భారతదేశంలో తీవ్రమవుతున్న నీటి కరువు.. మేలుకోకుంటే సంక్షోభం తప్పదంటున్న నిపుణులు

ప్రపంచ వ్యాప్తంగా తీవ్రంగా మారుతున్న వాతావరణం భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా డే జీరో కరువులు (Day Zero Droughts - DZD) రాబట్టే అవకాశాన్ని పరిశోధకులు హెచ్చరించారు. నేచర్ కమ్యూనికేషన్స్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం ప్రకారం, పెరుగుతున్న నీటి డిమాండ్‌ను పూరించలేకపోవడం వల్ల, పట్టణాలు మరియు వ్యవసాయ ప్రాంతాలు తీవ్రమైన నీటి కొరతతో బాధపడవచ్చని తెలిపింది.

డే జీరో కరువు (DZD) అంటే ఏమిటి?: DZD అనేది నీటి సరఫరా, డిమాండ్ సమతుల్యత దాటిపోయే దశను Day Zero Droughts అంటారు.. ఈ దశలో ప్రస్తుత వనరులతో ప్రజల అవసరాలను తీర్చడం అసాధ్యం అవుతుంది. పరిశోధకులు వాతావరణ నమూనాలు, గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల దృష్ట్యా, DZD పరిస్థితులు ఇప్పటికే బయటపడుతున్నాయని, భవిష్యత్తులో మరింత తీవ్రంగా మారబోతున్నాయని పేర్కొన్నారు. భారతదేశంలో కొన్ని నగరాలు ముఖ్యంగా చెన్నై, ఇప్పటికే ఈ పరిమితికి చేరువలో ఉన్నాయి.

India climate change risk Day Zero drought India water scarcity India climate crisis India drought warning global water shortage extreme weather India India environmental risk water emergency India climate change impact Day Zero Drought DZD Day Zero Drought Time of First Emergence ToFE
Photo Credit:

చెన్నైలో 20 లక్షలకు పైగా ప్రజలు ప్రతి 2-3 సంవత్సరాలకు కనీసం రెండు నెలలు మంచినీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. 2019లో నగరానికి 80 కోట్ల లీటర్ల నీరు అవసరమైంది కానీ 50 కోట్ల లీటర్లకే సరిపడింది. మరి, వేగంగా పెరుగుతున్న పట్టణ జనాభా కారణంగా పరిస్థితి మరింత దిగజారుతోందని కథనం తెలిపింది.

ప్రస్తుతం, భారతదేశంలోని జల వనరుల లభ్యత క్రమంగా తగ్గుతోంది. 1951లో ఒక్క వ్యక్తికి 5,200 క్యూబిక్ మీటర్ల నీరు లభించేది, 2021లో 1,486 క్యూబిక్ మీటర్లకు తగ్గింది. 2050లో అది 1,191 క్యూబిక్ మీటర్లకు పడిపోవచ్చని అంచనా. నితీ ఆయోగ్ సూచనల ప్రకారం, ఇప్పటికే 21 జిల్లాలు పూర్తి నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి.

2050లో అది 49కి పెరుగుతుందని భావిస్తున్నారు. పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా రాష్ట్రాలు భూగర్భ జలాలను తీవ్రంగా దోపిడీ చేస్తున్నాయి, దీనివల్ల వ్యవసాయం కూడా తీవ్రంగా దెబ్బతింటోంది. భారత రాజధాని ఢిల్లీలో ఈ సంవత్సరం త్రాగునీటి ఉత్పత్తి 20-30 శాతం తగ్గింది. బెంగళూరులో కూడా నీటి కొరత సమస్య తీవ్రంగానే ఉంది. ప్రతిపాదిత 44 నీటి ప్రాజెక్టులలో 37 ఇప్పటికే కొరత ప్రాంతాల్లో ఉన్నాయి.

సాధ్యమైన పరిష్కారాలు:

1. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా నీటి సరఫరాను పెంచడం
2. సమర్థవంతమైన నీటి నిర్వహణ వ్యవస్థలను బలోపేతం చేయడం
3. సమర్థవంతమైన నీటిపారుదల పద్ధతులను ప్రోత్సహించడం
4. అనుకూల నగర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం
5. శుద్ధి చేసిన మురుగునీటిని పునర్వినియోగం చేయడం

అధ్యయనంలో వెల్లడించిన విధంగా, వాతావరణ మార్పు వల్ల ప్రపంచవ్యాప్తంగా 750 మిలియన్ల మంది నీటి కొరతను ఎదుర్కొంటారని అంచనా. అందులో 290 మిలియన్లు గ్రామీణ ప్రాంతాల్లో, 470 మిలియన్లు పట్టణ ప్రాంతాల్లో ఉంటారు. ముఖ్యంగా ఆసియాలోని కొన్ని ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రంగా ప్రభావితమవుతాయని సూచిస్తున్నారు. ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోకపోతే.. భారతదేశం డే జీరో పరిస్థితుల దీర్ఘకాలిక యుగంలోకి ప్రవేశించే ప్రమాదంలో ఉందని హెచ్చరిస్తున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+