భారతదేశం మరియు యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (EFTA) మధ్య ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ (TEPA) అక్టోబర్ 1న అమల్లోకి వస్తుంది. దీనిలో ఐస్లాండ్, లీచెన్స్టైన్, నార్వే మరియు స్విట్జర్లాండ్ నాలుగు సభ్యదేశాలు ఉన్నాయి.

భారత ఆర్థిక రంగంలో భారీగా $100 బిలియన్ పెట్టుబడి పెట్టేందుకు వచ్చే 15 ఏళ్లలో EFTA దేశాలు ముందుకొచ్చాయి. దీని ద్వారా 10 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యం ఉంది. ఈ హామీ ఒకవేళ నెరవేరకపోతే, భారత్ తన టారీఫ్ మినహాయింపులను వెనక్కి తీసుకునే హక్కు పొందింది.
ఈ పెట్టుబడుల ద్వారా 10 లక్షల ఉద్యోగాలు సృష్టించాలన్న లక్ష్యం ఉంది. ఈ పెట్టుబడులు క్లిన్ ఎనర్జీ, బయోటెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, డిజిటల్ ట్రేడ్ వంటి విభాగాలను మెరుగుపరుస్తాయి.
ఈ ఒప్పందానికి సంబంధించి కీలకమైన వాణిజ్య లక్షణాలు రెండుపక్షాల నుండి కీలక మినహాయింపుల రూపంలో వచ్చాయి. EFTA దేశాలు భారతదేశం నుండి జరిగే ఎగుమతులపై 92.2% టరీఫ్ లైన్లకు మినహాయింపులను అందించాయి, ఇది మొత్తం ఎగుమతుల్లో 99.6% ను కవర్ చేస్తుంది. ముఖ్యంగా నాన్-అగ్రికల్చర్ ఉత్పత్తులకు 100% టారీఫ్ రహిత ప్రవేశం లభించనుంది. ఇది భారత పరిశ్రమలకు అంతర్జాతీయ మార్కెట్లలో మరింత ప్రవేశాన్ని కల్పించే కీలక అవకాశం.
భారత్ తనవైపు 82.7% టరీఫ్ లైన్లపై మినహాయింపులు కల్పించింది. ఇది EFTA దేశాల ఎగుమతుల్లో 95.3% ను కవర్ చేస్తుంది. బంగారం దిగుమతికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చిన భారత్, దాదాపు 80% వరకూ బంగారం దిగుమతికి అవకాశాన్ని కల్పించింది. అయితే, బంగారంపై అమలులో ఉన్న దిగుమతి సుంకం (డ్యూటీ)లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు.
ఇక హామీల అమలులో కీలకమైన విషయంగా, కొన్ని సున్నితమైన రంగాలను భద్రపరిచారు. ఫార్మాస్యూటికల్స్, మెడికల్ డివైసెస్, ప్రాసెస్డ్ ఫుడ్ వంటి ఉత్పత్తుల విషయంలో భారత నిబంధనలకు విఘాతం కలిగించే అవకాశాలను నివారించేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే, డెయిరీ ఉత్పత్తులు, సోయా, కోల్, కొన్ని వ్యవసాయ ఉత్పత్తులు ఈ ఒప్పందం పరిధి నుంచి మినహాయించబడ్డాయి. ఈ ఒప్పందం ఒకవైపు విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పించగా, మరోవైపు దేశీయ పరిశ్రమల ప్రయోజనాలను సమర్థంగా కాపాడుతుంది.
ఈ ఒప్పందం ద్వారా స్విస్ వాచీలు (రోలెక్స్, ఒమెగా, కార్టియర్), చాక్లెట్లు, హై-ఎండ్ వైన్లను దిగుమతి చేసుకోవడం సులభమవుతుంది మరియు చౌకగా మారుతుంది. అయితే, $5 కంటే తక్కువ ధరలో ఉన్న వైన్లకు కన్సెషన్ ఇవ్వబడలేదు. ఇది దేశీయ వైన్ పరిశ్రమను కాపాడే నిర్ణయం.
డెయిరీ, సోయా, కోల్, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు ఇవన్నీ మినహాయింపుల జాబితాలో ఉన్నాయి. ఇదే విధంగా, ఫార్మా మరియు మెడికల్ డివైసెస్ రంగాలకు నియంత్రణలు సడలించకుండా ఉంచారు. అంతేకాదు, ఎవర్గ్రీనింగ్ పేటెంట్లు పై భారతదేశానికి పూర్తి రక్షణ లభిస్తుంది. అంటే, జెనరిక్ ఔషధాలు తయారీలో భారత్కు మళ్లీ పెద్ద విజయం.
ఈ ఒప్పందంలో సేవా రంగానికి పెద్ద ప్రాధాన్యం ఉంది. EFTA దేశాలు డిజిటల్, ఫైనాన్షియల్, బయోటెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్ రంగాలలో భారత పెట్టుబడులను ఆకర్షించాలనుకుంటున్నాయి. అంతేకాక, నర్సింగ్, చార్టెడ్ అకౌంటెన్సీ, ఆర్కిటెక్చర్ వంటి ప్రొఫెషనల్ సేవలకు Mutual Recognition Agreements (MRAs) ద్వారా ప్రవేశం కల్పించే అవకాశాలున్నాయి.
ఈ చర్చలు 2008లో మొదలై, 2013లో ఆగిపోయి, 2023లో మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇప్పుడు వీటన్నింటి ఫలితంగా మొత్తం 14 అధ్యాయాలతో కూడిన ఒప్పందం సిద్ధమైంది. ఇందులో వాణిజ్యం, సేవలు, మేధో సంపత్తి హక్కులు, సస్టెయినబుల్ డెవలప్మెంట్ వంటి అంశాలున్నాయి.
More From GoodReturns

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications