Hyderabad: బిర్యానీ ట్యాక్స్ స్కామ్.. రూ. 70 వేల కోట్ల భారీ మోసాన్ని ఏఐ ఎలా పట్టేసిందంటే..

హైదరాబాద్ (Hyderabad) అంటే బిర్యానీకి పెట్టింది పేరు. కానీ, అదే బిర్యానీ ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద పన్ను ఎగవేత కుంభకోణాన్ని బయటపెట్టింది. సుమారు రూ. 70,000 కోట్ల విలువైన ఈ "బిర్యానీ ట్యాక్స్ స్కామ్" వెలుగులోకి రావడానికి ప్రధాన కారణం అత్యాధునిక సాంకేతికత. పోలీసులు, ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) , బిగ్ డేటా అనలిటిక్స్‌ను ఉపయోగించి ఈ భారీ నెట్‌వర్క్‌ను ఛేదించారు.

How AI tools helped police unearth massive 70000 crore biryani tax scam by analyzing 60TB billing data

తీగ లాగితే డొంక కదిలింది

మొదట హైదరాబాద్‌లోని కొన్ని ప్రముఖ బిర్యానీ రెస్టారెంట్లలో సాధారణ తనిఖీలు చేసిన అధికారులకు బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌లో తేడాలు కనిపించాయి. కస్టమర్లు డబ్బులు కట్టిన తర్వాత కూడా ఆ బిల్లులను సాఫ్ట్‌వేర్ నుండి డిలీట్ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ చిన్న క్లూతో అహ్మదాబాద్‌లోని ఒక ప్రముఖ బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ డేటా సెంటర్‌పై దాడులు చేయగా.. దేశవ్యాప్తంగా లక్షకు పైగా రెస్టారెంట్లు ఇదే సాఫ్ట్‌వేర్‌ ను వాడుతున్నట్లు తేలింది.

60 టెరాబైట్ల డేటా.. ఏఐ విశ్లేషణ

సుమారు 1.77 లక్షల రెస్టారెంట్ ఐడీలకు సంబంధించిన 60 టెరాబైట్ల భారీ డేటాను విశ్లేషించడం మానవ మాత్రులకు సాధ్యం కాని పని. ఇక్కడే అధికారులు జనరేటివ్ ఏఐ (Generative AI)ని రంగంలోకి దించారు. 2019 నుండి 2026 వరకు ఉన్న ఆరు సంవత్సరాల లావాదేవీలను ఈ ఏఐ సాధనాలు నిమిషాల్లో స్కాన్ చేశాయి.

  • బిల్లుల తొలగింపు: దేశవ్యాప్తంగా సుమారు రూ. 13,000 కోట్ల విలువైన బిల్లులను రెస్టారెంట్ యజమానులు డిలీట్ చేసినట్లు ఏఐ గుర్తించింది.
  • మొత్తం మోసం: ఇలా లెక్కల్లో చూపకుండా దాచిన మొత్తం టర్నోవర్ రూ. 70,000 కోట్లుగా తేలింది.
  • పద్ధతులు: ముఖ్యంగా నగదు (Cash) రూపంలో వచ్చే బిల్లులను మాత్రమే సిస్టమ్ నుండి తొలగించి, కేవలం ఆన్‌లైన్ పేమెంట్లను మాత్రమే లెక్కల్లో చూపిస్తూ పన్ను ఎగ్గొడుతున్నారు.

ఏ రాష్ట్రాల్లో ఎక్కువ?

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలలోనే సుమారు రూ. 5,100 కోట్ల అమ్మకాలను దాచిపెట్టినట్లు విచారణలో వెల్లడైంది. అధికారులు 40 రెస్టారెంట్లలో నేరుగా తనిఖీలు చేయగా, అక్కడ కూడా రూ. 400 కోట్ల మేర అవకతవకలు బయటపడ్డాయి. ఈ స్కామ్‌లో కర్ణాటక మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి. కర్ణాటకలో అత్యధికంగా రూ. 2,000 కోట్ల విలువైన బిల్లులను డిలీట్ చేసినట్లు ఏఐ ద్వారా తెలిసింది.

ఏఐ ఎలా సహాయపడింది?

అధికారులు జిఎస్‌టి (GST) నంబర్లను , ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఏఐ టూల్స్ ద్వారా అనుసంధానించారు. దీనివల్ల ఏ హోటల్ ఎంత బిజినెస్ చేస్తోంది, కానీ ట్యాక్స్ రిటర్న్స్‌లో ఎంత చూపిస్తోంది అనే తేడాలను (Discrepancies) సులభంగా పట్టుకోగలిగారు. ఇది కేవలం ఒక సాఫ్ట్‌వేర్ ద్వారా బయటపడిన స్కామ్ మాత్రమేనని, ఇలాంటివి ఇంకా చాలా ఉండవచ్చని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) భావిస్తోంది.

మొత్తంగా టెక్నాలజీని ఉపయోగించి పన్ను ఎగ్గొట్టాలని చూసిన వారికి, అదే టెక్నాలజీతో అధికారులు చెక్ పెట్టారు. భవిష్యత్తులో పన్ను ఎగవేతదారులను పట్టుకోవడానికి ఈ ఏఐ సాధనాలు మరింత కీలకం కానున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+