దేశంలోని ప్రజలందరి ఆకాంక్షలను పరిగణలోకి తీసుకుని నిర్మలాసీతారామన్ పెద్ద ప్రకటన చేశారు. ఇప్పటి వరకు రూ.5 లక్షల వరకు ఉన్న ఆదాయపన్ను పరిమితిని పెంచారు. ఈ పరిమితిని రూ.7 లక్షలకు పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారుఅయితే ఈ పన్ను మినహాయింపు న్యూ టాక్స్ విధానానికి మాత్రమే వర్తిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

పాత టాక్స్ విధానం కింద..
సార్వత్రిక ఎన్నికలకు ముందు సగటు భారతీయుడు ఎదురుచూసింది ఆదాయపుపన్ను శ్లాబ్ రేట్ల గురించే. వీటిపై శుభవార్త ప్రకటించిన నిర్మలా సీతారామన్ 2023 వార్షిక బడ్జెట్లో రూ.3 లక్షల వరకు ఎలాంటి టాక్స్ చెల్లించక్కర్లేదని తెలిపారు. రూ.3 నుంచి రూ.6 లక్షల వరకు 5 శాతం పన్ను, రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు ఆదాయంపై 10 శాతం పన్ను, రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉండే ఆదాయంపై 15 శాతం పన్ను, రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు సంపాదనపై 20 శాతం పన్ను, చివరగా రూ.15 లక్షల కంటే ఎక్కువ సంపాదనపై 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.

పాత టాక్స్ విధానం కింద..
సార్వత్రిక ఎన్నికలకు ముందు సగటు భారతీయుడు ఎదురుచూసింది ఆదాయపుపన్ను శ్లాబ్ రేట్ల గురించే. వీటిపై శుభవార్త ప్రకటించిన నిర్మలా సీతారామన్ 2023 వార్షిక బడ్జెట్లో రూ.3 లక్షల వరకు ఎలాంటి టాక్స్ చెల్లించక్కర్లేదని తెలిపారు. రూ.3 నుంచి రూ.6 లక్షల వరకు 5 శాతం పన్ను, రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు ఆదాయంపై 10 శాతం పన్ను, రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉండే ఆదాయంపై 15 శాతం పన్ను, రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు సంపాదనపై 20 శాతం పన్ను, చివరగా రూ.15 లక్షల కంటే ఎక్కువ సంపాదనపై 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.

తక్కువ పన్ను..
కొత్త టాక్స్ విధానం కింద ఏడాదికి రూ.9 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తి కేవలం రూ.45,000 పన్నుగా చెల్లిస్తే సరిపోతుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అదే విధంగా డైరెక్ట్ టాక్సుల చెల్లింపుల్లో వచ్చి చిక్కులు, గ్రీవిఎన్సుల పరిష్కారానికి మెకానిజంను బలోపేతం చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే కొత్త పన్ను విధానాన్ని డీఫాల్ట్ విధానంగా మార్చాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.

టాక్స్ డిడక్షన్..
నివాస గృహాల్లో పెట్టుబడులపై వచ్చే క్యాపిటల్ గెయిన్స్ లాభాల విషయంలో పన్ను తగ్గింపులను రూ.10 కోట్లకు పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు బడ్జెట్లో నిర్మలాసీతారామన్ ప్రటించారు. వేతనజీవులకు ఉపసమనం కల్పిస్తూ.. లీవ్ ఎన్క్యాష్మెంట్ పరిమితిని రూ.25 లక్షలకు పెంచినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications