China: దాదాపు ప్రతి విషయంలోనూ స్వయం సమృద్ధి సాధించే దిశగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అడుగులు వేసింది. చైనా ఏకచత్రాధిపత్యానికి చెక్ పెట్టడం, 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా భారత్ ను తీర్చిదిద్దడంలో భాగంగా మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియా వంటి వివిధ స్కీమ్స్ తీసుకొచ్చింది. అవి కొంతమేర సత్ఫలితాన్నిచ్చినా, ఇప్పటికీ డ్రాగన్ దేశం నుంచి ఇండియా చేసుకుంటున్న దిగుమతులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి.
పలు స్మార్ట్ ఫోన్ తయారీ మరియు అసెంబ్లీ కంపెనీలతో పాటు సెమీకండక్టర్ ప్లాంట్లు భారత్ కు తరలిరావడంతో.. చైనాకు ప్రత్యామ్నాయంగా ఇండియా ఎదుగడానికి ప్రయత్నిస్తోంది. మేకిన్ ఇండియాలో భాగం కావడానికి చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజాలు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీదారులు సైతం స్థానికంగా ఇక్కడ ఆయా పరికరాలను తయారు చేయడం ప్రారంభించారు.

అయితే స్వావలంబన దిశగా ఒత్తిడి ఉన్నప్పటికీ, చైనా నుంచి భారతదేశం చేసుకుంటున్న దిగుమతులు FY23లో 4 శాతం కంటే ఎక్కువ పెరిగడం ఆలోచించాల్సిన విషయమే. దాదాపు 100 బిలియన్ డాలర్ల మేరకు డ్రాగన్ వైపు చూడాల్సి వచ్చింది. ముడి పదార్థాలు సహా ఇతర కీలక భాగాల విషయంలో చైనా మీద ఆధారపడటం తగ్గించుకోవాలని చూస్తున్న ఈ సమయంలో.. దాని ఎగుమతులు సైతం 28 శాతానికి పడిపోయాయి.
ఉత్పత్తికి సంబంధించిన భారీ ప్రోత్సాహకాలు ప్రకటించి ఫాక్స్ కాన్ మరియు పెగాట్రాన్ సహా ఇతర తయారీదారులను ఆకర్షించడానికి భారత్ ప్రయత్నించి విజయం సాధించింది. అయితే ఈ చర్య వల్ల చైనా నుంచి ఇండియా చేసుకుంటున్న అధిక శాతం దిగుమతులకు చెక్ పెట్టినట్టయింది. వీటికి తోడు ఆ దేశ సంస్థలపై నిషేధం, మనీలాండరింగ్ కు పాల్పడిన పలు కంపెనీలకు జరిమానాలు విధించడం వంటి చర్యలకు సైతం కేంద్రం వెనకాడలేదు. ఇతర దేశాల నుంచి ఎరువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు భారత్ కు రావడంతో చైనా దిగుమతులు పెరుగుతున్నా, సరుకుల పరంగా తగ్గుముఖం పట్టడం విశేషం.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications