భారతదేశ ఇంధన భద్రతను బలోపేతం చేసే దిశలో భాగంగా కీలకమైన నిర్ణయాన్ని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి సోమవారం ప్రకటించారు. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు (PSUs) అమెరికా నుండి ద్రవీకృత పెట్రోలియం వాయువు (LPG) దిగుమతి చేసుకోవడానికి మొదటిసారిగా ఒక సంవత్సరపు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని ఆయన తెలిపారు. ఈ ఒప్పందం భారతదేశ LPG మార్కెట్లో ఒక చారిత్రాత్మక మొదటిది నిర్ణమని మంత్రి పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సందేశంలో పూరి చెబుతూ.. ఈ ఒప్పందం భారత LPG సరఫరా వ్యవస్థలో భారీ మార్పుకు దారితీస్తుందని స్పష్టంచేశారు. ఇప్పటి వరకు భారతదేశం ప్రధానంగా మధ్యప్రాచ్య దేశాలపై LPG కోసం ఆధారపడేదని, కానీ ఈ కొత్త ఒప్పందంతో సోర్సింగ్ను వైవిధ్యపరచడం ప్రారంభమైందని తెలిపారు. ప్రపంచంలోనే వేగంగా పెరుగుతున్న Liquefied Petroleum Gas మార్కెట్లలో ఒకటైన భారత్.. ఇప్పుడు అమెరికా సరఫరాదారులకు అధికారికంగా తెరుచుకుంటోంది. ఇది సరఫరా భద్రతకు, ధరల నియంత్రణకు, భవిష్యత్ అవసరాల నిర్వహణకు చాలా కీలకమైన విజయంగా పేర్కొనాలని హర్దీప్ సింగ్ పూరి అన్నారు.
ఈ ఒప్పందం ప్రకారం.. భారతీయ PSUలు 2026 కాంట్రాక్ట్ సంవత్సరంలో సుమారు 2.2 మిలియన్ టన్నుల (MTPA) LPG ని అమెరికా నుండి దిగుమతి చేసుకోనున్నాయి. ఈ పరిమాణం భారత దేశం ప్రతీ ఏడాది దిగుమతి చేసుకునే మొత్తం LPGలో దాదాపు 10 శాతంకు సమానం. ఈ సరఫరా అమెరికా గల్ఫ్ కోస్ట్ ప్రాంతం నుండి వస్తుండటం గమనార్హం. ఇది భారత్కు అమెరికా నుండి LPG కోసం ఏర్పడిన తొలి నిర్మాణాత్మక దీర్ఘకాలిక ఒప్పందమని చెప్పవచ్చు.

ఈ డీల్కు ధర నిర్ణయాన్ని ప్రపంచంలో LPG ధరలకు ప్రామాణికమైన మౌంట్ బెల్వియూ బెంచ్మార్క్ కి అనుసంధానించి కుదుర్చుకున్నారు. ఇందుకోసం ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం సంస్థల ప్రతినిధులు అమెరికా ప్రధాన ఉత్పత్తిదారులుతో గత కొన్ని నెలలుగా చర్చలు జరిపారని మంత్రి వివరించారు. దీని ఫలితంగానే ఈ ముఖ్యమైన ఒప్పందం ఆమోదం పొందింది.
LPG ధరల మార్పులతో దేశంలోని వినియోగదారులు ఇబ్బందులు పడకుండా కేంద్ర ప్రభుత్వం నిరంతర చర్యలు తీసుకుంటోందని పూరి గుర్తుచేశారు. ప్రత్యేకించి, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారుల కోసం ప్రభుత్వం భారీ సబ్సిడీలు కొనసాగిస్తోందని ఆయన అన్నారు. అంతర్జాతీయ ఎల్పిజి ధరలు గత ఏడాది 60 శాతం వరకు పెరిగినప్పటికీ, ఉజ్వల వినియోగదారులు సిలిండర్కు కేవలం రూ. 500-550 మాత్రమే చెల్లించేలా సబ్సిడీ అందించబడింది. వాస్తవ ధర రూ. 1,100 దాటిన సమయంలో కూడా ప్రభుత్వం రూ. 40 వేల కోట్లకు పైగా వ్యయం చేసి, పేద కుటుంబాలను ధరల దెబ్బ నుండి రక్షించిందని మంత్రి తెలిపారు.
ఈ కొత్త అమెరికా LPG సరఫరా ఒప్పందం, భారతదేశం దీర్ఘకాలిక ఇంధన వ్యూహంలో ఒక ప్రధాన మైలురాయిగా నిలుస్తుందని పూరి అభిప్రాయపడ్డారు. సరఫరా మార్గాలను విస్తరించడం, భవిష్యత్ ధరల అస్థిరతను తగ్గించడం, వినియోగదారుల అవసరాలను భద్రపరచడం వంటి అంశాలలో ఈ ఒప్పందం కీలకపాత్ర పోషించనుంది.
More From GoodReturns

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

ముంచుకొస్తున్న 1970 చమురు సంక్షోభం.. ధరల పెరుగుదలతో పలు దేశాలు విలవిల..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Russian oil: ట్రంప్ క్లెయిమ్ VS రియాలిటీ.. రష్యా ఆయిల్ కొనుగోలుపై క్లారిటీ ఇచ్చిన న్యూఢిల్లీ!

భారత్ టైర్ పరిశ్రమను కుదిసేస్తున్న ఇరాన్ యుధ్ద ప్రభావం.. కీలకమైన హెచ్చరిక చేసిన CLSA

Iran war: ఇరాన్ సంచలన నిర్ణయం.. అణు బాంబు తయారీ ఆపేస్తాం! కానీ ఆ ఒక్క కండిషన్!

ఇరాన్ మీద దాడులు.. బట్ట బయలైన అమెరికా కుట్రలు.. ప్రపంచానికి నిజాన్ని తెలిపిన స్పెయిన్..

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

ఎర్ర సముద్రంలో కల్లోలం..భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్..తడిసిమోపెడవుతున్న ఛార్జీలు..



Click it and Unblock the Notifications