Income Tax: కరోనా కాలంలో రెండు చేతులా సంపాదించేశారు చాలా మంది తెలివైన టెక్కీలు. కంపెనీల కళ్లు కప్పి ఒకేసారి రెండు జీతాలు అందుకున్న వారిని ఇప్పుడు ఆదాయపుపన్ను శాఖ పట్టుకుంది. మెుదటి విడత చర్యలు చేపట్టింది.
మూన్లైటింగ్ చేసిన ఉద్యోగులు ప్రస్తుతం ఐటీ శాఖ రాడార్లోకి వచ్చారు. దీంతో ఈ అంశం మరోసారి చర్చల్లో నిలిచింది. తాజాగా ఆదాయపు పన్ను శాఖ సాధారణ జీతం కంటే ఎక్కువ సంపాదించిన నిపుణులకు నోటీసులు జారీ చేయడం ప్రారంభించింది. ఎవరైతే తమ అదనపు ఆదాయాన్ని ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు ప్రకటించలేదో వారికి ఈ నోటీసులు వెళుతున్నట్లు తెలుస్తోంది. అంటే ఆదాయాన్ని తక్కువగా చూపించటంపై నోటీసులు పంపుతోంది.

తొలివిడతలో ఐటీ అధికారులు దాదాపు 1,100 మందికి నోటీసులు పంపినట్లు సమాచారం. ఇందులో చాలా వరకు 2019-2020, 2020-2021 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించినవి అంటే కరోనా కాలానికి సంబంధించిన ఆర్థిక సంవత్సరాల్లో రిటర్న్స్ ఫైల్ చేసిన వ్యక్తులకు నోటీసులు జారీ అయ్యాయి. మూన్లైటింగ్ ద్వారా వచ్చే ఆదాయం లేదా పూర్తి సమయం ఉద్యోగానికి తర్వాత పని చేయడం తరచుగా సాధారణ జీతం కంటే ఎక్కువ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరింత మందికి త్వరలోనే నోటీసులు రావొచ్చని తెలుస్తోంది.
డిజిటల్ రూపంలో చెల్లింపులు ఆన్లైన్లో జరిగాయి. కొన్ని విదేశీ ఖాతాల నుంచి స్వీకరించబడినందున సొమ్ము విషయంలో పన్ను శాఖ ఈ అప్రకటిత ఆదాయాలను డేటా పరిశీలనలో గుర్తించింది. అలాగే రెండు లేదా అంతకంటే ఎక్కువ కంపెనీల నుంచి నెలవారీ లేదా త్రైమాసిక చెల్లింపులు పొందుతున్న ఐటి, అకౌంటింగ్, మేనేజ్మెంట్ నిపుణులు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు ఒక సీనియర్ అధికారి వెల్లడించారు. మెుదటి రౌండ్ లో రూ.5 నుంచి రూ.10 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారికి నోటీసులు పంపినట్లు ఆయన వెల్లడించారు. కంపెనీల వద్ద పాన్ కార్డు వివరాల ఆదారంగా అధికారులు పన్ను ఎగవేతదారులను గుర్తించేపనిలో ఉన్నారు. కరోనా సమయంలో ఐటి రంగంలో, ముఖ్యంగా ఇంటి నుంచి పని చేసే వ్యక్తుల వల్ల మూన్లైటింగ్ ప్రజాదరణ పొందింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications