. హార్ముజ్ జలసంధి నుంచి నిరంతరంగా చమురు సరఫరా..

యుద్దం ఆపడం మా చేతుల్లో ఉంది.. నీ చేతుల్లో కాదు.. ట్రంప్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ విసిరిన ఇరాన్..

ఒక్క చుక్క చమురు కూడా బయటికి రాదు.. హార్ముజ్ జలసంధి రవాణాపై ట్రంప్కు ఘాటు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్..

Oil prices: జపాన్ రహస్య ఆయిల్ నిధి! ఆరు నెలలకు సరిపడా చమురుని జపాన్ ఎలా దాచిపెట్టింది?

Iran war: కేవలం గ్యాస్ ఒక్కటే కాదు.. ఈ 5 రంగాలపై భారీ ఎఫెక్ట్ ఉండే అవకాశం?



Click it and Unblock the Notifications