గ్రామీణ రోడ్లపై దృష్టి పెట్టాలి: బడ్జెట్‌పై అసోచామ్ సూచన

ఢిల్లీ: ప్రభుత్వం పల్లెల్లో రోడ్ల పైన దృష్టి పెట్టాలని, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ సహజంగానే పెరుగుతుందని ది అసోసియేటెడ్ చాంపర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (అసోచామ్) పేర్కొంది. జీఎస్టీ రేట్ల సవరణ, విద్య, వైద్యం పైన వ్యయం పెంచడం వంటి పలు అంశాలను ప్రభుత్వం ముందు ఉంచింది. రానున్న బడ్జెట్‌లో ద్రవ్యలోటును నిస్సంకోచంగా పక్కనపెట్టి తయారు చేయాలని పేర్కొంది.

భారత్‌లో వ్యయాలను పెంచేందుకు, ఎగుమతులను పెంచేందుకు రవాణా రంగం ప్రధానంగా ఉపయోగపడుతుందని అసోచామ్ అధ్యక్షులు వినీత్ అగర్వాల్ అన్నారు. ప్రధాని గ్రామసడక్ యోజన కింద ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు కేటాయింపులు పెంచాలని, ఇది గ్రామీణ ప్రాంతాలలో ఉపాధిపై సానుకూల ప్రభావం చూపుతుందని, దీంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు అవసరమైనదారులు, మండీలు, కోల్డ్ స్టోరేజీల ఏర్పాటకు కేటాయింపులు పెరగాలని అన్నారు. వ్యవసాయరంగంలో టెక్నాలజీల ఆవిష్కరణను ప్రోత్సహించేలా నిధులను ఏర్పాటు చేయాలన్నారు.

Govt must focus on developing village roads to push rural demand: Assocham

కరోనా సమయంలో ప్రభుత్వ వ్యయాలు పెరిగాయని అసోచామ్ తెలిపింది. మొదటి త్రైమాసికం బలహీనంగా ఉన్నా, ఆ తర్వాత నిత్యావసర వస్తువుల వినియోగం గణనీయంగా పెరిగిందని తెలిపింది. అయితే ఇది ఎక్కువగా ఆన్ లైన్ మార్కెట్‌కు మొగ్గినట్లు తెలిపింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+