ITR Filing: ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేయడం కొత్త వారికి కొంత క్లిష్టంగా అనిపించవచ్చు. అయితే ఇటీవల ప్రారంభించిన ఆన్లైన్ ఫారమ్ల ద్వారా ఈ విధానం సరళీకృతం చేయబడింది. FY23కి గాను పన్ను చెల్లింపుదారులకు 30 రోజులలోపు 80 శాతం రీఫండ్లు అందించబడినట్లు సంబంధిత శాఖ వెల్లడించింది. తద్వారా ఈ ఫారమ్లు మరింత సౌకర్యవంతంగా మారినట్లు తెలుస్తోంది.
FY23లో ఆదాయపు పన్ను రీఫండ్ కోసం తీసుకున్న సగటు సమయాన్ని 16 రోజులకు తగ్గించినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ప్రకటించింది. FY22లో 26 రోజులతో పోలిస్తే గణనీయంగా మెరుగుపడినట్లు పేర్కొంది. రిటర్నుల ఫైలింగ్ మొదలైన మరుసటి రోజే దాఖలు చేసిన రిటర్నుల శాతం కూడా 21 నుంచి 42 శాతానికి పెరిగినట్లు తెలిపింది.

టెక్నాలజీ మరియు డిజిటల్ ప్లాట్ఫారమ్ల ఏకీకరణతో ఇది సాధ్యమైనట్లు తెలుస్తోంది. జూలై 28 2022న ఒకే రోజులో 22.94 లక్షల రిటర్న్లను ఆదాయపు పన్ను శాఖ ప్రాసెస్ చేసింది. ఇదే గరిష్ఠ స్థాయి కావడం విశేషం. సరిదిద్దాల్సిన అభ్యర్థనలు సైతం కేవలం 0.1 శాతానికి తగ్గాయి. అవి కూడా కేవలం తొమ్మిది రోజుల్లోనే ప్రాసెస్ చేయబడుతున్నాయి.
FY23 చివరి నాటికి 4 లక్షల మందికి ఫేస్ లెస్ అసెస్మెంట్ ను కూడా ప్రత్యక్ష పన్నుల శాఖ పూర్తి చేసింది. FY22 మరియు FY23 మధ్య ఈ ప్రక్రియకు సంబంధించిన ఫిర్యాదులు 60 శాతం తగ్గాయి. పెరుగుతున్న సాంకేతికతను ఎప్పటికప్పుడు చొప్పిస్తూ, పన్ను చెల్లింపుదారులకు సరళమైన రీతిలో సేవలు అందించడానికి ఆదాయపు పన్ను శాఖ చేసిన ప్రయత్నాల ఫలితమే ఇది అని ఒప్పుకోక తప్పదు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications