ముంబై: భారత ఆర్థిక వ్యవస్థ అంపశయ్యపై కనిపిస్తోందని, ప్రస్తుతం వృద్ధి మాంద్యంలో ఉన్నామని, ప్రధానమంత్రి కార్యాలయంలో అధికారం కేంద్రీకృతం అయి ఉందని, కేంద్రమంత్రులు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. మంత్రులు ఏమీ చేయలేకపోతున్నారని ఓ ఆంగ్ల పత్రికకు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.

ప్రధాని కార్యాలయం చుట్టూనే తిరుగుతున్నాయి
వృద్ధికి, మాంద్యానికి మధ్యలో దేశ ఆర్థిక వ్యవస్థ కొనసాగుతోందని, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ దారుణంగా పడిపోయిందని రఘురాం రాజన్ అన్నారు. ప్రధాని కార్యాలయంలోనే అధికారం కేంద్రీకృతమై ఉందన్నారు. మందగమనం నేపథ్యంలో తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ప్రస్తుత ప్రభుత్వ కేంద్రీకృత విధానం నుంచి ప్రారంభించాలన్నారు. ఎందుకంటే ఏ చిన్న నిర్ణయమైనా, ఆలోచనలు - ప్రణాళికలైనా ప్రధాని చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులు లేదంటే పీఎంవో నుంచి వెలువడుతున్నాయన్నారు.

సామాజికంగా ఉపయోగపడొచ్చు
అవి రాజకీయంగా, సామాజికంగా ఉపయోగపడేవి కావొచ్చునని, కానీ దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని రఘురాం రాజన్ అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికంలో వృద్ధి రేటు 4.5 శాతంతో 26 త్రైమాసికాల కనిష్టానికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు.

5 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవాలంటే...
2024 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల (రూ.350 లక్షల కోట్లు) స్థాయికి తీసుకు వెళ్లాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే ప్రతి ఏడాది వృద్ధి రేటు 8 శాతం నుంచి 9 శాతం మధ్య స్థిరంగా ఉండాలని రాజన్ అన్నారు. ఈ లక్ష్యం నెరవేరడం కలే అన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది వాస్తవ రూపం దాల్చేలా లేదని పేర్కొన్నారు.

మాంద్యంలో ఉంది...
మోడీ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలతోనే దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర అనారోగ్యానికిలోనై అంపశయ్య పైకి చేరుకుందన్నారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి మాంద్యంలో పయనిస్తోందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలు తీవ్ర దురవస్థలో ఉన్నాయని, దీంతో ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ వృద్ధి మాంద్యంలో ఉందన్నారు.

ఇది సమస్య తీవ్రతకు సంకేతం
నిరుద్యోగం పెరిగిపోయిందని, ముఖ్యంగా యువతలో నిరుద్యోగం పెరిగిపోవడంపై రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. చేయిదాటితే యువతలో అశాంతి చెలరేగే ప్రమాదముందన్నారు. పెట్టుబడులు రావడం లేదని, ఇది సమస్య తీవ్రతకు సంకేతం అన్నారు.
More From GoodReturns

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications