భారతదేశంలో ధనిక-పేదల మధ్య ఆదాయ అంతరంపై చెన్నైకి చెందిన ఆర్థిక నిపుణులు డి. ముత్తుకృష్ణన్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఈ రెండింటి మధ్య కంటికి కనిపించే దానికంటే మరింత లోతుగా అంతరం ఉందని నొక్కి చెప్పారు. ఆయన ఎక్స్ లో పోస్ట్ చేసిన వివరాల ప్రకారం.. దేశంలోని దిగువ 90 శాతం ప్రజలు జాతీయ ఆదాయంలో కేవలం 43 శాతం మాత్రమే పొందుతున్నారన్నారు. మిగతా 10 శాతం ప్రజలు దేశ సంపదలో సగానికి పైగా వాటా కలిగి ఉన్నట్లుగా ఆయన చెబుతున్నారు.
జాతీయ తలసరి GDP 2,700 డాలర్లుగా ఉన్నప్పటికీ.. అగ్ర ధనికులలో 10 శాతం సంపాదకులను లెక్కలోంచి తీసేస్తే.. మిగతా 90 శాతం మందికి ఈ సంఖ్య కేవలం 1,300 డాలర్లకి పడిపోతుందని ముత్తుకృష్ణన్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..ఇది సబ్-సహారా ఆఫ్రికా, పాకిస్తాన్ పరిస్థితుల కంటే దారుణమని స్పష్టం చేశారు. మీరు అగ్ర స్థానంలోని 150 మిలియన్లలో లేని పక్షంలో, మిగిలిన 1.3 బిలియన్లలో ఒకరైతే, మీ రోజువారీ జీవితం అక్షరాలా నరకంలా ఉంటుందని ఆయన తెలిపారు.

ముత్తుకృష్ణన్ విశ్లేషణలో.. భారతదేశంలోని సుమారు 150 మిలియన్ల అధిక ఆదాయ సంపాదకులు దేశాన్ని ప్రపంచ వేదికపై చాలా ధనవంతమైన దేశంగా చూపించే భ్రమను సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. అయితే మిగతా 1 బిలియన్ ప్రజలకు పరిస్థితి పూర్తిగా విరుద్ధంగా ఉందని ఆయన హెచ్చరించారు. దేశంలోని దిగువ 90 శాతం ప్రజలు జాతీయ ఆదాయంలో కేవలం 43 శాతం మాత్రమే సంపాదిస్తున్నారు. మిగిలిన 10 శాతం సంపన్న వర్గం దేశ సంపదలో సగానికి పైగా వాటా కలిగి ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఇండస్ బేసిన్ నివేదికను ఆయన ఉదహరించారు. దాదాపు ఒక బిలియన్ మంది భారతీయులు ఖచ్చితంగా సున్నా కొనుగోలు శక్తిని కలిగి ఉన్నారని ముత్తుకృష్ణన్ పేర్కొన్నారు. ఈ వర్గం ప్రజలు ప్రధానంగా ప్రాథమిక అవసరాలకే ఖర్చు చేస్తూ.. ప్రభుత్వ సబ్సిడీలపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. వారికే నిజమైన ఆర్థిక స్వేచ్ఛ లేదా అభివృద్ధి అవకాశాలు లేవని చెబుతున్నారు. ప్రభుత్వ పెద్దలు పెరుగుతున్న GDP సంఖ్యలను ప్రదర్శిస్తున్నప్పటికీ.. గ్రామీణ-పట్టణ పేదరికం, కొనుగోలు శక్తి అంతరం మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితిలో.. భారతదేశ వృద్ధి స్థిరత్వంపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
ఆయన ఏమంటున్నారంటే.. ఆదాయ అసమానతను తగ్గించడానికి విధానాలు కేవలం GDP పెంపుపై కాకుండా సమాన వనరుల పంపిణీ, ఉద్యోగ అవకాశాల విస్తరణపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈపోస్టు మీద పలువురు స్పందించారు. GDP పెరిగినా, పేదరికం తగ్గకపోతే ఆ అభివృద్ధి ప్రజలకు ఉపయోగం ఏమిటని చాలామంది ప్రశ్నించారు. ఆర్థిక అసమానతపై బహిరంగంగా మాట్లాడటానికి ఇలాంటి ఆర్థిక నిపుణులు ముందుకు రావడం అవసరమని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఏదేమైనా భారతదేశంలో వేగంగా పెరుగుతున్న ఆర్థిక అసమానత, ప్రపంచంలోని అత్యంత వెనుకబడిన ప్రాంతాలతో పోలిస్తే కూడా ఆందోళనకర స్థాయికి చేరుకుందని విషయం ముత్తుకృష్ణన్ పోస్టు ద్వారా తెలుస్తోంది.
More From GoodReturns

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications