GST: భారీగా పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. మార్చిలో రూ.1,60,122 కోట్లు వసూళ్లు..
జీఎస్టీ వసూళ్లు మార్చిలో 13 శాతం పెరిగాయి. మార్చిలో గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ వసూళ్లు అంతకు ముందు సంవత్సరం కన్నా 13% పెరిగి రూ. 1,60,122 కోట్లకు చేరుకుంది. జూలై 2017లో GST అమలులోకి వచ్చిన తర్వాత ఇది రెండో అత్యధిక వసూళ్లు నమోదు చేసింది.మార్చిలో స్థూల GST వసూళ్లలో CGST రూ. 29,546 కోట్లు, SGST రూ. 37,314 కోట్లు, రికార్డు స్థాయిలో IGST రూ. 82,907 కోట్లు వచ్చినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. నిన్నటితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో స్థూల జీఎస్టీ వసూళ్లు నాలుగోసారి నెలకు రూ.1.5 లక్షల కోట్ల మార్కును దాటాయి.
మార్చిలో దాఖలు చేసిన రిటర్న్లు కూడా రికార్డు స్థాయిలో పెరిగాయి. ఫిబ్రవరిలో ఇన్వాయిస్ల స్టేట్మెంట్లో 93.2% (GSTR-1లో), 91.4% రిటర్న్లు (GSTR-3Bలో) మార్చి 2023 వరకు దాఖలు చేరాయి. గత ఏడాది ఇదే నెలలో వరుసగా 83.1శాతంగా, 84.7శాతంగా ఉన్నాయి.గత ఆర్థిక సంవత్సరంలో స్థూల GST సేకరణ సంవత్సరానికి 22 శాతం పెరిగి రూ. 18.10 లక్షల కోట్లకు చేరుకుంది. పూర్తి సంవత్సరానికి సగటు స్థూల నెలవారీ వసూళ్లు రూ. 1.51 లక్షల కోట్లకు చేరుకుంది.

FY2023 చివరి త్రైమాసికంలో సగటు నెలవారీ స్థూల GST వసూళ్లు రూ. 1.55 లక్షల కోట్లు, మొదటి త్రైమాసికంలో రూ.1.51 లక్షల కోట్లు, రెండో త్రైమాసికంలో రూ.1.46 కోట్లు, మూడో త్రైమాసికంలో రూ. 1.49 లక్షల కోట్లు వచ్చాయి. మార్చిలో ఢిల్లీ నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం ఆదాయం CGSTకి రూ.62,954 కోట్లు, SGSTకి రూ.65,501 కోట్లు వచ్చాయి. నెలలో, వస్తువుల దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయాలు 8% ఎక్కువగా ఉన్నాయి. దేశీయ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయాలు (సేవల దిగుమతితో సహా) సంవత్సరంలో 14% ఎక్కువగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications