కరోనా సమయంలో ఇబ్బందులుపడుతున్న కొంతమంది పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటను కల్పించింది. ఆదాయ పన్ను శాఖ పలు ఓదార్పు చర్యలను ప్రకటించింది. ఉద్యోగులకు కరోనా ఖర్చుల కోసం కంపెనీలు ఇచ్చే ఆర్థిక సాయాన్ని ఆదాయ పన్ను నుండి మినహాయించింది. కరోనాతో చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కంపెనీలు చెల్లించే పరిహారంపై పూర్తిగా పన్ను మినహాయింపు కల్పించింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) ఉత్తర్వులు జారీ చేసింది.

పరిహారంపై పన్ను లేదు
ఉద్యోగులు మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులకు సంస్థలు ఇచ్చే పరిహారం మొత్తంపై ఎలాంటి పన్ను ఉండదని సీబీడీటీ వెల్లడించింది. ఇతరుల నుండి అందే సాయంపై రూ.10 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుందని పేర్కొంది. కరోనా నేపథ్యంలో చికిత్స కోసం పలువురికి వారి శ్రేయోభిలాషులు, బంధువులు ఆర్థిక సహాయం చేశారని, వారికి లభించిన మొత్తానికి లెక్కలు చూపడం వంటి అవసరం లేకుండా ఈ చర్య తోడ్పడుతుందని ఒక ప్రకటనలో తెలిపింది.

వివాద్ సే విశ్వాస్ పొడిగింపు
పన్ను చెల్లింపుదారులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన వివాద్ సే విశ్వాస్ పథకాన్ని ఆగస్ట్ 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. పన్ను చెల్లించేందుకు అక్టోబర్ 31వ తేదీ వరకు అవకాశం ఇస్తున్నట్లు పేర్కొంది. స్థిరాస్తిని విక్రయించినప్పుడు ఆ మొత్తాన్ని రెండు లేదా మూడేళ్లలో నిబంధనల ప్రకారం తిరిగి పెట్టుబడి పెట్టాలి. ఈ గడువు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుండి సెప్టెంబర్ 29 వరకూ ఉంటే.. సెప్టెంబరు 30 వరకు ఆ పెట్టుబడులు పెట్టేందుకు అనుమతినిచ్చింది.

ఈ గడువు పొడిగింపు
పాన్-ఆధార్ అనుసంధానం చివరి తేదీ కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. తద్వారా సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడువు ఉంది. ఉద్యోగులకు ఫామ్ 16లో టీడీఎస్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు సంస్థలకు ఉన్న గడువు జూలై 31 వరకు పెంచింది. 2020-21 జనవరి-మార్చి టీడీఎస్ స్టేట్మెంట్ దాఖలు గడువు జూలై 15వ తేదీ వరకు పొడిగించారు.
More From GoodReturns

March 31: రేపటితో ముగియనున్న ఆర్థిక సంవత్సరం.. ఈ 15 పనులు చేయకపోతే భారీ జరిమానా!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications