కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలతో పాటు భారత ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. సుదీర్ఘ లాక్ డౌన్ ప్రభావం మరింతగా పడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21)లో భారత జీడీపీలో రుణాలు రూ.170 ట్రిలియన్లకు లేదా 87.6 శాతానికి పెరగవచ్చునని ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎకోరాప్ నివేదిక అంచనా వేసింది. ఈ నివేదికను గ్రూప్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ సౌమ్యకాంతి ఘోష్ ఆధ్వర్యంలో తయారయింది. ఈ నివేదిక ప్రకారం...

జీడీపీ పతనం.. జీడీపీలో రుణం 87.6 శాతానికి..
ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో జీడీపీ వృద్ధి తగ్గడం, జీడీపీతో రుణ నిష్పత్తి పెరగడం అన్ని దేశాలను ప్రభావితం చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో అధిక స్థాయిలో రుణాలు తీసుకోవడం వల్ల స్థూల రుణ మొత్తం జీడీపీలో రూ.170 ట్రిలియన్లకు (87.6 శాతం)కు చేరుకునే అవకాశం ఉంది. ఇందులో బాహ్య రుణాలు రూ.6.8 ట్రిలియన్లు లేదా జీడీపీలో 3.5 శాతంగా ఉండనున్నాయి. ఇందులో రాష్ట్రాల రుణ రేటు జీడీపీలో 27 శాతంగా ఉంటుందని అంచనా. మరో ముఖ్య విషయం ఏమంటే జీడీపీ సంకోచం కారణంగా జీడీపీ రేషియోలో రుణాలపై 4 శాతం మేర ప్రభావం పడనున్నాయి.

జీడీపీ-రుణ రేషియో
జీడీపీ-రుణ రేషియోను సులభంగా చెప్పాలంటే... భారత ప్రభుత్వ రుణాలు, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ (జీడీపీ) మధ్య నిష్పత్తి. జీడీపీలో రుణ రేషియో తక్కువగా ఉంటే అప్పులు చేయకుండా అప్పులు తిరిగి చెల్లించడానికి సరిపోయే వస్తువులు, సేవలను ఉత్పత్తి చేసి విక్రయించే బలమైన ఆర్థిక వ్యవస్థకు నిదర్శనం.

ఎనిమిదేళ్లలో రుణాల పెరుగుదల
కానీ గత కొన్నేళ్లుగా జీడీపీతో పోలిస్తే రుణాలు పెరుగుతున్నాయి. 2011-12 ఆర్థిక సంవత్సరంలో రుణాలు రూ.58.8 ట్రిలియన్లు (జీడీపీలో 67.4 శాతం ఉండగా, 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.146.9 ట్రిలియన్లు(72.2 శాతం)కు పెరిగాయి. రుణాల్లో క్రమంగా పెరుగుదల ఉన్నప్పటికీ రుణస్థాయి దాదాపు స్థిరంగా ఉందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం విదేశీ మారక నిల్వలు బాహ్య రుణ బాధ్యతలను నెరవేర్చేందుకు సరిపోతాయని, అలాగే ఇంటర్నల్ రుణాలు పెద్ద సమస్య కాదని ఘోష్ అన్నారు.

పెరుగుతున్న రుణాలు..
కేరి రేటింగ్స్ చీఫ్ ఎకనమిస్ట్ మదన్ సబ్నవీస్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం జూలై 17, 2020న రూ.34,000 కోట్లను సమీకరించింది. జూలైలో ఇప్పటి వరకు తీసుకున్న రుణాలు రూ.1.02 ట్రిలియన్లు. నోటిఫై చేసిన మొత్తం కంటే ఇది రూ.12,000 కోట్లు అధికం. అలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం సమీకరించిన మొత్తం రూ.4.5 ట్రిలియన్లు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 66 శాతం అధికం. అలాగే కేంద్రం ఈ ఏడాది సవరించిన రూ.12 ట్రిలియన్లలో ఇది 37 శాతం. FY21 తొలి అర్ధ సంవత్సరానికి ఇది 64 శాతం.

FRBM టార్గెట్.. ఏడేళ్లు
FRBM (ఫిస్కల్ రెస్పాన్సిబులిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్) కమిటీ జీడీపీలో రుణాన్ని 60 శాతానికి చేరుకోవడానికి టార్గెట్ను 2022-23 ఆర్థిక సంవత్సరాన్ని నిర్దేశించింది. కానీ కరోనా మహమ్మారి భారీగా దెబ్బతీసింది. దీంతో ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి మరో ఏడేళ్లు పడుతుందని, FY30లో మాత్రమే ఇది సాధ్యమని ఈ నివేదిక అంచనా వేసింది. కరోనా, లాక్ డౌన్ ప్రభావం భారీగా పడినట్లు ఈ నివేదిక తెలిపింది. ఎఫ్ఆర్బీఎం కమిటీ కేంద్రానికి ఈ టార్గెట్ను ఏడేళ్లు పొడిగించే అవకాశముందని తెలిపింది.
More From GoodReturns

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications