Biraja Rout: ఉద్యోగం వదిలేసి బర్గర్ సెంటర్ పెట్టాడు.. రూ.20 వేల పెట్టుబడితో రూ.100 కోట్లు సంపాదించాడు..
ఇండియాలో పాశ్చత్య సంస్కృతి క్రమంగా పెరుగతోంది. ముఖ్యంగా ఆహారం విషయంలో వేగంగా మార్పులు వస్తున్నాయి. దీంతో మన దేశంలో బర్గర్లు బాగా ప్రాచుర్యం పొందాయి. ముఖ్యంగా మెక్డొనాల్డ్స్, బర్గర్ కింగ్ వంటి పెద్ద కంపెనీలతో పేరుతో బర్గర్లు తయారు చేస్తున్నారు. ఒక భారతీయ స్వదేశీ బ్రాండ్ ఈ పెద్ద పేర్లకు గట్టి పోటీనిస్తుంది. అదే బిగ్గీస్ బర్గర్. బిరాజా రౌట్ మొదటి నుంచి భారతీయ వినియోగదారుల కోసం ప్రామాణికమైన గ్రిల్డ్ బర్గర్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.
అతని వ్యాపారం ప్రస్తుతం రూ.100 కోట్లకు చేరింది. బిరాజా రౌట్ ఇన్ఫోసిస్ లో పని చేసేవాడు. కానీ తన ఉద్యోగానికి రాజీనామా చేసి రూ. 20,000 పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించాడు. ఇప్పుడు రూ. 100 కోట్లకు పైగా కంపెనీగా తయారు చేశాడు. బిరాజా రౌట్ బెంగుళూరుకు చేరిన తర్వాత IT ప్రొఫెషనల్గా పనిచేయడం ప్రారంభించాడు. అతను తన మొదటి బర్గర్ను 21 సంవత్సరంలో తయారు చేయడానికి ప్రయత్నించాడు. అది అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చుతుందని ఊహించలేదు. బిరాజాకు, బర్గర్ కేవలం అల్పాహారం మాత్రమే కాదు, అతని ఆకలిని తీర్చే పూర్తి భోజనంగా ఉండాలనుకున్నాడు.

బర్గర్లకు ప్రసిద్ధి చెందిన భారతీయ స్వదేశీ బ్రాండ్ లేదని అతను గుర్తించాడు. అతను ఎప్పుడూ కలలు కనే బిగ్గీస్ బర్గర్ అని పేరు పెట్టబడిన ఈ కొత్త ఉత్తేజకరమైన వ్యాపారాన్ని కిక్స్టార్ట్ చేయడానికి తన ఇన్ఫోసిస్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఈ టెక్కీ నుంచి ఫుడ్ప్రెన్యూర్గా మారిన తర్వాత బిరాజా యూట్యూబ్ ట్యుటోరియల్స్ చూసి బర్గర్లను తయారు చేయడం నేర్చుకున్నాడు. 20,000 రూపాయల పెట్టుబడితో బెంగళూరులోని ఇన్ఫోసిస్ కార్యాలయం సమీపంలో ఒక చిన్న బర్గర్ కియోస్క్ను ప్రారంభించాడు. ఇది జనాదరణ పొందింది. కియోస్క్ పూర్తి స్థాయి స్టోర్గా పరిణామం చెందింది.
అభిరుచి, దృఢ సంకల్పంతో, బిగ్గీస్ బర్గర్ నెమ్మదిగా అతిపెద్ద, అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతీయ బర్గర్ బ్రాండ్గా ఎదిగింది. 2023లో రూ. 100 కోట్ల కంపెనీగా ఆవతరించింది. తన వ్యాపారాన్ని విస్తరించడం బిరాజ తదుపరి లక్ష్యం బిగ్గీస్ బర్గర్ను టైర్ 2, టైర్ 3 నగరాలకు తీసుకెళ్లడం. బిగ్గీస్ బర్గర్ 28 నగరాలు, 14 రాష్ట్రాల్లో 130 స్టోర్లను కలిగి ఉంది. ఈ కంపెనీ ఇప్పటివరకు 50 లక్షల బర్గర్లను విక్రయించింది.


Click it and Unblock the Notifications