భారత్-పాకిస్తాన్ మధయ యుధ్దం ముగిసిపోలేదని భవిష్యత్తులో ఎప్పుడైనా రావొచ్చని మాజీ లెఫ్టినెంట్ జనరల్ హెచ్ఎస్ పనాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకోసం భారత్ సిధ్దంగా ఉండాలని సూచించారు. ఆపరేష్ సింధూర్ తర్వాత ఇరు దేశాల మధ్య యుధ్ధం ఆగిపోయిన సంగతి విదితమే. జమ్మూకాశ్మీర్లో 26 మంది పౌరుల ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదులను ఏరివేసేందుకు భారత్ ఆపరేషన్ సింధూర్ ప్రకటించింది.
పాకిస్తాన్ లో దాక్కున్న ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా ఈ మిషన్ ప్రారంభించింది. అయితే ఆ తర్వాత ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించాయి. ఈ సమయంలో పాకిస్థాన్తో కాల్పుల విరమణ ఒప్పందం సైనిక చర్యల పరిధిలోనే ఉంటుందని, సింధు నదీ జలాల ఒప్పందం తాత్కాలికంగా నిలిపివేత సహా ఆ ఐదు అంశాల్లో ఎలాంటి మార్పు లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

అయితే ఇప్పుడు తాజాగా మాజీ లెఫ్టినెంట్ జనరల్ హెచ్ఎస్ పనాగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఐదు నుండి పది సంవత్సరాలలో భారతదేశం మళ్ళీ దాయాది దేశంతో యుధ్దానికి సిద్ధం కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు ది ప్రింట్ లో ఆయన వ్యాసం రాసారు. ఈ సారి జరగబోయే యుద్ధంలో దాయాది దేశానికి చైనా కూడా మద్ధతు ఇచ్చే అవకాశం ఉందని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో భారత్ రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి భారతదేశం కొన్ని చర్యలు తీసుకోవలసి ఉంటుందని వ్యాసంలో పేర్కొన్నారు. రక్షణ బడ్జెట్ను GDPలో 4%కి రెట్టింపు చేయడంతో సహా పలు కీలక అంశాలను ఆయన వ్యాసంలో తెలిపారు. పాకిస్తాన్ మరియు చైనా రెండూ కలిసి భారతదేశానికి ఎప్పటికైనా ముప్పు కలిగించవచ్చు. కాబట్టి భారతదేశం తన సైన్యాన్ని బలోపేతం చేయాల్సి ఉంటుందని పనాగ్ తెలిపారు. భారతదేశ రక్షణ బడ్జెట్ సాధారణంగా GDP (స్థూల దేశీయోత్పత్తి)కి అనుగుణంగా 2% నుండి 2.5% మధ్య ఉంటుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి, ఇది రూ. 6,81,210.27 కోట్లు (సుమారు $ 86.1 బిలియన్) కేటాయించింది మోదీ సర్కారు. ఇది గతేడాది ఆర్థిక సంవత్సరం (2024-25) కంటే 9.53% ఎక్కువ.
ఇది మొత్తం కేంద్ర బడ్జెట్లో దాదాపు 13.45%గా ఉంది. ఈ బడ్జెట్లో ఎక్కువ భాగం (సుమారు రూ. 1.80 లక్షల కోట్లు) సాయుధ దళాల ఆధునీకరణతో పాటు వారికి కొత్త ఆయుధాలు, విమానాలు, యుద్ధనౌకల సేకరణ వంటి వాటి కోసం కేటాయించారు. దేశీయ రక్షణ పరిశ్రమల నుండి సేకరణ కోసం ప్రభుత్వం ఈ మొత్తాన్ని (రూ. 1.12 లక్షల కోట్లు) కేటాయించింది.
చైనా ఎప్పుడూ భారతదేశానికి ప్రధాన శత్రువేనని పనాగ్ తెలిపారు. పాకిస్తాన్ కన్నా చైనా చాలా డేంజర్ అని చెప్పుకొచ్చారు.పాకిస్తాన్ మళ్ళీ బలంగా మారి భారత్ మీద కయ్యానికి కాలు దువ్వితే.. చైనా దానికి మద్దతు ఇస్తుందని యుద్ధ తీవ్రత పెరుగుతుందని పనాగ్ తెలిపారు. వచ్చే 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ మధ్యలో యుధ్దం జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. కాబట్టి భారత్ రక్షణ విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని పనాగ్ కోరారు.
More From GoodReturns

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

ఎర్ర సముద్రంలో కల్లోలం..భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్..తడిసిమోపెడవుతున్న ఛార్జీలు..

యురేనియం నుంచి వాణిజ్యం వరకు.. మోదీ–కార్నీ భేటీలో జరిగిన ఒప్పందాలు ఇవే..

పెట్రోల్,డీజిల్ ధరల షాక్.. ఒక్కసారిగా రూ.55 పెంపు.. ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications