భారత్ తన వార్షిక బడ్జెట్లో ప్రభుత్వ పెట్టుబడులకు ప్రాధాన్యతను ఇచ్చినందుకు ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ (IMF) ప్రశంసిస్తూ.... ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో ఆహార భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, బలహీనులకు బదలీని విస్తరించాలని కోరింది. ఐఎంఎఫ్ ఆర్థిక వ్యవహారాల విభాగం డిప్యూటీ డైరెక్టర్ పాలో మారో బుధవారం విలేకరుల సమావేశంలో ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు యాన్యువల్ స్ప్రింగ్ మీటింగ్ సందర్భంగా మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఈ ఆర్థిక పరిణామాల నుండి వస్తున్న సవాళ్లను ప్రస్తావించారు.
భారత్లో ద్రవ్యోల్భణం కొంతవరకు పెరిగినట్లు గుర్తించామని తెలిపారు. ఈ సమస్యను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న కేంద్ర బ్యాంకు ఆర్బీఐ కంఫోర్ట్ జోన్ కంటే ఇది కాస్త ఎక్కువగా ఉందని తెలిపారు. ఆర్థికబరంగా బడ్జెట్ దాదాపు తటస్థంగా ఉందని, ఈ సమయంలో ఇది వివేకవంతంగా ఉందన్నారు.

అయితే ఆహార ధరల పెరుగుదలను, ఇంధన ధరల పెరుగుదలను బట్టి చూస్తే ఇది కుటుంబాలకు ఇబ్బందికరంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో మొదట ఆహార భద్రతకు ప్రాధాన్యతను ఇవ్వడం, బలహీన వర్గాలకు బదలీని విస్తరించడం అవసరమని సూచించారు. భారత ప్రజలకు ప్రభుత్వం కరోనా వంటి కీలక సమయంలో ఆహార సరఫరా, నగదు బదలీని సమర్థవంతంగా నిర్వహించిందని, ఇది కొనసాగాలని, విస్తరించాలన్నారు. మరో విషయం ఏమంటే ప్రభుత్వ పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వడం ఓ మంచి అంశమన్నారు.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications