కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా నిత్యావసరాలకు ఆన్ లైన్ ద్వారా డిమాండ్ పెరిగింది. ఆర్డర్లు పెరుగుతున్న నేపథ్యంలో సామర్థ్యం పెంచుకునేందుకు కొత్తగా ఉద్యోగులను నియమించుకోనున్నట్లు ఆన్లైన్ ఆర్డర్స్ నిత్యావసరాల సరఫరా సంస్థ గ్రోఫర్స్ తెలిపింది. తమ యాప్ ద్వారా ఆర్డర్లు ఇచ్చేందుకు రోజుకు 15 లక్షలమంది ప్రయత్నిస్తున్నారని తెలిపింది.
లాక్ డౌన్ కారణంగా ఆన్లైన్ ఆర్డర్లకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు రానున్న రెండు వారాల్లో 5,000 మంది ఉద్యోగులను చేర్చుకుంటామని గోఫర్స్ తెలిపింది. అంతేకాదు, మెట్రో నగరాల్లోని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్తో జత కట్టింది. గ్రోఫర్స్ కో ఫౌండర్, సీఈవో అల్బిందర్ దిండ్సా మాట్లాడుతూ... ప్రస్తుత పరిస్థితుల్లో తమ యాప్ ద్వారా 1.5 మిలియన్ల మంది ఆర్డర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
తాము ప్రతి ఎనిమిది మంది కస్టమర్లలో ఒకరికి మాత్రమే సేవలు అందించగలుగుతున్నామని, అందుకే మరింత సామర్థ్యాన్ని పెంచుకుంటామని అల్బిందర్ చెప్పారు. లాక్ డౌన్ సమయంలో ఈ-కామర్స్ వెబ్ సైట్లు కస్టమర్లకు నిత్యావసరాలు అందించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు, అధికారులు అడ్డుకునే పరిస్థితులు ఎదుర్కొన్నారు.

ప్రజలకు నిత్యావసరాలు, ఫుడ్ అందించేందుకు ఈ-కామర్స్ వెబ్ సైట్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. అయినప్పటికీ కాస్త డెలివరీ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అంతేకాదు, ఆన్లైన్ వ్యాపారానికి డిమాండ్ పెరగడంతో అందరికీ సేవలు అందించలేని పరిస్థితులు కూడా ఎదురువుతున్నాయి.
24 నగరాల్లో తమ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, తమ గిడ్డంగులలో 70 శాతం నిత్యావసరాలు ఉన్నాయని, కరోనా కారణంగా దెబ్బతిన్న టెక్స్టైల్, మానుఫ్యాక్చరింగ్ తదితర రంగాల నుండి ఇప్పటికే 2000 మందిని తీసుకున్నామని, మరో 5,000 మంది ఉద్యోగులను రానున్న రెండు వారాల్లో తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. అంతకుముందు వారం గ్రోఫర్స్ రైవల్ బిగ్బాస్కెట్ 10,000 మంది ఉద్యోగులను తీసుకోనున్నట్లు ప్రకటించింది. గత మూడు వారాల్లో 22 నగరాల్లో 10 లక్షల ఆర్డర్స్ డెలివరీ చేసినట్లు అల్బిందర్ దిండ్సా తెలిపారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?



Click it and Unblock the Notifications