2021-22 వార్షిక తలసరి ఆదాయం రూ.1.5 లక్షలుగా ఉందని ఎన్ఎస్ఓ వెల్లడించింది. 2020-21లో నమోదైన రూ.1,26,855తో పోలిస్తే ఇది 18.3 శాతం ఎక్కువ. తలసరి ఆదాయం ఇప్పటికీ కరోనా ముందుస్థాయి కంటే తక్కువగా ఉంది. 2019-20లో తలసరి ఆదాయం రూ.1.32 లక్షలుగా ఉంది. స్థిర ధరల వద్ద తలసరి వార్షిక ఆదాయం FY21లోని రూ.85,100తో పోలిస్తే FY22లో 7.5 శాతం పెరిగి రూ.91,481గా నమోదయింది. కరోనాకు ముందు అంటే అంటే FY20లో ఇది రూ.94,270. FY21లో రూ.85,110కి పరిమితమైంది.
ఇతర దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం మెరుగైన స్థితిలో ఉందని ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ అన్నారు. దేశ ఆర్థిక రంగం సరైన స్థితిలో ముందుకు వెళ్తుండటం వృద్ధికి దోహదం చేస్తుందన్నారు. భారత్కు స్టాగ్ఫ్లేషన్ ముప్పు అవకాశాలు తక్కువ అని తెలిపింది. దేశంలో కీలక 8 మౌలిక రంగాల ఉత్పత్తి వృద్ధి ఏప్రిల్ నెలలో 8.4 శాతంగా నమోదయింది.

ఇది ఆరు నెలల గరిష్టం. 2021 అక్టోబర్ నెలలో నమోదైన 8.7 శాతం తర్వాత ఇది గరిష్టం. రిఫైనరీ ఉత్పత్తులు, విద్యుత్ రంగాలు మెరుగైన పనితీరును కనబరిచాయి. మార్చిలో కీలక రంగాల ఉత్పత్తి వృద్ధి 4.9 శాతంగా నమోదయింది.
ఇదిలా ఉండగా, 2022 క్యాలెండర్ ఏడాదికి భారత వృద్ధి అంచనాలను సవరించేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి కసరత్తు చేస్తోంది. 9 శాతం వృద్ధి రేటు లభిస్తుందని జనవరిలో అంచనా వేసిన ఐఎంఎఫ్, ఏప్రిల్లో దానిని 8.2 శాతానికి సవరించింది. 2023లో 6.9 శాతం నమోదు కావొచ్చునని పేర్కొంది. అయితే ఇప్పుడు 2022 వృద్ధి అంచనాలు సవరించే అవకాశముంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications