ప్రపంచ వ్యాప్తంగా తీవ్రంగా మారుతున్న వాతావరణం భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా డే జీరో కరువులు (Day Zero Droughts - DZD) రాబట్టే అవకాశాన్ని పరిశోధకులు హెచ్చరించారు. నేచర్ కమ్యూనికేషన్స్లో ప్రచురితమైన తాజా అధ్యయనం ప్రకారం, పెరుగుతున్న నీటి డిమాండ్ను పూరించలేకపోవడం వల్ల, పట్టణాలు మరియు వ్యవసాయ ప్రాంతాలు తీవ్రమైన నీటి కొరతతో బాధపడవచ్చని తెలిపింది.
డే జీరో కరువు (DZD) అంటే ఏమిటి?: DZD అనేది నీటి సరఫరా, డిమాండ్ సమతుల్యత దాటిపోయే దశను Day Zero Droughts అంటారు.. ఈ దశలో ప్రస్తుత వనరులతో ప్రజల అవసరాలను తీర్చడం అసాధ్యం అవుతుంది. పరిశోధకులు వాతావరణ నమూనాలు, గ్రీన్హౌస్ వాయు ఉద్గారాల దృష్ట్యా, DZD పరిస్థితులు ఇప్పటికే బయటపడుతున్నాయని, భవిష్యత్తులో మరింత తీవ్రంగా మారబోతున్నాయని పేర్కొన్నారు. భారతదేశంలో కొన్ని నగరాలు ముఖ్యంగా చెన్నై, ఇప్పటికే ఈ పరిమితికి చేరువలో ఉన్నాయి.

చెన్నైలో 20 లక్షలకు పైగా ప్రజలు ప్రతి 2-3 సంవత్సరాలకు కనీసం రెండు నెలలు మంచినీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. 2019లో నగరానికి 80 కోట్ల లీటర్ల నీరు అవసరమైంది కానీ 50 కోట్ల లీటర్లకే సరిపడింది. మరి, వేగంగా పెరుగుతున్న పట్టణ జనాభా కారణంగా పరిస్థితి మరింత దిగజారుతోందని కథనం తెలిపింది.
ప్రస్తుతం, భారతదేశంలోని జల వనరుల లభ్యత క్రమంగా తగ్గుతోంది. 1951లో ఒక్క వ్యక్తికి 5,200 క్యూబిక్ మీటర్ల నీరు లభించేది, 2021లో 1,486 క్యూబిక్ మీటర్లకు తగ్గింది. 2050లో అది 1,191 క్యూబిక్ మీటర్లకు పడిపోవచ్చని అంచనా. నితీ ఆయోగ్ సూచనల ప్రకారం, ఇప్పటికే 21 జిల్లాలు పూర్తి నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి.
2050లో అది 49కి పెరుగుతుందని భావిస్తున్నారు. పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా రాష్ట్రాలు భూగర్భ జలాలను తీవ్రంగా దోపిడీ చేస్తున్నాయి, దీనివల్ల వ్యవసాయం కూడా తీవ్రంగా దెబ్బతింటోంది. భారత రాజధాని ఢిల్లీలో ఈ సంవత్సరం త్రాగునీటి ఉత్పత్తి 20-30 శాతం తగ్గింది. బెంగళూరులో కూడా నీటి కొరత సమస్య తీవ్రంగానే ఉంది. ప్రతిపాదిత 44 నీటి ప్రాజెక్టులలో 37 ఇప్పటికే కొరత ప్రాంతాల్లో ఉన్నాయి.
సాధ్యమైన పరిష్కారాలు:
1. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా నీటి సరఫరాను పెంచడం
2. సమర్థవంతమైన నీటి నిర్వహణ వ్యవస్థలను బలోపేతం చేయడం
3. సమర్థవంతమైన నీటిపారుదల పద్ధతులను ప్రోత్సహించడం
4. అనుకూల నగర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం
5. శుద్ధి చేసిన మురుగునీటిని పునర్వినియోగం చేయడం
అధ్యయనంలో వెల్లడించిన విధంగా, వాతావరణ మార్పు వల్ల ప్రపంచవ్యాప్తంగా 750 మిలియన్ల మంది నీటి కొరతను ఎదుర్కొంటారని అంచనా. అందులో 290 మిలియన్లు గ్రామీణ ప్రాంతాల్లో, 470 మిలియన్లు పట్టణ ప్రాంతాల్లో ఉంటారు. ముఖ్యంగా ఆసియాలోని కొన్ని ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రంగా ప్రభావితమవుతాయని సూచిస్తున్నారు. ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోకపోతే.. భారతదేశం డే జీరో పరిస్థితుల దీర్ఘకాలిక యుగంలోకి ప్రవేశించే ప్రమాదంలో ఉందని హెచ్చరిస్తున్నారు.
More From GoodReturns

LPG: ఏడేళ్ల తర్వాత భారత్కు ఇరాన్ ఆయిల్: ఈ వారమే రాబోతున్న భారీ షిప్మెంట్!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..



Click it and Unblock the Notifications